Warangal

News April 13, 2024

WGL: నేను పార్టీ మారట్లేదు: మాజీ ఎమ్మెల్యే

image

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ MLA నన్నపునేని నరేందర్ స్పందించారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నాపై గత కొన్ని రోజులుగా వచ్చే దుష్ర్పచారాలను నమ్మకండి. నేను BRSలోనే ఉన్నా. నాపై కావాలనే కొందరు కుట్ర పన్ని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు. BJPలో చేరేది లేదు.. BRSలోనే కొనసాగుతా’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

News April 13, 2024

పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి: కావ్య

image

పదేళ్ల తమ బీజేపీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అని, వారికి ఓటు వేస్తే నష్టపోయేది ప్రజలే అన్నారు. బీజేపీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజలకు మళ్ళీ కష్టాలు తప్పవని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలన్నారు.

News April 13, 2024

WGL: ఉపాధి హామీ పనుల్లో అట్టడుగున నాలుగు జిల్లాలు

image

ఉపాధి హామీ పనిలో ఉమ్మడి జిల్లా వెనుకబడింది. 33 జిల్లాలలో ములుగు జిల్లా 31వ స్థానంలో, వరంగల్ 30వ స్థానంలో, భూపాలపల్లి 29వ స్థానం, జనగామ 22వ స్థానంలో ఉన్నాయంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లా ఎంతో మెరుగ్గా రాష్ట్ర స్థాయిలో 5వ స్థానంలో ఉండగా హనుమకొండ 17వ స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే.. ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాలు ఉపాధి హామీ పథకంలో చాలా వెనుకబడ్డాయి.

News April 13, 2024

వరంగల్: నిన్న మిత్రులు.. నేడు ప్రత్యర్థులు

image

పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్, BJP నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య పోటీ చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు కూడా నిన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వారే. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన పరిణామాల నేపథ్యంలో వారంతా వేర్వేరు పార్టీల నుంచి బరిలో ఉన్నారు.

News April 13, 2024

వరంగల్: ముగ్గురివి బీఆర్ఎస్ మూలాలే!

image

వరంగల్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు బీఆర్ఎస్ మూలాలు ఉన్న వారే. 2001 నుంచి బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న మారేపల్లి సుధీర్ కుమార్‌ను అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గతంలో బీఆర్ఎస్‌లో పనిచేశారు. ఆ పార్టీ నుంచి టికెట్ కూడా దక్కింది. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ అభ్యర్థి రమేశ్ 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

News April 13, 2024

ఆర్టీసీ కార్గో ద్వారా భక్తులకు సీతారాముల తలంబ్రాలు

image

శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా భక్తులకు (ఇంటింటికీ) అందిస్తున్నామని జనగామ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కొండం అవినాశ్ తెలిపారు. స్వామివారి తలంబ్రాలు కోరుకునే భక్తులు రూ.151తో బుకింగ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు లాజిస్టిక్స్ కౌంటర్, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ను సంప్రదించాలని కోరారు.

News April 13, 2024

ములుగు: బీజేపీకి బుద్ధి చెప్పాలి: సీతక్క

image

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. తన పర్యటనలో భాగంగా గిరిజనులతో కలిసి మంత్రి సీతక్క కాసేపు డోలు వాయించి సందడి చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.

News April 12, 2024

హనుమకొండ: పెరిగిన బస్సు ఛార్జీలు!

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని నయీంనగర్ పెద్ద మోరీ వద్ద బ్రిడ్జి నిర్మిస్తున్న సందర్భంగా బస్సులు ములుగు రోడ్డు నుంచి తిరిగి వెళుతున్నాయి. దీంతో బస్సు ఛార్జీలు నేటి నుంచి ఆర్టీసీ అధికారులు పెంచారు. హుజూరాబాద్ నుంచి హనుమకొండకు రూ.50 ఉంటే రూ.10 పెంచి రూ.60 చేశారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల ప్రయాణికులపై భారం మోపడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. పెంచిన ఛార్జీలు తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News April 12, 2024

జనగామ: ఎండ తీవ్రతకు నెమళ్లు మృతి?

image

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బండ నాగారం గ్రామం సమీపంలో ఓ వ్యవసాయ బావి వద్ద అనుమానాస్పదంగా రెండు నెమళ్లు మృతి చెందిన ఘటన జరిగింది. ఎండ తీవ్రతతో నెమళ్లు మృతి చెందినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 12, 2024

కనీస హక్కులను హరించే దిశగా బీజేపీ అడుగు వేస్తుంది: మంత్రి

image

మనిషి కనీస హక్కులను హరించే దిశగా బీజేపీ అడుగు వేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. బీజేపీ, BRS హయాంలో పేద బలహీన వర్గాల మీద అన్యాయం జరిగిందని, ఎన్నికలకు ముందు ED వస్తుంది తర్వాత మోడీ వస్తారని సీతక్క మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో గుంట భూమి ఇచ్చింది లేదని, అదానీ అంబానీలకు మన వనరులని కట్టబెట్టి బడా వ్యాపార నేతలకు మన బతుకులు అప్పగించారని సీతక్క విమర్శించారు.