Warangal

News April 7, 2024

KU: 16 నుంచి LLB సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో LLB 5 ఏళ్ల కోర్సు మొదటి, ఐదో సెమిస్టర్ పరీక్షలు, మూడు ఏళ్ల కోర్సు మొదటి సెమిస్టర్ (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్ విద్యార్థులు) పరీక్షలు ఈ నెల 16 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి నర్సింహాచారి వెల్లడించారు.

News April 7, 2024

ములుగు: జీతం అడిగినందుకు గేదెల కాపరిపై దాడి

image

గేదెలు కాసినందుకు జీతం డబ్బులు అడిగిన కాపరిపై యజమాని దాడి చేసిన ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో జరిగింది. బాధితుడు దుర్గం దుర్గయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ముప్పనపల్లికి చెందిన యజమాని అంజయ్యకు చెందిన గేదెలను కాసిన డబ్బులు ఇవ్వాలని అడగగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అంజయ్య కర్రతో దుర్గయ్యపై దాడి చేశాడు. కాగా అంజయ్యపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

News April 7, 2024

కొమురవెల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

image

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి ఈరోజు భక్తులు పోటెత్తారు. నేడు ఆదివారం కావడంతో మల్లన్న క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మల్లన్నకు బోనాలు, పట్నాలు, గంగిరేగు చెట్టుకు ముడుపులు, ప్రదక్షిణలు, అభిషేకం, అర్చనలు చేస్తూ స్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతుందని భక్తులు చెబుతున్నారు.

News April 7, 2024

20 రోజుల వ్యవధిలో 20 మంది మావోయిస్టులు మృతి

image

ఆకు రాలే కాలం వచ్చిందంటే అడవుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లుతోంది. 20 రోజుల వ్యవధిలోనే 20 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. చత్తీస్‌గఢ్ గడ్చిరోలిలో 13 మంది మృతి చెందగా.. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు చనిపోయారు. తాజాగా శనివారం తెలంగాణ సరిహద్దు పూజారికాంకేర్ కర్రిగుట్టల(ములుగు జిల్లా) అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. 

News April 7, 2024

నేడు ఐనవోలు మల్లన్న ఆలయంలో పెద్దపట్నం

image

ఐనవోలు మల్లికార్జునస్వామి అలయంలో ఆదివారం పెద్దపట్నంను వైభవంగా నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి రానుండడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలోనే అత్యంత పెద్దపట్నం వేస్తున్నట్లు ఈవో అద్దంకి నాగేశ్వర్ రావు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా 100 మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నట్లు పర్వతగిరి సీఐ శ్రీనివాస్ తెలిపారు.

News April 7, 2024

నేటితో నిట్‌లో ముగియనున్న వేడుకలు

image

నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న వసంతోత్సవ వేడుకల్లో శనివారం రెండో రోజు కల్చరల్ ఫెస్ట్ కలర్ ఫుల్‌గా నిలిచింది. విద్యార్థులు ఉత్సాహంగా 35కు పైగా ఈవెంట్లలో పాల్గొన్నారు. కాగా మూడు రోజుల వసంతోత్సవ వేడుకలు ఆదివారంతో ముగియనున్నాయి. ముగింపు కార్యక్రమానికి సీతారామం సినిమా డైరెక్టర్ హను రాఘవపూడి, హీరో నవదీప్ హాజరు కానున్నారు.

News April 6, 2024

పెద్దమ్మగడ్డ కెనాల్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం: సీఐ

image

హనుమకొండలోని పెద్దమ్మగడ్డ ఎస్సారెస్పీ కెనాల్ కట్ట పైన ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
లభ్యమయిందని హనుమకొండ పోలీస్‌స్టేషన్ సీఐ సతీశ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు.

News April 6, 2024

ఎస్పీ కనుసన్నల్లోనే ఎన్‌కౌంటర్: మావోయిస్టుల లేఖ

image

భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు బీకే, ఏఎస్ఆర్ కమిటీ ఆజాద్ పేరుతో ములుగు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టిస్తుంది. బూటకపు ఎన్‌కౌంటర్లకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ములుగు జిల్లా ఎస్పీ కనుసనల్లోనే ఈ ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతోందన్నారు. పూజార్ కాంకేర్ మృతులకు లాల్ సలాం అంటూ లేఖలో పేర్కొన్నారు. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ములుగు ఎస్పీ ఎన్‌‌కౌంటర్లకు పాల్పడ్డాడని లేఖలో వివరించారు.

News April 6, 2024

జనగామ: కరెంట్ పనులు చేస్తుండగా.. షాక్‌తో మృతి

image

విద్యుత్తు పనులు చేస్తుండగా షాక్‌తో వ్యక్తి మృతిచెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో జరిగింది. తీగారం గ్రామానికి చెందిన బైకాని శ్రీశైలం శనివారం ముత్తారం గ్రామశివారులో విద్యుత్తు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీశైలం ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్‌తో మరణించాడు. ఇతను వల్మిడిలో విద్యుత్తు కట్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 6, 2024

మహిళ ఉద్యోగిపై సెక్రటరీ వేధింపులు

image

తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో మహిళ పనిచేస్తుండగా.. అందులో సెక్రటరీగా పనిచేస్తున్న వెలుగు మురళి వ్యక్తి ఆమెను వేధిస్తున్నాడని పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కొన్నిరోజులుగా మహిళపై మనసుపడ్డానని మురళి ఆమెను వేధించేవాడు. తాజాగా అవి ఎక్కువవడంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో మురళిపై SC, ST కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు.