Warangal

News March 21, 2024

అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి: డీఎస్పీ

image

పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో డబ్బు, మద్యం సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలను డీఎస్పీ తిరుపతి రావు బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డబ్బు సరఫరా అవ్వకుండా ఉండేందుకు అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు.

News March 20, 2024

పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం తగదు: బల్దియా కమిషనర్

image

GWMC కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో రెవెన్యూ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పన్ను వసూళ్ల పురోగతిపై సమర్థవంతంగా నిర్వహించుటకు అధికారులకు సూచనలు చేశారు. 2023- 24 ఆర్థిక సంవత్సరం లక్ష్యం రూ.97.66 కోట్లు కాగా ఇప్పటికి రూ.63.96 కోట్ల సేకరణ జరిగిందన్నారు. RIల వారీగా వసూళ్ల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం తగదన్నారు.

News March 20, 2024

వరంగల్: ల్యాప్‌టాప్‌లకు వైర్‌లెస్ ఛార్జర్ ఆవిష్కరణ

image

వరంగల్ నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పేర్లి సురేష్ బాబు ల్యాప్‌టాప్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జర్ ఆవిష్కరించారు. ఈయన నిట్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో పని చేస్తున్నారు. వైర్లు లేకుండా విద్యుత్‌ను సరఫరా చేసే వైట్రిసిటీ పరిజ్ఞానంతో 7 నెలల పాటు శ్రమించి “వైర్ లెస్ ల్యాప్‌టాప్ ఛార్జర్ విత్ కూలింగ్ పాడ్”ను తయారు చేశారు.

News March 20, 2024

పర్వతగిరి: ఎస్సారెస్పీ కాలువలో మృతదేహం గుర్తింపు

image

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మృతదేహం నీటిలో కొట్టుకెళ్తుండగా స్థానిక గొర్రెల కాపర్లు చూసి పోలీసులు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 20, 2024

నేటి నుంచి గుంజేడు ముసలమ్మ జాతర

image

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో గల శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర నేటి నుంచే ప్రారంభం కానుంది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా పేరున్న శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర నేటి నుంచి మూడు రోజులపాటు ఘనంగా జరగనుంది. ఈ జాతరకు మహబూబాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు పోటెత్తనున్నారు. ఇప్పటికే జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో బిక్షమాచారి తెలిపారు.

News March 20, 2024

నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

విదేశాల్లో ఎంఎస్, పీహెచ్ఏ కోర్సులు చదివేందుకు నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్‌కు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత విభాగం ప్రకటన జారీ చేసింది. 2024-25 సంవత్సరానికి ఎంపిక కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. www.nosmsje.gov.in అనే వెబ్‌పోర్టల్‌లో ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవావాలని పేర్కొన్నారు.

News March 20, 2024

WGL: పెళ్లి చేసుకుంటానని పలుమార్లు అత్యాచారం 

image

ప్రైవేటు వసతిగృహంలో ఉంటున్న యువతిపై ఓ నిర్వాహకుడు అత్యాచారం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూపాలపల్లికి చెందిన వ్యక్తి నయీంనగర్‌లో వసతి గృహం నిర్వహిస్తున్నాడు. అందులో ఉండి ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పలుమార్లు అత్యాచారం చేశాడు. తీరా మరో మహిళతో పెళ్లి నిశ్చయం కావడంతో.. బాధిత యువతి పెళ్లి గురించి ప్రస్తావించగా కులం పేరుతో దూషించాడు.

News March 20, 2024

వరంగల్: బాలుడికి బైక్ ఇచ్చినందుకు తండ్రికి జైలు శిక్ష

image

మైనర్‌కు బైక్ ఇచ్చినందుకు ఓ తండ్రికి జైలు శిక్ష విధించిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే బాలుడు బైక్ నడుపుతూ పోలీసులకు పట్టుబడటంతో వాహనం సీజ్ చేసి కేసు నమోదుచేశారు. కాగా, బాలుడికి బైక్ ఇచ్చినందుకు తండ్రికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు.

News March 20, 2024

జనగామ: యువతిపై అత్యాచారం

image

యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన మంగళవారం లింగాలఘనపురం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకొంది. SI చింత రాజు ప్రకారం.. భువనగిరి జిల్లాకు చెందిన సిద్దారెడ్డి కొన్ని నెలలుగా మండలంలోని ఓ గ్రామంలో తన అక్క వద్దనే ఉంటూ.. పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతి(19)పై మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఐపీసీ 452, 376 ప్రకారం యువకుడిపై కేసు నమోదయింది.

News March 20, 2024

KU: ఈనెల 22 నుంచి ఎల్ఎల్ఎం మూడో సెమిస్టర్ పరీక్షలు

image

కేయూ పరిధిలో ఎల్ఎల్ఎం మూడో సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) పరీక్షలు ఈనెల 22 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నర్సింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సి హెచ్. రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22, 26, 28వ తేదీల్లో మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

error: Content is protected !!