Warangal

News April 26, 2024

వరంగల్ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. గురువారం రూ.7,020 పలికిన క్వింటా పత్తి.. ఈరోజు రూ.7100 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. ఎండాకాలం నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ సరుకులను మార్కెట్‌కు తీసుకొని రావాలని అధికారులు సూచించారు. మార్కెట్లో క్రయవిక్రయాల ప్రక్రియ కొనసాగుతోంది.

News April 26, 2024

WGL: మే 6 నుంచి DEGREE పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, కోర్సుల్లో 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి, నాలుగో సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరగనున్నాయి. రెండో సెమిస్టర్ పరీక్షలు మే 6, 8, 10, 16, 18, 21, 24, 27వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు మే 7, 9, 15, 17, 20, 22, 25, 28వ తేదీల్లో ఉదయం9 నుంచి 12 వరకు జరగనున్నాయి.
SHARE

News April 26, 2024

JEE ఫలితాల్లో సత్తా చాటిన ఓరుగల్లు బిడ్డలు

image

JEE మెయిన్స్‌లో వరంగల్ విద్యార్థులు సత్తాచాటారు. ఓపెన్ కేటగిరీలో మనీశ్ 126వ ర్యాంకు సాధించగా.. రిజర్వేషన్ కేటగిరీలో నవీన్ జాతీయ స్థాయిలో 5, నందిని 12, సాత్విక్ రెడ్డి 42వ ర్యాంకు సాధించారు. వివిధ కేటగిరీల్ల భరత్ కుమార్ 34, శ్రీతమ్ 71, మాలిక్ 142, హరిచరణ్ 371, పంజన 406, ధీరజ్ 755, రేనిత్(1064)తో పాటు.. పలువరు ర్యాంకు సాధించి ఔరా అనిపించారు.
SHARE

News April 26, 2024

WGL: బుజ్జగింపుల పర్వం మొదలు!

image

నామపత్రాల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓ వైపు ప్రచారం చేస్తూనే, మరోవైపు తమ ఓటు బ్యాంకు చీలకుండా వ్యూహాలు రచిస్తున్నారు. తమకు నష్టం కలిగించే స్వతంత్రులను పోటీ నుంచి తప్పించి తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవాలనే ఆలోచనతో బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. ప్రత్యర్థి అభ్యర్థుల ఓటుబ్యాంకును గండికొట్టే స్వతంత్రులను ఎలాగైనా పోటీలో ఉండకుండా చేసేట్లు సంప్రదింపులు చేస్తున్నారు.

News April 26, 2024

అప్పుడు 2019లో.. మళ్లీ ఇప్పుడు 2024లో

image

వర్ధన్నపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. ఐదేళ్ల క్రితం సరిగ్గా అదే రోజు.. అంటే 2019 ఏప్రిల్ 24 బుధవారం కూడా ఒకే బైకుపై వెళ్తున్న ఆదిత్య(20), మురళీధర్‌రావు(17), రాంసాయిలు(17) పంథని గ్రామ శివారులో చెట్టును ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తిరిగి ఐదేళ్ల తర్వాత రనిల్ కుమార్, సిద్ధూ, వరుణ్ తేజ్, గణేశ్‌లు బైకుపై వెళ్తూ బస్సు ఢీకొని మృతి చెందారు.

News April 26, 2024

ఎంపీ ఎన్నికలు.. వరంగల్‌లో 89, మహబూబాబాద్‌లో 56

image

వరంగల్ MP స్థానానికి 58 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. APR 18 నుంచి 25 వరకు నిర్వహించిన నామినేషన్ల స్వీకరణలో భాగంగా 58 మంది అభ్యర్థులకుగాను 89 నామినేషన్ల పత్రాలు దాఖలు చేసినట్లు వివరించారు. కాగా, MHBD పార్లమెంట్ స్థానానికి 30 మంది 56 నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే WGL స్థానంలో ఒక్కరోజే 24మంది, MHBD స్థానంలో 9 మంది నామినేషన్లు వేశారు.

News April 26, 2024

జనగామ: బాలికపై అత్యాచారం

image

రఘునాథపల్లి మండలంలోని ఓ కామాంధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. SI డి.నరేశ్ ప్రకారం.. 9వ తరగతి చదువుతున్న బాలిక(14)ను అదే గ్రామానికి చెందిన రమేశ్(30) మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక ఎవరికీ చెప్పుకోలేక ఇంట్లో ముభావంగా ఉంటోంది. గమనించిన తల్లి మందలించడంతో విషయం చెప్పింది. దీంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 26, 2024

KU డిగ్రీ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం

image

KU డిగ్రీ (BA/B.Com/BBA/B.Sc/BCA/B.Voc/BHM & CT) రెండవ, నాల్గవ, అరవ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ తిరుమలా దేవి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.kakatiya.ac.inలో చూడవచ్చని అన్నారు.

News April 25, 2024

వరంగల్: మొత్తం 58 మంది నామినేషన్ల స్వీకరణ

image

15 వరంగల్ ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థానానికి గురువారం నాటికి మొత్తం 58 మంది నామినేషన్లు వేశారని వరంగల్ జిల్లా రిటర్నింగ్ అధికారి పి. ప్రావీణ్య తెలిపారు. మొత్తం 89 నామినేషన్ల సెట్లు స్వీకరించామని అన్నారు. రేపు ఈ నామినేషన్ల పరిశీలన చేస్తామని తెలిపారు. అనంతరం నామినేషన్ల తిరస్కరణ, స్వీకరణ విషయాలని తెలియజేస్తామన్నారు.

News April 25, 2024

ప్రశాంతంగా ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభమైనాయని ఆ జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి టెన్త్ లో 86.6%, ఇంటర్లో 85.60% మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో రామ్ కుమార్ అన్నారు. వరంగల్ లో టెన్త్ లో 86%, ఇంటర్లో 90 శాతం విద్యార్థులు హాజరయ్యారని డీఈవో వాసంతి అన్నారు. ములుగు జిల్లాలో టెన్త్ లో 80%, ఇంటర్లో 80% హాజరయ్యారని డిఇఓ పాణిని తెలిపారు.