Warangal

News March 30, 2024

WOW.. వెయ్యి గంటల్లో రామప్ప ఆలయాన్ని నిర్మించారు

image

WGL కిట్స్ కళాశాలలోని ఇంజినీరింగ్ విద్యార్థులు ఓ అద్భుతం సృష్టించారు. వెయ్యి గంటల్లో సరికొత్త 3డీ సాంకేతికతతో ఆలయాన్ని అచ్చు గుద్దినట్లు నిర్మించారు. మెకానికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న రూపేశ్‌కుమార్, అభినయ్, గౌస్‌లు ఈ దీన్ని తయారు చేయగా.. రాజనరేందర్‌రెడ్డి, శ్రీకాంత్, సమీర్‌లు మెంటార్లుగా వ్యవహరించారు. ఐఐటీ HYD వారు నిర్వహించిన ఓ పోటీలో పాల్గొనేందుకు దీన్ని యంత్రంతో ముద్రించారు.

News March 30, 2024

NSPT బస్టాండ్‌లోనే కన్నుమూసిన క్యాన్సర్ బాధితుడు

image

నర్సంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లోనే ఒకరు మృతి చెందారు. వరంగల్‌కు చెందిన మహ్మద్ అప్జల్(35) నర్సంపేటలో ఓ పండ్ల వ్యాపారి వద్ద కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న అప్జల్ వరంగల్‌కు వెళ్లి వస్తూ నర్సంపేటలో బస్సు దిగాడు. స్పృహ తప్పి బస్టాండులోనే నిద్రపోయాడు. ఆర్టీసి సిబ్బంది వచ్చి అతనిని నిద్రలేపడానికి ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు.

News March 30, 2024

BRSలోకి మాజీ ఎమ్మెల్యే రాజయ్య?

image

కడియం కావ్య కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంపై BRS దృష్టి సారించింది. ఇటీవలే ఆ పార్టీని వీడిన మాజీ MLA తాటికొండ రాజయ్యను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆయనను WGL అభ్యర్థిత్వానికి పరిశీలిస్తూనే ప్రత్యామ్నాయంపై KCR దృష్టి సారించారట. ఇప్పటికే రాజయ్యతో పార్టీ వర్గాలు సంప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం.

News March 30, 2024

రేపు దేవరుప్పులకు మాజీ సీఎం కేసీఆర్

image

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల బాట పట్టారు. ఎండిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఆదివారం పర్యటించనున్న ఆయన.. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో ఎండిన పంటలను పరిశీలిస్తారు. ఆదివారం ఉదయం 8 గంటలకు గజ్వేల్‌లోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి జనగామ మీదుగా 10.30 గంటలకు దేవరుప్పుల మండలానికి చేరుకుంటారు.

News March 30, 2024

WGL: వయసు చిన్నదే.. ఆశయం పెద్దది

image

తండ్రినే స్ఫూర్తిగా తీసుకొని ఓ కూతురు బాక్సింగ్‌లో రాణిస్తోంది. హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన తనుశ్రీ 8వ తరగతి చదువుతోంది. ఓ పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్న తండ్రి శ్యామ్.. కుమార్తెకు శిక్షణ ఇప్పించి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించారు. అంతేకాదు, ఈనెల నోయిడాలో జరిగిన జాతీయ స్థాయి 3వ సబ్ జూనియర్స్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్యం గెలుచుకుంది. ఈ ఏడాది మేలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొననుంది.

News March 30, 2024

MHBD: డీజే బాక్సులు మీద పడి బాలుడు మృతి

image

పెళ్లి వేడుకలో డీజే బాక్సులు మీద పడి బాలుడు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే.. బానోత్ మనోజ్ (14) అనే బాలుడు బూర్గుచెట్టు తండా గ్రామపంచాయితీ పరిధిలోని పీక్లా తండాలో ఓ వివాహానికి హాజరయ్యాడు. కాగా ప్రమాదవశాత్తు మనోజ్‌పై డీజే బాక్సులు పడటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో పెళ్లి ఇంట్లో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 30, 2024

కాకతీయుల కాలం నాటి రాతి కట్టడాలకు సంరక్షణ కరువు

image

ఖిలావరంగల్‌లో కాకతీయుల కాలం నాటి రాతి కట్టడాల సంరక్షణను కేంద్ర పురావస్తు శాఖ అధికారులు గాలి కొదిలేశారని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. పడమరకోట చమన్ కూడలిలోని నివాస గృహాల నడుమ ఉన్న కట్టడంపై ఏపుగా ముళ్ల పొదలు పెరిగాయి. ఫలితంగా రాళ్లు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితిలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చెట్లు తొలగించి పురాతన కట్టడాన్ని భావితరాలు వీక్షించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

News March 30, 2024

వరంగల్ BRS టికెట్ ఎవరికి?

image

WGL పార్లమెంట్ BRS అభ్యర్థి విషయంలో రోజుకో కీలక మలుపు కొనసాగుతోంది. సిట్టింగ్ అభ్యర్థి దయాకర్‌ను కాదని కడియం కావ్యకు టికెట్ ఇచ్చారు. కానీ, తాను పోటీ చేయనని నిర్ణయం తీసుకొని తండ్రి శ్రీహరితో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో WGL పార్లమెంట్ టికెట్ కేటాయింపుపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఇటీవల పార్టీ మారిన బాబు మోహన్, తాటికొండ రాజయ్యతో పాటు పెద్ది స్వప్న పేర్లు వినిపిస్తున్నాయి.

News March 30, 2024

కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలి: జడ్పీ చైర్మన్

image

బీఆర్ఎస్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాల పట్ల ములుగు జిల్లా కార్యకర్తలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ములుగు జిల్లా పరిషత్ ఛైర్మన్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడాల్సిన కొందరు ద్రోహులు మాత్రమే పార్టీ వీడుతున్నారని, దీంతో నూతన నాయకత్వానికి అవకాశం లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.

News March 29, 2024

జనగామ ఏసీపీగా పార్థసారథి బాధ్యతల స్వీకరణ

image

జనగామ నూతన ఏసీపీగా పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు పార్టీల ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆయనకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. నూతన ఏసీపీ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.