India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ ధర నిన్న రూ.5,850 పలకగా.. నేడు రూ.5910 పలికింది. నిన్న పచ్చి పల్లికాయ ధర రూ.4,250 ఉంటే.. నేడు రూ.3,900కి పడిపోయింది. మరోవైపు 5531 రకం మిర్చికి నిన్న రూ.12 వేల ధర రాగా, నేడు రూ. 500 పెరిగి, రూ.12,500 అయినట్లు వ్యాపారులు తెలిపారు.
కుమారుడు మృతిని తట్టుకోలేక పెంపుడు తల్లి మరణించిన ఘటన మహబూబాబాద్లో కంటతడి పెట్టించింది. స్థానికుల వివరాల ప్రకారం.. మున్సిపాలిటీలోని శనిగపురంలో మంద రవి(30) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. మృతిచెందాడు. కాగా అతని మృతదేహాన్ని చూసిన పెంపుడు తల్లి జ్యోతి గుండెపోటుతో మృతిచెందారు. తల్లి, కుమారుడు మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కలకు అధిక ధర పలుకుతూనే ఉంది. మొన్న క్వింటా మక్కలు రూ.2,805 పలకగా.. గురువారం రూ.2,820 పలికి రికార్డు నమోదు చేసింది. అయితే ఈరోజు మళ్లీ స్వల్పంగా తగ్గి, రూ.2,805కి చేరిందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా, మార్కెట్కు మొక్కజొన్న తీసుకొచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ MGM కూడలిలో పారిశుద్ధ్య కార్మికుడికి తుపాకీ దొరికింది. కాగా, దాన్ని ఎస్ఎల్ఆర్ఎన్ గన్గా పోలీసులు గుర్తించారు. తుపాకీని నగరపాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేకి కార్మికుడు అప్పగించడంతో.. కమిషనర్ ఆ విషయాన్ని పోలీసులకు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మద్యం తాగి వాహనం నడిపిన కేసుల్లో 8 మంది వాహనదారులకు వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గుర్రపు వీరస్వామి జరిమానా విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ గురువారం తెలిపారు. అలాగే మద్యం తాగి వాహనం నడిపి ట్రాఫిక్ పోలీసులకు పట్టుపడ్డ 8 మంది వాహనదారులకు రూ.17,800 జరిమానా విధించారు.
వరంగల్ నగరంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా ప్రవేశించినట్లు తెలిసిందని మట్టెవాడ సీఐ తుమ్మ గోపి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అనుమానిత అపరిచితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపార్ట్మెంట్లలో నివసించే ప్రజలందరూ సీసీ కెమెరాల పనితీరును సరి చేసుకోవాలని సూచించారు. అనుమానంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.
వసతిగృహాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులను ఆదేశించారు. ఈమేరకు గురువారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో విషజ్వరాలు, వసతిగృహాల పరిశుభ్రత, శానిటేషన్పై సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. జిల్లాలో 4 మున్సిపల్ పరిధి, గ్రామ స్థాయిలలో విషజ్వరాలు డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా అధికారులంతా సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలన్నారు.
అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని MLA కడియం శ్రీహరి అన్నారు. చింతగట్టు క్యాంపులో గల నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీరింగ్ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఏడాదిలోపు ఘనపూర్ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని MLA ఆదేశించారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పసుపు ధర పెరిగింది. నిన్న క్వింటాకు రూ.12,273 పలికిన పసుపు నేడు రూ.13,516 పలికింది. అలాగే సూక పల్లికాయ ధర నిన్న రూ.6,260 పలకగా.. నేడు రూ.5850 పలికింది. నిన్న పచ్చి పల్లికాయ ధర రూ.4,200 రాగా నేడు రూ.4250కి చేరింది. మరోవైపు 5531 రకం మిర్చికి నిన్నటిలాగే రూ.12 వేల ధర వచ్చినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు.
రానున్న వారం రోజుల్లో వనమహోత్సవ లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. వన మహోత్సవంపై జిల్లా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం 26 లక్షల 130 మొక్కలు నాటాలని లక్ష్యం కేటాయించగా.. ఇప్పటి వరకు 21 లక్షల 721 మొక్కలు నాటారని, మిగిలిన లక్ష్యాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలో ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటేందుకు పంపిణీ చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.