Warangal

News March 27, 2024

జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఏడేళ్ల బాలుడి మృతి

image

జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పెంబర్తి వద్ద ఆటోను ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు ఈశ్వర్ మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

News March 27, 2024

మహబూబాబాద్‌లో రసవత్తరంగా MP పోరు

image

మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో లోక్ సభ పోరు రసవత్తరంగా మారింది. 3 ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో వారు ఇప్పటికే సమావేశాలు, కార్యాచరణలు రూపొందించుకుంటున్నారు. BRS నుంచి మాలోతు కవిత, BJP నుంచి సీతారాంనాయక్, కాంగ్రెస్ నుంచి బలరాంనాయక్‌లు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బరిలో నిలవనున్న ముగ్గురికి గతంలో ఎంపీలుగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో పోరు ఆసక్తిగా మారింది.

News March 27, 2024

వరంగల్ మార్కెట్‌కి మళ్లీ వరుస సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మళ్లీ 3 రోజులు వరుస సెలవులు రానున్నాయి. శుక్రవారం గుడ్ ఫ్రైడే, శని, ఆదివారాలు వారాంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. నేడు, రేపు మాత్రమే మార్కెట్ ఓపెన్ ఉండనుంది. కావున, రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్లో క్రయ విక్రయాలు కొనసాగించాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 27, 2024

వరంగల్ మార్కెట్లో ఈరోజు ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం తేజ మిర్చి క్వింటాకి రూ.19,300 ధర వచ్చింది. అలాగే 341 రకం మిర్చి రూ.16వేలు, వండర్ హాట్(WH) రకం మిర్చికి రూ.15,000 ధర వచ్చింది. మరోవైపు 5,531 మిర్చికి రూ.11,000 ధర, టమాటా మిర్చి 27వేలు, సింగల్ పట్టి రూ.45,000 ధర పలికాయి. కాగా నిన్నటితో పోలిస్తే ఈరోజు టమాటో, 5531 రకాల మిర్చిలు మినహా అన్ని రకాల మిర్చి ధరలు పెరిగాయి.

News March 27, 2024

ఎనుమాముల మార్కెట్‌లో పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. నిన్న క్వింటా పత్తి ధర రూ.7,170 పలకగా.. ఈరోజు రూ.7,310కి చేరింది. అలాగే క్వింటా మక్కలు రూ.2,215 పలికాయి. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారస్థులు తెలుపుతున్నారు.

News March 27, 2024

809 పోలింగ్ కేంద్రాలు.. 4,338 మంది సిబ్బంది

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 809 పోలింగ్ కేంద్రాల్లో మొదటి దశ ర్యాండమైజేషన్ ద్వారా 1,338 మంది సిబ్బందిని కేటాయించినట్లు వరంగల్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్లో ఎన్ఐసీ రూపొందించిన సాఫ్ట్వేర్ను వినియోగిస్తూ, ఆన్లైన్లో పోలింగ్ సిబ్బంది మొదటి దశ యాదృచ్ఛికీకరణ ప్రక్రియ నిర్వహించారు.

News March 27, 2024

కాజీపేట రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుడు మృతి

image

కాజీపేట రైల్వే స్టేషన్లోని ఒకటో నెంబరు ప్లాట్ ఫాంపై లిఫ్టు వద్ద గుర్తు తెలియని ప్రయాణికుడు మృతి చెందినట్లు జీఆర్పీ అధికారి కమలాకర్ తెలిపారు. అనారోగ్యం కారణంగా మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో అతను మరణించినట్లు చెప్పారు. అతడి వయసు సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని, నీలిరంగు చొక్కా, సిమెంట్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు.

News March 26, 2024

WGL: కాకతీయ మెడికల్ కాలేజ్‌లో బ్రెయిన్ ట్యూమర్ చికిత్స

image

కాకతీయ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరో సర్జరీ విభాగంలో మొట్టమొదటిసారిగా బ్రెయిన్ ట్యూమర్ చికిత్స చేశారు. హనుమకొండ జిల్లా ఉప్పల్ గ్రామానికి చెందిన బుర్ర స్వరూపకు బ్రెయిన్‌లో ట్యూమర్ ఏర్పడింది. దీంతో ఆమెకు తీవ్రమైన తలనొప్పి, నరాల బాధతో ఆసుపత్రిలో చేరగా న్యూరోసర్జరీ విభాగం హెచ్ఓడీ డా.సికందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సచిన్, వీరేష్ శస్త్రచికిత్స చేశారు.

News March 26, 2024

WGL: హోలీ పండుగ మిగిల్చిన విషాదం.. ఏడుగురు మృతి

image

హోలీ ఉమ్మడి జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. వెంకటాపురం మండలంలో స్నేహితులిద్దరు కాల్వలో స్నానం చేసి బైక్‌పై వస్తూ చెట్టును ఢీకొని మృతిచెందారు. హసన్‌పర్తి మం.లో పలివేల్పుల, గుండ్లసింగారం సమీపంలో SRSP కాల్వలో స్నానాలకు వెళ్లిన ముగ్గురు గల్లంతు కాగా వారిలో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. నర్సింహులపేట మం.లో చెరువులోకి ఈతకెళ్లిన బాలుడు మునిగి చనిపోయాడు.

News March 26, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా…

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకి రూ.19,200 ధర, 341 రకం మిర్చి రూ.15,500, వండర్ హాట్(WH) రకం మిర్చికి రూ.15,000 ధర వచ్చింది. అలాగే 5,531 మిర్చికి రూ.12,000 ధర, టమాటా మిర్చి 30వెలు, సింగల్ పట్టి రూ.41,500 ధర పలికాయి. అలాగే మక్కలు బిల్టీ క్వింటాకు రూ.2200 పలికాయి.