Warangal

News April 24, 2024

అమెరికాలో వరంగల్ వాసి మృతి

image

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లికి చెందిన యువకుడు పార్శీ గౌతమ్(19) అమెరికాలోని అరిజోనా లో బీటెక్ చదువుతున్నాడు. గౌతమ్ తన స్నేహితులతో కలిసి జలపాతం చూసేందుకు వెళ్లాడు. తిరిగి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో కారును వెనక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు అరిజోనా పోలీసులు తెలిపారు.

News April 22, 2024

వరంగల్ విమానాశ్రయ ఏర్పాటుకు అడుగులు?

image

మామునూరు ఎయిర్‌పోర్టు నుంచి చిన్న మైక్రోలైట్ విమానాలు ప్రయాణించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం WGL ఎయిర్ స్ట్రిప్ పరిధిలో 706 ఎకరాలు ఉండగా.. మరో 400 ఎకరాలు కావాల్సి ఉంది. అందులో భాగంగా 253 ఎకరాలు కేటాయిస్తూ గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విమానాశ్రయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.750 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంది.

News April 22, 2024

భూపాలపల్లి: పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

image

గణపురం మండలం కర్కపల్లి పంచాయతీ కార్యదర్శి శ్రావణి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన శ్రావణి, భర్త స్నానానికి వెళ్లి వచ్చే సరికి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన భర్త వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 22, 2024

WGL: ధాన్యం కొనుగోలు కేంద్రాల సమస్యలపై కంట్రోల్ రూమ్ : కలెక్టర్

image

రైతులు అధైర్యపడొద్దని కొనుగోలు కేంద్రాల్లో ప్రతి గింజను కొనుగోలు చేస్తామని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. రైతులు దళారుల వద్ద మోసపోకుండా కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని ఆమె సూచించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏదైనా సమస్యలున్న కంట్రోల్ రూమ్ నెంబర్ 79950 50785ను సంప్రదించాలని కోరారు.

News April 21, 2024

డోర్నకల్: రెండు బైకుల ఢీ.. ఒకరు మృతి

image

ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డోర్నకల్ పట్టణ కేంద్రంలోని శివాలయం సమీపంలో వేగంగా వచ్చిన రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి స్పాట్‌లోనే మృతిచెందాడు. మరో నలుగురికి గాయాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

News April 21, 2024

MHBD: ‘అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ఉంటే బ్రతికి ఉండేవాడు’ 

image

చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామానికి చెందిన జక్కుల హరీశ్(28), అతని కొడుకు ఆశ్విత్ తేజ్(5)లు నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో <<13091376>>మృతి<<>>చెందిన విషయం తెలిసిందే. ఐతే ఆశ్విత్ తేజ్ రోజు అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళే వాడు. నిన్న తండ్రితో పాటు పెళ్లి వేడుకకు వెళ్లకుండా అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ఉంటే బ్రతికి ఉండేవాడని ఆశ్విత్ తేజ్ మృతదేహాన్ని చూసి అంగన్వాడీ టీచర్లు కన్నీటి పర్యంతం అయ్యారు.

News April 21, 2024

వరంగల్: రెండు బైక్‌‌లు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

image

డోర్నకల్ మండల కేంద్రంలోని శివాలయం సమీపంలో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంలో 108 వాహనంలో ఏరియా హాస్పిటల్ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 21, 2024

వెంకటాపురం: పెళ్లి జరిగిన 17 రోజులకే సూసైడ్

image

నవ వధువు సూసైడ్ చేసుకున్న ఘటన వెంకటాపురం మండలంలోని ముత్తారంలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శశికళకు భద్రాద్రి జిల్లా చర్ల మండలానికి చెందిన వినోద్‌తో ఈనెల 4న వివహం జరిగింది. అత్తవారి ఇంటి నుంచి నాలుగు రోజులు కిందటే పుట్టింటికి వచ్చింది. శనివారం మెట్టినింటికి వెళ్లేందుకు ఆమె అయిష్టత చూపడంతో తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెంది ఇంట్లోని పురుగు మందు తాగింది.

News April 21, 2024

వరంగల్: ఎరుపెక్కిన ఎనుమాముల మార్కెట్

image

వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లు జోరుగా జరుగుతున్నాయి. కొనుగోళ్లు జరిపినప్పుడు బస్తాల నుంచి మిర్చి గింజలు పడడంతో శనివారం కురిసిన భారీ వర్షానికి మార్కెట్‌లోని మిర్చి కొనుగోలు పరిసరాలు ఇలా ఎర్రటి తివాచీలా.. కనువిందు చేస్తోంది. మార్కెట్‌కు ఎర్రటి సింధూరం పెట్టినట్లుగా మార్కెట్ మొత్తం ఎరుపు మయం అయింది.

News April 21, 2024

జనగామ: తండ్రిపై కత్తితో దాడి చేసిన కొడుకు

image

తండ్రిపై దాడిచేసిన కొడుకుపై హత్యాయత్నం నర్మెట్ట SI కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని మాన్ సింగ్ తండాకు చెందిన హరిచంద్రు కుమారుడు బిక్షపతి మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి మద్యం తాగి భార్యతో గొడవ పడుతుండగా తండ్రి అడ్డుపడ్డాడు. దీంతో కుమారుడు హరిచంద్రు భుజంపై కత్తితో దాడి చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు SI తెలిపాడు.