Warangal

News April 8, 2024

పార్టీ మార్పుపై చల్లా ధర్మారెడ్డి క్లారిటీ  

image

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నానని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి, పార్టీ మారిన వారితో ఎలాంటి నష్టం లేదని, పార్టీకి ద్రోహం చేసిన వారిని తిరిగి బీఆర్ఎస్‌లో చేర్చుకునే ఆలోచన లేదని అన్నారు.

News April 8, 2024

యశస్వినిరెడ్డి గెలుపుతో రాష్ట్రమంతా పాలకుర్తి వైపు చూసింది: కడియం

image

26ఏళ్ల యశస్వినిరెడ్డి గెలుపుతో రాష్ట్రమంతా పాలకుర్తి వైపు చూసిందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీరెడ్డి కుటుంబం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. రాక్షస పాలన నుంచి యశస్విని రెడ్డి అందరికీ విముక్తి కల్పించారని కొనియాడారు. మీ అందరితో కలిసి నడుద్దామని తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు.

News April 8, 2024

దేవరుప్పుల: అనారోగ్యంతో వీఆర్ఏ మృతి

image

దేవరుప్పుల మండలం సీతారాంపురంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాజాబీ(55) వృత్తి రీత్యా వీఆర్ఏగా కొడకండ్లలో పని చేస్తుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

News April 8, 2024

హనుమకొండ: ఏప్రిల్ 15 నుంచి ఎంఫార్మసీ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 15 నుంచి ఎంఫార్మసీ మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహచారి షెడ్యూల్ ప్రకటించారు. ఏప్రిల్ 15, 18, 20, 22తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.

News April 8, 2024

HNK: 16 నుంచి ఎంపీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలు

image

కేయూ పరిధిలో ఎంపీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఎస్.నర్సింహాచారి తెలిపారు. 16న మొదటి పేపర్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైనింగ్, 19న స్పోర్ట్స్ మెడిసిన్, 22న హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్, 24న స్పోర్ట్స్ ఇంజినీరింగ్. పరీక్షల ఉ.10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటాయన్నారు.

News April 8, 2024

రఘునాథ్‌పల్లి: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

image

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండలం ఫతేషాపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండ ఉమేశ్(28) జనగామలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ ఇబ్బందుల దృష్ట్యా వ్యవసాయ భూమి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News April 8, 2024

TRR: ఆర్టీసీ బస్సుపై ప్రయాణికుల దాడి

image

తొర్రూరు నుంచి జగద్గిరిగుట్టకు వెళ్లే రూట్‌లో సక్రమంగా బస్సులు నడపటం లేదు దీంతో బస్సులు సకాలంలో రావడం లేదని ప్రయాణికులు తొర్రూరులోని ఆర్టీసీ బస్టాండ్‌లో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. బస్సులో సంఖ్యకు మించి బయల్దేరనున్న క్రమంలో తమను కూడా ఎక్కించుకోవాలని పలువురు వాదిస్తూ బస్సు అద్దాలపై కొట్టడంతో ముందు భాగంలో ఉన్న రెండు అద్దాలు పగిలిపోయాయి.

News April 8, 2024

ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్

image

నేడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు  వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. అధికారులు, సిబ్బంది పార్లమెంట్ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున రద్దు చేస్తున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని గమనించి జిల్లా నుంచి ప్రజలు ఫిర్యాదులు ఇవ్వడానికి కలెక్టరేట్ కార్యాలయానికి రాకూడదని కలెక్టర్ కోరారు.

News April 7, 2024

నర్సంపేట: కాంగ్రెస్ నాయకురాలి కారులో రూ.6లక్షలు స్వాధీనం

image

నర్సంపేట పట్టణంలో పోలీసులు వాహనాల తనిఖీల్లో రూ.6లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట శివారు మహేశ్వరంలోని చెక్ పోస్టు వద్ద ఆదివారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేశారు. వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ కారులో తరలిస్తున్న రూ.6లక్షలను పట్టుకున్నారు. సరైన లెక్కపత్రాలు చూపకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

News April 7, 2024

రఘునాథ్‌పల్లి: రైలు కిందపడి విద్యార్థిని ఆత్మహత్య

image

డిగ్రీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండలం అశ్వరావుపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సోని(20) ఇటీవల విడుదలైన డిగ్రీ ఫలితాల్లో ఫెయిల్ అయింది. మనస్తాపానికి గురైన విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.