Warangal

News August 26, 2024

ములుగు: గవర్నర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

ఈనెల 27, 28న ములుగు జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పర్యటన గవర్నర్ పర్యటన ఏర్పాట్లను ఆదివారం కలెక్టర్ దివాకర టిఎస్ పరిశీలించారు. పాలంపేటలోని రామప్ప దేవాలయం, లక్నవరం లేక్, హరిత కాటేజ్‌ల సుందరీకరణ పనులను పరిశీలించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News August 25, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి టాప్ న్యూస్..

image

> MLG: బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి
> HNK: జిల్లాలో బీసీ శంఖారావం సదస్సు
> WGL: ‘హైడ్రా’ లాగా.. వరంగల్లో ‘వాడ్రా’!
> JN: బోనమేత్తిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
> HNK: కొత్తిమీర కిలో @200 రూపాయలు
> WGL: కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి: ఎమ్మెల్యే కూనంనేని
> HNK: తీజ్ ఉత్సవాల్లో పాల్గొని నృత్యం చేసిన ఎంపీ కడియం కావ్య
> BHPL: చిత్రకళలో రాణిస్తున్న చిన్నారి ఆద్య

News August 25, 2024

సమభావంతో స్వీకరిస్తూ, స్థితప్రజ్ఞతతో ముందుకు సాగాలి: మంత్రి సురేఖ

image

జీవన గమనంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, కష్టసుఖాలను సమభావంతో స్వీకరిస్తూ ముందుకు సాగాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ద్వాపరయుగమైనా, కలియుగమైనా, సర్వకాలాల్లోనూ శ్రీకృష్ణుడు చూపిన బాట సదా ఆచరణీయమని మంత్రి చెప్పారు.

News August 25, 2024

ములుగు: డ్రైవింగ్ సీట్లోనే ప్రాణాలోదిలాడు!

image

డ్రైవింగ్ సీట్లోనే లారీ డ్రైవర్ ప్రాణాలోదిలిన ఘటన ములుగు జిల్లా వెంకటాపురం రహదారిలో జరిగింది. ఇసుక లోడు చేసుకుని వెళ్తున్న రమేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ప్రాణం పోయే క్రమంలో లారీని రోడ్డు పక్కకు ఆపి మృతి చెందాడని తోటి లారీ డ్రైవర్లు తెలిపారు. వెంకటాపురం పోలీసులకు సమాచారం అందించగా.. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 25, 2024

‘హైడ్రా’ లాగా.. వరంగల్‌లో ‘వాడ్రా ‘!

image

వరంగల్‌లో ‘ వాడ్రా’ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే HYDలో చెరువుల రక్షణ కోసం అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. అదే తరహాలో WGLలో వాడ్రా ఏర్పాటును ప్రజలు కోరుతున్నారు. ఇటీవల MLA రాజేందర్ రెడ్డి సైతం వాడ్రా ఏర్పాటుపై యోచిస్తున్నట్లు చెప్పారు. 2020లో WGLలో అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News August 25, 2024

పరకాల వాసికి అమేజింగ్‌ ఇండియన్స్‌ అవార్డు

image

పరకాల మున్సిపాలిటీ రాజుపేటకు చెందిన మహిపాల్ చారి ఢిల్లీలో అమేజింగ్‌ ఇండియన్స్‌ అవార్డు-2024 స్వీకరించారు. తన కళా నైపుణ్యంతో మినీ కల్టివేటర్‌ను ఆవిష్కరించినందుకు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు పత్తి, మిర్చి పంటల సాగులో రైతులకు ఉపయోగపడే మినీ కల్టివేటర్‌, శ్రీవరి సాగు వీడర్‌, మినీ ట్రాక్టర్‌ను తయారు చేశారు. 2018లో నేషనల్‌ ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్‌ అవార్డు సైతం అందుకున్నారు.

News August 25, 2024

విద్యార్థుల నడవడికను గమనించాలి: వరంగల్ సీపీ

image

వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల నడవడికను యాజమాన్యాలు గమనిస్తూ ఉండాలని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. కమిషనరేట్‌లోని డిగ్రీ, జూనియర్ కళాశాల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల్లో గంజాయిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీపీ కోరారు. కమిషనరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

News August 25, 2024

వరంగల్ మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలి: మంత్రి పొంగులేటి

image

వరంగల్ నగరాన్ని మరో నగరంగా తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం డా.బీఆర్ అంబేడ్కరర్ సచివాలయంలోని తన కార్యాలయ సమావేశ మందిరంలో ‘కూడా’ అధికారులు, పలుశాఖల అధికారులతో వరంగల్ నగర అభివృద్ధిపై సమీక్షంచారు.

News August 24, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్..

image

> MLG: వయనాడ్ బాధితులకు అండగా ఉంటాం: సీతక్క
> MHBD: గుంజేడులో అరుదైన ఉడుత
> WGL: మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలి: మంత్రి పొంగులేటి
> BHPL: జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు
> HNK: విద్యార్థులు లక్ష్యం వైపు అడుగులు వేయాలి: సీపీ
> JN: అవినీతికి ఆస్కారం లేకుండా అభివృద్ది చేస్తా: కడియం
> MLG: లక్నవరంలో గవర్నర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

News August 24, 2024

లక్నవరంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈనెల 27, 28 తేదీల్లో ములుగు జిల్లాలో పర్యటించునున్నారు. అందులో భాగంగా ఆయన లక్నవరం సరస్సు, ఐలాండ్ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సుందరీకరణ ఏర్పాట్ల పనులను శనివారం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పరిశీలించారు.