Warangal

News April 14, 2024

వరంగల్: రేపు గడువు చివరి తేదీ

image

ఈ నెల 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఈ నెల 15 వరకు సమయం ఉంది. ఫారం-6 నింపి, ధ్రువీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక BLOకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు మార్పులు చేసుకోవచ్చు.

News April 14, 2024

వరంగల్: చోరీ చేసిన చర్చి పాస్టర్

image

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పరావుపేటలో ఈ నెల 11న జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. సీఐ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. అలంఖానిపేటకు చెందిన దంతాల రవి అప్పలరావుపేటలో చర్చి పాస్టర్‌గా పని చేస్తున్నాడు. రోజూ చర్చికి వెళ్లే వీరభద్రరావుకు రవికి పరిచయం ఏర్పడింది. దీంతో రవి.. వీరభద్రరావు ఇంట్లో లేని సమయంలో 6 తులాల బంగారం, రూ.60,200 చోరీ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు.

News April 14, 2024

వరంగల్‌లో SUMMER CRICKET

image

క్రికెట్‌ ప్లేయర్లకు HYD క్రికెట్ అసోసియేషన్ శుభవార్త చెప్పింది. HCA ఆధ్వర్యంలో ఈనెల 20న జిల్లాల వారిగా సమ్మర్ క్యాంప్‌ మొదలుపెడుతామని ప్రెసిడెంట్ జగన్‌ మోహన్‌‌‌రావు తెలిపారు. ఉచితంగా‌నే ఈ క్యాంప్‌ కొనసాగిస్తామని‌ స్పష్టం చేశారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందన్నారు.
కేంద్రాల వివ‌రాలు:
వ‌రంగ‌ల్‌: 98495 70979,
ములుగు: 90301 30727,
మ‌హ‌బూబాబాద్‌: 98664 79666,
భూపాల‌ప‌ల్లి: 88978 05683.

News April 14, 2024

వరంగల్: కాకతీయుల సమాచారం.. క్యూఆర్ కోడ్‌లో నిక్షిప్తం

image

కాకతీయుల కట్టడాలున్న ఖిలా వరంగల్ కోట సమాచారంతో పాటు కాకతీయుల చరిత్రను పర్యాటకులకు డిజిటల్ విధానంలో అందించేందుకు కేంద్ర పురావస్తు శాఖ అధికారులు శ్రీకారం చుడుతున్నారు. ఈమేరకు కాకతీయుల చరిత్రను క్యూఆర్ కోడ్‌లో నిక్షిప్తం చేసి బోర్డులను ఖిలా వరంగల్ కోట పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పర్యాటకులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడంతో కట్టడాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

News April 13, 2024

వరంగల్ నగరంలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్

image

వరంగల్ నగరంలోని సికేఎం కళాశాల మైదానంలో నేడు ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ నిర్వహించారు. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య నేడు మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయడంతో వరంగల్ నగరంలోని క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున కళాశాల మైదానానికి విచ్చేసి స్క్రీన్ల ద్వారా మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు.

News April 13, 2024

MHBD: క్వారీ గుంతలో పడి బాలిక మృతి

image

క్వారి గుంతలో పడి ఓ బాలిక మృతి చెందిన ఘటన MHBD పట్టణంలో చోటుచేసుకుంది. బోడ నికిత(11) అనే బాలిక మరికొందరితో కలిసి శనివారం బట్టలు ఉతికేందుకు మహబూబాబాద్ పట్టణం ఆర్తి గార్డెన్ సమీపంలోని క్వారీ వద్దకు వెళ్లింది. బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారీ గుంతలో పడి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News April 13, 2024

ఈనెల 15న నర్సంపేటలో సదరం క్యాంపు

image

ఈనెల 15న నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరాన్ని నిర్వహించనున్నట్లు వరం ఏపీడీ పరగల్ జిల్లా పెన్షన్ల విభాగంమాత్మ ఒక ప్రకటనలో తెలిపారు. నర్సంపేట డివిజన్‌కు చెందిన చెవిటి, లోకో మోటార్, ఓహెచ్ విభాగాలకు దరఖాస్తు చేసుకున్న వారు హాజరుకావాలన్నారు. ఈనెల 15న క్యాంపు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి స్లాట్ లో వర్ధన్నపేట అని ఉన్నప్పటికీ నర్సంపేటలో జరిగే క్యాంపుకు రావాలని సూచించారు.

News April 13, 2024

ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం

image

భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరిట ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవ పోరాటాలపై కొనసాగిస్తున్న హత్యకాండను, నరహంతక దాడులను వ్యతిరేకించండి అంటూ లేఖలో పేర్కొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పిట్టపడ వద్ద గ్రేహౌండ్స్ పోలీసులు చేసిన ఏకపక్ష దాడిని ఖండించాలంటూ.. ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు.

News April 13, 2024

భూపాలపల్లి: కేటీపీపీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

image

కాకతీయ థర్మల్ విద్యుత్తు కేంద్రం(కేటీపీపీ) చెల్పూర్లోని మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్లో విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో బాయిలర్ ట్యూబ్లో లీకేజీతో ఉత్పత్తి నిలిచిపోయినట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా బాయిలర్ ట్యూబ్ లీకేజీ కావడం సర్వసాధారణంగా మారిపోయిందన్నారు. లీకేజీలోని సాంకేతిక కారణాలను మరమ్మతుకు 24 గంటల సమయం పడుతుందని తెలిపారు.

News April 13, 2024

WGL: ఆర్టీసీ ద్వారా భక్తులకు ఇంటి వద్దకే తలంబ్రాలు

image

శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాలను ఆర్టీసీ ద్వారా భక్తులకు ఇంటి వద్దకే అందిస్తున్నామని మహబూబాబాద్ డిపో మేనేజర్ ఎమ్.శివ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి తలంబ్రాలు కోరుకునే భక్తులు రూ.151తో బుకింగ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు లాజిస్టిక్స్ కౌంటర్, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ను సంప్రదించాలని కోరారు.