India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
15 ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థానానికి మొత్తం మంగళవారం ఏడుగురు నామినేషన్ వేశారని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మొత్తం 9 సెట్ల నామినేషన్ దాఖలు అయ్యాయని అన్నారు. వీరిలో పోగుల అశోక్ (IND) ఒక సెట్ నామినేషన్, మచ్చ దేవేందర్ (VCKP) 2 సెట్ల నామినేషన్, కుమ్మరి కన్నయ్య (IND) ఒక సెట్ నామినేషన్, కొంగర అనిల్ కుమార్ (IND) ఒక సెట్ నామినేషన్, చిలుముళ్ళ సుజాత (IND) ఒక సెట్ నామినేషన్ వేసారన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ వేసవి శిక్షణ కోర్సులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని హనుమకొండ డిఈఓ అబ్దుల్ హై ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను తేదీ 24.04.2024 నుంచి 30.04.2024 వరకు స్వీకరిస్తామన్నారు. దరఖాస్తు చేయువారు 22.04.2024 నాటికి 18 సంవత్సరాలు నుండి 45 సంవత్సరముల లోపు ఉండి టెన్త్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం తేజ మిర్చి క్వింటా రూ.17,800 ధర పలకగా.. 341 రకం మిర్చి రూ.14,000 పలికింది. అలాగే వండర్ హాట్(WH) రకం మిర్చి రూ.14,000 పలికింది. దీపిక మిర్చి రూ.15వేలు, 5531 రకం మిర్చి రూ.11,500 ధర, టమాటా మిర్చికి 24వేల ధర వచ్చింది. పసుపు కాడి క్వింటాకి రూ.14,155, పసుపు గోల రూ.13723, మక్కలు బిల్టీ రూ.2265 ధర పలికాయి.
ఖానాపురం మండలం బుధారావుపేట గ్రామంలో జాతీయ రహదారి పై మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. నర్సంపేట నుంచి బుధరావుపేటకి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న సులేమాన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పలువురు మహిళలకి గాయాలు అయ్యాయి. కారు డ్రైవరు అక్కడి నుంచి పరారు అయ్యారు. పోలీసులు కేసునమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన ఘటన ములుగు మండలం మహ్మద్గౌస్పల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చింతల రాజు (35) మతిస్థిమితం కోల్పోయి పంచోతుకులపల్లికి నడుకుంటూ వెళ్లి వడ దెబ్బతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్ నామినేషన్ సందర్భంగా అఫిడవిట్లో ఆయన ఆస్తి వివరాలను పొందుపర్చారు. ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.3.06 కోట్లు. కుటుంబం వద్ద 87 తులాల బంగారు ఆభరణాలు, మూడు కార్లు ఉన్నాయి. 6.17ఎకరాల వ్యవసాయ భూములు, శేరిలింగంపల్లి అయ్యప్పసొసైటీ, హన్మకొండలో నివాస గృహాలు ఉన్నాయి. కాగా, రూ.1.37కోట్ల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా తగ్గింది. నిన్న రూ.7,150 పలికిన క్వింటా పత్తి ఈరోజు రూ.7100 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. పత్తి ధర రోజురోజుకు తగ్గుతుండడంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
BHPL జిల్లా గణపురం మండలంలోని <<13099643>>కర్కపల్లి జీపి కార్యదర్శిగా<<>> విధులు నిర్వహిస్తున్న శ్రావణి ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. స్థానికులు గమనించిన వెంటనే WGLలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ఆమె మృతి చెందారు. అయితే ఆదివారం ఉదయం ఆమె ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కొండగట్టులో జరుగుతున్న హనుమాన్ చిన్న జయంతి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన లక్ష్మణ్(55) కుటుంబంతో కలిసి కొండగట్టు వచ్చారు. ఉచిత బస్సు ఎక్కబోయి లక్ష్మణ్ కాలు జారి కిందపడగా బస్సు చక్రం కింద పడి వ్యక్తి రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో వెంటనే లక్ష్మణ్ను 108లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాలోతు కవిత నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఎంపీ అభ్యర్థి కవిత సమర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, బానోతు శంకర్ నాయక్, బానోతు హరిప్రియ, కాంతారావు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.