India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భర్త ఉండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకుని ఆ తర్వాత 498a కేసు నమోదు చేసిన ఘటన సంచలనం సృష్టించింది. వరంగల్ కాజీపేటకు చెందిన వినోద్కు 2008లో నిర్మలతో వివాహం జరిగింది. వీరిమధ్య చిన్న చిన్న గొడవలు జరగడంతో 2013 సెప్టెంబర్లో 498ఏ కేసు నమోదు చేసింది. తన నకిలీ డెత్ సర్టిఫికెట్ తీసుకున్న భార్యపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకొని, తనకి న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.
అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ పాల్గొన్నారు. కమిటీతో వెంటనే విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ బలరాం నాయక్ డిమాండ్ చేశారు.
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి నీలిమ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా హనుమకొండ అదాలత్ జంక్షన్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారిని వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖలో జరుగుతున్న సాధారణ బదిలీల్లో భాగంగా కొందరికి స్థాన చలనం జరిగింది. సుమారు 20 ఏళ్లుగా ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న జేడీఏ ఉషను ఆదిలాబాద్కు, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అధికారి అనురాధను వరంగల్ జిల్లాకు బదిలీ చేశారు. నరేశ్ కుమార్ను ములుగు జిల్లాకు ఏడీఏగా బదిలీ చేశారు.
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లాలో జరిగింది. ఎస్సై టీవీఆర్ సూరి తెలిపిన వివరాలు.. మంగపేట మండలం మల్లూరు గ్రామానికి చెందిన జయంత్ (26) గతేడాది తనకున్న ఐదెకరాల్లో మిర్చి సాగు చేశాడు. పెట్టుబడికి రూ. 8 లక్షలు అప్పు చేశాడు. కాగా పంట దిగుబడి సరిగా రాకపోవడంతో మనస్తాపంతో ఈ నెల 19న రాఖీ రోజు పురుగుమందు తాగాడు. వరంగల్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు తగ్గాయి. బుధవారం క్వింటా తేజ మిర్చి ధర రూ.18,500 పలకగా.. నేడు సైతం అదే ధర పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.15వేలు పలకగా నేడు రూ.14,500 కి పడిపోయింది. మరోవైపు వండర్ హాట్ మిర్చి(WH) కి నిన్న రూ.16,000 ధర రాగా ఈరోజు రూ.15 వేలకి దిగజారింది.
లక్షలాది మంది భక్తులు వచ్చే కొమురవెల్లి మల్లన్న స్వామి సన్నిధిలో రైలు ఆగేందుకు ఫ్లాట్ ఫారం నిర్మాణ పనులు చకచక సాగుతున్నాయి. మొదట్లో ఇక్కడ స్టేషన్ ఏర్పాటు విషయాన్ని రైల్వే శాఖ విస్మరించింది. దీంతో మూడేళ్ల క్రితం రైల్వే స్టేషన్ మంజూరు కోరుతూ నేతలు నిరసన చేపట్టగా.. మల్లన్న సన్నిధిలో హాల్టింగ్ స్టేషన్ మంజూరు చేశారు. ఫిబ్రవరి 15న శంకుస్థాపన చేయగా, మరో 3 నెలల్లో పనులు పూర్తవుతాయని అధికారులు చెప్పారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర మళ్లీ తగ్గింది. 2 రోజులుగా పెరుగుతూ వచ్చిన ధర నేడు తగ్గింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,370 ఉండగా, బుధవారం రూ.7,500 కి చేరింది. నేడు మళ్లీ తగ్గి రూ.7,420 అయింది. దీంతో పత్తి రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ధరలు పెరిగేలా చూడాలని కోరుతున్నారు.
మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘టీ-సేఫ్’ యాప్ మంచి ఫలితాలనిస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. టీ- సేఫ్ ద్వారా పోలీసులకు సమాచారం ఇస్తే మహిళలు గమ్యస్థానాలకు చేరే వరకు వారి భద్రతకు ప్రభుత్వమే భరోసా కల్పిస్తుందన్నారు. ఈ యాప్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మహిళల భద్రతపై సచివాలయంలో సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు.
డయల్-100 కాల్తో యువతిని మద్దూర్ పోలీసులు కాపాడారు. చేర్యాల సీఐ శ్రీను తెలిపిన వివరాలు.. ఏటూరునాగారం మండలం గోగుపల్లికి చెందిన రాజశేఖర్, వేలేరుకు చెందిన ఓ యువతి HYD కూకట్పల్లిలోని ఫార్మా కంపెనీలో పని చేస్తున్నారు. రాజశేఖర్ మాయమాటలు చెప్పి అమ్మాయిని మద్దూరులోని తన మిత్రుడి ఇంటికి తీసుకెళ్లాడు. దీంతో మోసపోయానని యువతి గుర్తించి 100కి కాల్ చేయగా పోలీసులు కాపాడారు. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.