India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో అమానుష ఘటన వెలుగుచూసింది. గోపాలపురం చెరువులో సోమవారం పసికందు మృతదేహం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మగశిశువు మృతదేహం చెరువులో తేలియాడుతూ కనిపించిందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ పారేసి ఉంటారని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు శిశువు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.
హనుమకొండ జిల్లాలో ఓటరు చైతన్యంపై రేపు (మంగళవారం) ఉదయం 6 గంటలకు నిర్వహించే 5కె రన్ను అనివార్య కారణాలవల్ల వాయిదా వేయడం జరిగిందని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన తదుపరి తేదీని, విషయాలను త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు.
షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ, వరంగల్ జిల్లా ద్వారా DSCఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకొనుటకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ జిల్లాలో గల షెడ్యూల్డు కులాల నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని వరంగల్ జిల్లా షెడ్యూల్ కులాల అధికారి భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. బీఎడ్ లేదా డైట్ నందు అర్హత సాధించిన SC విద్యార్థులందరూ అర్హులన్నారు. వివరాలకు 9346374583 నంబర్ను సంప్రదించాలన్నారు.
వరంగల్ పార్లమెంట్ ప్రస్తుత & మాజీ శాసన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులతో పాటు వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, డా.సుధీర్ కుమార్ సోమవారం కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ నేతలు పార్లమెంట్ స్థానం కైవసం చేసుకుంటామని, అందుకు అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వినయ్ భాస్కర్, తదితరులున్నారు.
కేసీఆర్ స్వగృహంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎన్నికలలో వరంగల్ గడ్డ పై గులాబీ పార్టీ జెండా ఎగురవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
నాలుగు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ మార్కెట్ ఈరోజు పునఃప్రారంభం కావడంతో పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం గత వారంతో పోలిస్తే ఈరోజు భారీగా తగ్గింది. ఈరోజు క్వింటా పత్తి ధర రూ.7,100 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ధర రోజు రోజుకీ పడిపోతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. కాగా, మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది.
వేసవిలో ప్రయాణికులకు చల్లదనం కోసం ఓ ఆటో వాలా చేసిన ఆలోచన అందరినీ ఆకట్టుకుంటోంది. మహబూబాబాద్ జిల్లా దర్గా తండాకు చెందిన అంజి అనే ఆటో యజమాని తన ఆటోలో ఎక్కేవారికి వేసవి ప్రభావం ఉండకుండా టాప్ పై మొక్కలు పెంచుతున్నాడు. ఆటో టాప్ పై ఇనుప ప్లేటును అమర్చి మట్టి పోసి గడ్డి పూల మొక్కలను పెంచుతూ వాటికి నీడ ఉండేలా గ్రీన్ పరదను ఏర్పాటు చేశారు. దీంతో ఆటోలో కూర్చున్న వారికి కూల్గా ఉంటుంది.
మామూనూరులో విమానాశ్రయ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇద్దరు ప్రయాణించేలా మూడు చిన్న మైక్రోలైట్ విమానాల ద్వారా ఇక్కడి నుంచి పర్యటించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 775 ఎకరాల్లో ఉన్న విమానాశ్రయం అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా వాతావరణ అనుకూల పరిస్థితులు, సిగ్నల్ వ్యవస్థ తదితరాలపై 2 నెలలపాటు సర్వే చేపట్టేందుకు ప్రత్యేక సర్వే బృందం వచ్చి, 250 ఎకరాలకు సంబంధించి హద్దులు ఏర్పాటుచేశారు.
జనగామలో దారుణం జరిగింది. మతి స్థిమితం లేని ఓ వ్యక్తిపై ముగ్గురు యువకులు చౌరస్తాలో కర్రలతో దాడి చేశారు. స్థానికుల ప్రకారం.. కారు అద్దాలు పగలగొట్టాడని కళాధర్, కమలాకర్, చిర్ర కమలాకర్తో పాటు.. మరికొందరు భాస్కర్ అనే వ్యక్తిపై విచక్షణా రహితంగా కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్రగాయాలపాలైన అతడిని MGMకు తరలించగా.. చికిత్సపొందుతూ మృతి చెందాడు.
WGL నగరానికి తాగునీటి ఎద్దడి ముప్పు పొంచి ఉందని గ్రేటర్ WGL ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. ఎండల నేపథ్యంలో ధర్మసాగర్ పెద్ద చెరువులో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. శనివారం నాటికి చెరువులో ఉన్న 605 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీరు.. మరో 50-60 రోజుల వరకు సరిపోతాయని అంచనా వేస్తున్నారు. దీనిపై గ్రేటర్ WGL పర్యవేక్షణ ఇంజినీర్ ప్రవీణ్చంద్ర మాట్లాడుతూ.. వచ్చే జూన్ మొదటి వారం వరకు ఢోకా లేదని అన్నారు.
Sorry, no posts matched your criteria.