Warangal

News April 16, 2024

WGL: రామయ్యకు రెండు సార్లు పెండ్లి

image

లింగాల ఘన్పూర్ మండలం జీడికల్‌‌‌‌లోని వీరాచల రామచంద్రస్వామి ఆలయం రెండో భద్రాద్రిగా పేరుగాంచింది. జిల్లా కేంద్రానికి13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో ఏటా రెండు సార్లు రాములోరి కల్యాణం జరుగుతుంది. శ్రీరామనవమితో పాటు కార్తీకమాసంలోని పునర్వసు నక్షత్రంలో ఇక్కడ కల్యాణ వేడుకలు వైభవంగా జరుగుతాయి. భద్రాచలంలోని ఆలయం రాముడి ప్రేమకు ప్రతీకగా చెప్పుకుంటే జీడికల్‌‌‌‌లో రాముడిని వీరత్వానికి ప్రతీకగా చెప్తుంటారు.

News April 16, 2024

WGL: ఆన్ లైన్‌లో రాములవారి తలంబ్రాలు

image

భద్రాచలంలో ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్బంగా జరిగే శ్రీ సీతారామచంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్లైన్‌లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది. సంస్థ లాజిస్టిక్స్ విభాగ వైబ్ సైట్ tsrtclogistics.in సందర్శించి విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందండి. ఆఫ్లైన్‌లో తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లపై 040-23450033ను సంప్రదించాలన్నారు.

News April 15, 2024

పార్టీకి మోసం చేసిన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: కేటీఆర్

image

వరంగల్‌లో చివరి క్షణంలో కడియం కుటుంబం పార్టీకి మోసం చేసిన వ్యవహారం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ జిల్లా నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కొందరు నాయకులు వలస వెళ్లినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని, ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిగా భావించి బీఆర్ఎస్ గెలుపు కోసం కదం తొక్కాలని అన్నారు.

News April 15, 2024

హనుమకొండలో అమానుష ఘటన

image

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో అమానుష ఘటన వెలుగుచూసింది. గోపాలపురం చెరువులో సోమవారం పసికందు మృతదేహం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మగశిశువు మృతదేహం చెరువులో తేలియాడుతూ కనిపించిందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ పారేసి ఉంటారని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు శిశువు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

News April 15, 2024

5కె రన్ వాయిదా: జిల్లా కలెక్టర్

image

హనుమకొండ జిల్లాలో ఓటరు చైతన్యంపై రేపు (మంగళవారం) ఉదయం 6 గంటలకు నిర్వహించే 5కె రన్‌ను అనివార్య కారణాలవల్ల వాయిదా వేయడం జరిగిందని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన తదుపరి తేదీని, విషయాలను త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు.

News April 15, 2024

డీఎస్సీ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ, వరంగల్ జిల్లా ద్వారా DSCఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకొనుటకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ జిల్లాలో గల షెడ్యూల్డు కులాల నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని వరంగల్ జిల్లా షెడ్యూల్ కులాల అధికారి భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. బీఎడ్ లేదా డైట్ నందు అర్హత సాధించిన SC విద్యార్థులందరూ అర్హులన్నారు. వివరాలకు 9346374583 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News April 15, 2024

కేటీఆర్‌ను కలిసిన వరంగల్ ఎంపీ అభ్యర్థి

image

వరంగల్ పార్లమెంట్ ప్రస్తుత & మాజీ శాసన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులతో పాటు వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, డా.సుధీర్ కుమార్ సోమవారం కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ నేతలు పార్లమెంట్ స్థానం కైవసం చేసుకుంటామని, అందుకు అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వినయ్ భాస్కర్, తదితరులున్నారు.

News April 15, 2024

వరంగల్ గడ్డ పై గులాబీ పార్టీ జెండా ఎగురవేయాలి: కేటీఆర్

image

కేసీఆర్ స్వగృహంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్‌తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎన్నికలలో వరంగల్ గడ్డ పై గులాబీ పార్టీ జెండా ఎగురవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

News April 15, 2024

ప్రారంభమైన మార్కెట్.. పత్తి ధర ఎంతంటే?

image

నాలుగు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ మార్కెట్ ఈరోజు పునఃప్రారంభం కావడంతో పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం గత వారంతో పోలిస్తే ఈరోజు భారీగా తగ్గింది. ఈరోజు క్వింటా పత్తి ధర రూ.7,100 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ధర రోజు రోజుకీ పడిపోతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. కాగా, మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది.

News April 15, 2024

MHBD: చల్లదనం కోసం ఆటో వాలా సూపర్ ఐడియా!

image

వేసవిలో ప్రయాణికులకు చల్లదనం కోసం ఓ ఆటో వాలా చేసిన ఆలోచన అందరినీ ఆకట్టుకుంటోంది. మహబూబాబాద్ జిల్లా దర్గా తండాకు చెందిన అంజి అనే ఆటో యజమాని తన ఆటోలో ఎక్కేవారికి వేసవి ప్రభావం ఉండకుండా టాప్ పై మొక్కలు పెంచుతున్నాడు. ఆటో టాప్ పై ఇనుప ప్లేటును అమర్చి మట్టి పోసి గడ్డి పూల మొక్కలను పెంచుతూ వాటికి నీడ ఉండేలా గ్రీన్ పరదను ఏర్పాటు చేశారు. దీంతో ఆటోలో కూర్చున్న వారికి కూల్‌గా ఉంటుంది.