India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాల్కు చెందిన రాజు (50) పై పొక్సో కేసు నమోదు చేశారు. నాలుగు సంవత్సరాలు బాలికపై అత్యాచారయత్నం ఘటనలో కేసు నమోదైంది. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసేందుకు వచ్చిన రాజు అదే కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి కుమార్తెపై లైంగికదాడి పాల్పడుతుండగా బాలిక ఏడ్చింది. దీంతో రాజు అక్కడి నుంచి పారిపోయాడు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ వ్యక్తి రూ.9,51,000 పోగొట్టుకున్న ఘటన కమలాపూర్ మండలంలో చోటుచేసుకుంది. సీఐ హరికృష్ణ కథనం ప్రకారం.. శనిగరం గ్రామానికి చెందిన మనోజ్కు టెలిగ్రామ్ ద్వారా బావి జోషి అనే అడ్రస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. టాస్క్ ఆడితే డబ్బులు రెట్టింపు అవుతాయని తెలుపగా విడతల వారీగా రూ.9.51లక్షలు వేశారు. ఎంతకూ నగదు రెట్టింపు కాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చెన్నారావుపేట మండలం లింగాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్కు ఎంపికయ్యారు. 8వ తరగతి చదువుతున్న బూర మానస, మైధం నవంబర్లో నిర్వహించిన స్కాలర్షిప్ ఎంట్రెన్స్ టెస్ట్లో ప్రతిభ కనబరిచారు. విద్యార్థులకు నాలుగేళ్ల పాటు రూ.12వేల చొప్పున స్కాలర్షిప్ వస్తుందని HM సలీం తెలిపారు.
భార్య మందలించడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నెక్కొండ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సె మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటతండాకు చెందిన ధరావత్ శ్రీనివాస్ (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. భార్య తిట్టడంతో బాధపడిన శ్రీనివాస్ పురుగుమందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
మనస్తాపంతో యువకుడు ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గీసుగొండ మండలంలో జరిగింది. గీసుగొండ సీఐ మహేందర్ కథనం ప్రకారం.. మరియాపురానికి చెందిన గొలమారి థామస్రెడ్డి అదే గ్రామానికి చెందిన మంజులతో కులాంతర వివాహం పెద్దల సమక్షంలో జరిగింది. కాగా భార్యాభర్తల మధ్య విభేదాలు రాగా మనస్తాపం చెందిన థామస్ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుడి అక్క నీలిమ ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేశారు.
నాలుగు సంవత్సరాల బాలికపై లైంగికదాడి చేసిన ఘటన గీసుగొండ మండలంలో చోటు చేసుకుంది. గీసుగొండ సీఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి కోసం దంపతులు ఇతర రాష్ట్రం నుంచి గీసుగొండ మండలానికి వచ్చారు. ఇక్కడ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రాజు అనే వ్యక్తి 4 సంవత్సరాల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రేన్ తగిలి తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతులు కోతులనడుమ గ్రామానికి చెందిన రాజేశ్వర్ రావు, వికాస్గా గుర్తించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రేపటి నుంచి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమవుతున్న వేళ పోలీసులు వారి వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో పెట్రోలింగ్ చేసే సమయాన్ని పెంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను అదేశించారు. ప్రధానంగా విజుబుల్ పోలిసింగ్లో భాగంగా పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు. ఫిర్యాదుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ తక్షణమే స్టేషన్ అధికారులు స్పందించడంతో పాటు ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు.
వరంగల్ మామునూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎయిర్ పోర్ట్ క్రెడిట్ విషయంలో వివాదం తెలత్తినట్లు సమాచారం. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించగా.. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో పోలీసులు భారీగా మోహరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ఓరుగల్లు వాసులు భయపడుతున్నారు. ఈరోజు వరంగల్ నగరంలో 33 నుంచి 35 °C ఉష్ణోగ్రతలు ఉంటాయని, రేపు 33 నుంచి 36 °C ఉష్ణోగ్రతలతో మేఘావృతమై ఉండనున్నట్లు వాతావరణ సూచనలు చెబుతున్నాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.