India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈనెల 27, 28 తేదీల్లో ములుగు జిల్లాలో పర్యటించునున్నారు. అందులో భాగంగా ఆయన లక్నవరం సరస్సు, ఐలాండ్ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సుందరీకరణ ఏర్పాట్ల పనులను శనివారం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పరిశీలించారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4వ సెమిస్టర్ల ఫలితాలు విడుదల కాకపోవడంతో పీజీ ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. 6వ సెమిస్టర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, 2వ, 4వ సెమిస్టర్లలో బ్యాక్ లాగ్లు ఉండటం వల్ల విద్యార్థులు సీపీగేట్ కౌన్సెలింగ్కు హాజరు కాలేకపోతున్నారు. దీంతో 2, 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను త్వరగా విడుదల చేయాలని విద్యార్థులు అధికారులను కోరుతున్నారు.
పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తరిగొప్పుల మండలం జాలూబాయి తండాకు చెందిన సభావత్ సుమన్(26) అదే తండాకు చెందిన ఓ యువతితో మూడు నెలల కిందట వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులకే ఇద్దరి మధ్య కలహాలు రాగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన సుమన్ శుక్రవారం ఉదయం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేశారు.
వరంగల్ ఎంజీఎం ఉత్తర తెలంగాణ ప్రజలకు పెద్ద దిక్కుగా ఉంది. రోజూ సగటున ప్రతి 30 సెకండ్లకు ఒక రోగి ఇక్కడ చేరుతున్నాడు. కరోనా సమయంలో లక్ష మంది రోగులకు సేవలు అందించారు. ఇది 1954లో ప్రారంభం కాగా.. 70 ఏళ్లలో 7,12,92,000 మంది రోగులకు వైద్య సేవలు అందించింది. ఇక్కడ మొత్తం 25 వైద్య విభాగాలు ఉన్నాయి. ప్రతిరోజు సేవలకు ఎంజీఎం చేసే ఖర్చు రూ.1.75 కోట్లు. ఇవీ ఎంజీఎం విశేషాలు.
> WGL: మార్కెట్ కు మూడు రోజులు సెలవులు
> HNK: మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వండి: సీపీ
> HNK: అదానీ లేకపోతే మోడీ లేడు: సీపీఐ జాతీయ కార్యదర్శి
> WGL: భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు
> BHPL: 27వ తేదీన కోటగుళ్లను సందర్శించనున్న గవర్నర్
> JN: ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం
> WGL: గురుకులాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
> JN: విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కడియం
> MHBD: గంగారంలో చెట్టును ఢీ-కొట్టిన కారు
> JN: పెద్దపహాడ్ స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం
> MHBD: కొడుకు శవాన్ని చూసి.. తల్లి మృతి
> JN: బైకు దొంగలు అరెస్ట్
> WGL: చింతల్ బ్రిడ్జిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ
> MHBD: కుక్కలను తప్పించబోయి ఇద్దరికీ గాయాలు
> WGL: ఎంజీఎం వద్ద పారిశుద్ధ కార్మికుడికి దొరికిన తుపాకీ
ఈనెల 27న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలోని భవానీ సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లను సందర్శించనున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా 3 రోజులపాటు చారిత్రక కట్టడాలను సందర్శించనున్నారు. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి జయశంకర్ జిల్లా గణపురం మండలం కోటగుళ్లలో గవర్నర్ పర్యటన కొనసాగనుంది.
కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం ఉత్పత్తుల ధరలు క్రింది విధంగా ఉన్నాయి.
✓ ధాన్యం(JSR): గరిష్ఠం: 3414. కనిష్ఠం: 2721.
✓ ధాన్యం(RNR): గరిష్ఠం: 2678. కనిష్ఠం: 2459.
✓ పత్తి: గరిష్ఠం: 7361. కనిష్ఠం: 4000.
✓ పేసర్లు: గరిష్ఠం: 6689. కనిష్ఠం: 3465.
✓ మక్కలు: గరిష్ఠం: 2406. కనిష్ఠం: 2406.
✓ పసుపు(గోల): గరిష్ఠం: 12,213. కనిష్ఠం: 12,213.
✓ పల్లికాయ: గరిష్ఠం: 2911. కనిష్ఠం: 2911.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మార్కెట్ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 3 రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
మహిళలు, చిన్నారుల భద్రతకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేరాల నియంత్రణకు ఉన్నతాధికారులు సైతం రాత్రుళ్లు పెట్రోలింగ్ నిర్వహిస్తు కింది స్థాయి సిబ్బంది పనితీరు పర్యవేక్షించాలని సీపీ తెలిపారు.
Sorry, no posts matched your criteria.