India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మామునూర్ ఎయిర్ పోర్టుకు కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓరుగల్లు ప్రజల ఏళ్లనాటి ఆకాంక్ష నెరవేరబోతోంది. ఇప్పటికే 696 ఎకరాల భూమిని సేకరించగా.. మరో 253 ఎకరాల భూమిని గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల రైతుల నుంచి సేకరిస్తున్నారు. దీనికోసం రూ.205 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో విమానాలు నడిపేందుకు ఇప్పుడున్న 1.8 కి.మీ రన్వేను 3.9కి.మీలకు పెంచాల్సి ఉంది. మీ కామెంట్
మార్చ్ 5వ తేదీ నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సత్య శారద తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 26 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం జనరల్ 4,967, ఒకేషనల్ 848 మొత్తం 4,815 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో జనరల్ 5,739, ఒకేషనల్ 767 మంది మొత్తం 6,506 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని, పరీక్షలు పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించడానికి పరీక్షా కేంద్రాల సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ అన్నారు. మార్చి 5నుంచి నిర్వహించబోయే ఇంటర్ వార్షిక పరీక్షలపై శుక్రవారం లాల్ బహదూర్ జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు సమావేశం నిర్వహించారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బాణాల రాంబాబు శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడని స్థానికులు తెలిపారు. రాంబాబు భార్య ఇందిర 23వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. రాంబాబు మృతిపై స్థానికులు, పట్టణ బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. పలువురు ఆయనకు నివాళులర్పించారు.
కేరళ రాష్ట్రానికి చెందిన 27 మంది యువతీ యువకులు రంగశాయిపేటలోని హోమ్ ఫుడ్స్ సందర్శించారు. ఈనెల 20వ తేదీ నుండి మార్చ్ 3 వరకు ఐదు రోజుల పాటు ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం జరుగుతుందన్నారు. తెలంగాణ పిండివంటలైన సకినాలు, మురుకులు, గరిజలు, సర్వపిండి మొదలు వంటలను నిర్వాహకులు కేరళ నుంచి వచ్చిన యువతకు నేర్పారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు గురించి వారికి తెలియజేశారు.
వరంగల్ జిల్లా కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘంగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న పోలీస్ అధికారులకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శాలువాతో సన్మానం చేసి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీ సేవలు నేటితరం పోలీసులకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవి సురేశ్ కుమార్, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో వివిధ గ్రామాల్లో సోలార్ లైట్కు సంబంధించిన 10 బ్యాటరీలను దొంగిలించి ఆటోలో వేసుకొని ములుగులో అమ్ముకునేందుకు వెళ్తుండగా నల్లబెల్లి పోలీస్ సిబ్బందితో పట్టుకున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. నిందితులను జ్యూడిషియల్ రిమాండ్ తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి WGL-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న నల్గొండలో లెక్కింపు జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సా. 4 గం. వరకు 93.57% పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా.. హనుమకొండ 91.66, వరంగల్ 94.13, జనగామ 94.31, మహబూబాబాద్ 94.47, భూపాలపల్లి 93.62, ములుగులో 92.83% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మీరు ఓటు వేశారా? కామెంట్ చేయండి.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రామయ్యపల్లి గ్రామంలో పులి సంచరిస్తున్నట్లు స్థానికంగా కలకలం రేపింది. ఒక రైతు మొక్కజొన్న చేనులో పులి పాదముద్రలు ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో గురువారం ఆ అడుగులను పరిశీలించారు. అవి పులి అడుగులు కాదని హైనా జంతువు అడుగులని తెలిపారు.
ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు జరిగింది. సీఐ రాఘవేందర్ కథనం ప్రకారం.. బాలాజీనగర్కి చెందిన జక్కోజు శివకృష్ణచారి(31)కూలీ పని చేస్తుండేవాడు. తరచు మద్యం తాగి ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. నిన్న సాయంత్రం మద్యం తాగి వచ్చిన అనంతరం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. భార్య లావణ్య ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.