Warangal

News March 26, 2024

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.7170

image

మూడు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఈరోజు పున: ప్రారంభమైంది. దీంతో మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు మార్కెట్‌కు భారీగా పత్తి తరలివచ్చింది. అయితే గత వారంతో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా తగ్గింది. గత వారం క్వింటా పత్తి రూ.7300 కి పైగా పలకగా.. ఈరోజు రూ.7170కి పడిపోయినట్లు అధికారులు తెలిపారు. 

News March 26, 2024

వరంగల్: యువతి ఫోన్ నుంచి మెసేజ్.. యువకుడిపై దాడి

image

నర్సంపేటకు చెందిన ఓ యువతి, తొర్రూరు మండలం చర్లపాలెం వాసి ప్రకాశ్‌ ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఒప్పుకోని యువతి తండ్రి శ్రీనివాస్‌.. 5నెలల క్రితం పోలీసులతో కౌన్సెలింగ్‌ ఇప్పించగా ఆ ఇద్దరు దూరంగా ఉంటున్నారు. కుమార్తెపై అనుమానంతో ఈనెల 24న ఆమె ఫోన్ నుంచి ఇంటికి రావాలని ప్రకాశ్‌‌కు శ్రీనివాస్ మెసేజ్ చేశాడు. అది నమ్మి ఇంటికి వచ్చిన ప్రకాశ్‌పై దాడి చేశారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.

News March 26, 2024

పరకాల: బాలుడి వైద్యానికి రూ.3.50 లక్షల సాయం

image

పరకాల మండలం వెంకటాపూర్‌కు చెందిన వెంకటేష్,ఆశ్విత కొడుకు మహాన్(1) తలకు కణితి అయింది. కాగా బాలుడి వైద్యానికి ఆర్థిక స్తోమత లేక ఆ తల్లిదండ్రులుకు ఇబ్బంది పడ్డారు. ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా అమెరికాలో ఉంటున్న NRI మేటమర్రి కామేశ్- ప్రతిమ దంపతులు స్పందించి బాలుడి వైద్యానికి రూ.3.50 లక్షల సాయం అందించి పెద్ద మనస్సు చాటుకున్నారు. బాలుడి నిన్న డిశ్చార్జి కాగా దాతలకు పేరెంట్స్ కృతజ్ఞతలు చెప్పారు.

News March 26, 2024

ములుగు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ములుగు మండలం జంగాలపల్లి సమీపంలోని జవహర్ నగర్ గట్టమ్మ ఆలయం వద్ద జాతీయ రహదారి-163పై సోమవారం రాత్రి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 26, 2024

నేడు రైతు నేస్తం దృశ్య శ్రవణ ప్రత్యక్ష ప్రసారం

image

ఉమ్మడి జిల్లా పరిధిలో ఎంపిక చేసిన రైతువేదికల్లో నేడు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. సమగ్ర వ్యవసాయ విధానంపై అఖిల భారత సమగ్ర వ్యవ సాయ పద్ధతుల పరిశోధన విభాగం ప్రధాన శాస్త్రవేత్త డా.ఎం.గోవర్ధన్, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై ప్రధాన శాస్త్రవేత్తలు మెళకువలు చెబుతారు.

News March 26, 2024

HNK: ఈనెల 27, 28న జాతీయ సదస్సు

image

హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈనెల 27, 28 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం ఇన్చార్జ్ హెడ్ డాక్టర్ మాదాసి కనకయ్య సోమవారం తెలిపారు. ‘ఫీన్టెక్ రెవల్యూషన్ రీషెపింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇన్ ది డిజిటల్ ఏజ్’ అంశంపై ఈ సదస్సు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా కేయూ వీసీ తాటికొండ రమేశ్ వస్తారని అన్నారు.

News March 26, 2024

WGL: మద్యం మత్తులో యువకుల వీరంగం

image

హోలీ వేళ యువకులు మద్యం మత్తులో పరస్పర దాడులు చేసుకున్న ఘటన వరగంల్‌లో జరిగింది. మధ్యకోట, పడమరకోటకు చెందిన యువకులు నిన్న సాయంత్రం కత్తికోటలో మందు తాగారు. వరంగల్‌కు చెందిన మరో 10 మంది బైక్‌లపై రాగా రంగులు పూసుకుని విషెష్ చెప్పుకున్నారు. కొద్దిసేపటికి వీరి మధ్య గొడవ జరగ్గా రెండు గ్రూపులుగా విడిపోయి దాడి చేసుకున్నారు. సినిమా స్టైల్‌లో రోడ్డుపై పరుగులు పెడుతూ కొట్టుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

News March 26, 2024

అటవీశాఖతో పాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సురేఖ

image

ఈ మధ్యకాలంలో అమ్రాబాద్, కవ్వాల్, తాడ్వాయి, ఇల్లందు తదితర ప్రాంతాల్లో అటవీ ప్రమాదాలు జరుగుతున్నట్లు సమాచారం వచ్చిందని మంత్రి తెలిపారు. ఈ అటవీ ప్రమాదాల వల్ల వన్యప్రాణులతో పాటు విలువైన అటవీ సంపదకు ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉన్నందున అటవీశాఖతో పాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వేసవి మొదలైనప్పటి నుంచి వరుసగా జరుగుతున్న ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖను ఆదేశించారు.

News March 26, 2024

WGL: నేటితో ముగియనున్న ఉచిత కోచింగ్ దరఖాస్తులు

image

షెడ్యూల్డ్ కులాల అధ్యయన కేంద్రం, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో  100 మంది అభ్యర్థులకు 2నెలలపాటు ఉచిత వసతి భోజనంతో కూడిన DSC శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ జిల్లాశాఖ సంచాలకులు డాక్టర్ కె. జగన్ మోహన్ తెలిపారు. దరఖాస్తులను వెబ్సైట్ tsstudycircle.co.in రేపటి లోగా అప్లై చేసుకోవాలని సూచించారు.

News March 25, 2024

BHPL: బైకులు ఢీ.. ఒకరు మృతి 

image

రెండు బైకులు ఢీ కొని వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం గణపురం మండలం చెల్పూర్‌లో జరిగింది. పోలీసుల వివరిలిలా .. చిట్యాల మండలం జడలపేటకు చెందిన బోట్ల రమేశ్(30), గణపురం మండలం ధర్మరావుపేటకు చెందిన ప్రేమ్.. ఇద్దరు ఎదురెదురుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో అతివేగంగా ప్రయాణిస్తున్న బైకులు అదుపుతప్పి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రమేశ్ మృతిచెందారు. తీవ్రగాయాలైన ప్రేమ్‌ను వరంగల్‌MGM తరలించారు.