India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ ప్రకటించిన అభ్యర్థులు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినవారే కావడం ఆసక్తికర అంశం. అటు మహబూబాబాద్లోనూ బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరగానే టికెట్ లభించింది. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో నేతల పార్టీ మార్పుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ వేడి అలముకుంది.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న నాగార్జున మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. నర్సంపేట పట్టణం వల్లభ్ నగర్కు చెందిన నాగార్జున కొన్ని సంవత్సరాలుగా ఈజీఎస్లో టీఏగా పనిచేస్తున్నారు. ఆయన మృతి పట్ల కొత్తగూడ మండల అధికారులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.
అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఓ వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై వి.దీపికరెడ్డి తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. మండలంలోని పర్వతగిరి గ్రామానికి చెందిన మహేశ్వరికి కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన నాదెళ్ల నవజీవన్తో రెండేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో నవజీవన్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
వరంగల్ పార్లమెంట్ BRS తరఫున టికెట్ కోసం పలువురు ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. Ex.MLA పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, నల్లబెల్లి ZPTC పెద్ది స్వప్నకు టికెట్ వస్తుందని నర్సంపేట నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారురాలైన స్వప్నకు టికెట్ ఇస్తే ఉద్యమ సెంటిమెంట్ కలిసొస్తుందని అధిష్ఠానం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. టికెట్ కోసమే ఇటీవల కేసీఆర్ను కలిశారనే చర్చ సాగుతోంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు పలు ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. నం.5 రకం మిర్చి క్వింటాకి రూ.13 వేలు, సింగిల్ పట్టి రకం క్వింటాకు రూ.42,500 పలికింది. అలాగే మక్కలు క్వింటాకు రూ.2,175 ధర పలికాయి. కాగా గతవారంతో పోలిస్తే ఈరోజు మక్కల ధర భారీగా తగ్గింది. ఎండ తీవ్రత నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధన సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన(కాంట్రాక్ట్) భర్తీ చేయుటకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ లకావత్ వెంకట్ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 6న ప్రభుత్వ వైద్య కళాశాల మహబూబాబాద్లో ఉ. 10 గంటల నుంచి సా.4 గంటల వరకు హాజరు కావాలన్నారు. వివరాలకు http://gmcmahabubabad.org/ సంప్రదించాలన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,200 పలకగా.. మంగళవారం రూ.7240 పలికింది. అయితే పత్తి ధరలు పెరిగేలా వ్యాపారులు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పత్తికి సరైన ధర రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెక్కొండ మండలం వెంకట్ తండా గ్రామ పంచాయితీ పరిధిలోనీ పురాతన గంగమ్మ తల్లి ఆలయ అవరణలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఆనవాళ్లను గ్రామస్థులు గుర్తించారు. ఆలయ ఆవరణలో పెద్ద గుంత తీసి దాని పక్కనే పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉండటంతో గుప్త నిధుల కోసమేనని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే ప్రదేశంలో తవ్వకాలు జరిపారని గ్రామస్థులు తెలిపారు.
WGL జిల్లాలో దివ్యాంగుల కోసం ఈనెలలో సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు DRDO కౌసల్యాదేవి తెలిపారు. మూగ, చెవిటి వారికి 12న, శారీరక (ఆర్థో) విభాగానికి 18, 19, 20 తేదీలు, మానసిక దివ్యాంగులకు 22న ఎంజీఎం ఆస్పత్రి, రీజినల్ కంటి ఆస్పత్రిలో కంటి సమస్యలకు సంబంధించిన క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వికలాంగత్వం ఉన్న వారు మీ సేవ కేంద్రాల్లో నేడు ఉదయం 11 నుంచి స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు.
కాళేశ్వరం దేవస్థానం ఆలయ వేళల్లో మంగళవారం నుంచి మార్పులు చేసినట్లు ఈఓ ఎస్.మహేష్ తెలిపారు. వేసవికాలం సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4గంటల వరకు ద్వారా బంధనం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ద్వారం మూసేస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 6:30 గంటల వరకు భక్తులకు ఆర్జిత సేవలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.