Warangal

News March 4, 2025

నర్సంపేట: ఇద్దరికి జైలు శిక్ష

image

నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 26వ తేదీన ఇన్‌స్పెక్టర్ రమణమూర్తి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. చెన్నారావుపేట మండలం కోనాపురానికి చెందిన అరవింద్, నర్సంపేట పట్టణానికి చెందిన నాగరాజు పట్టుబడ్డారు. వీరిని నేడు న్యాయస్థానంలో హాజరు పర్చగా మూడు రోజుల జైలు శిక్షతోపాటు  రూ.1,000 జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ లక్ష్మీనారాయణ తీర్పు ఇచ్చారు.

News March 4, 2025

దుగ్గొండి: అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య

image

WGL (D) దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన గందం లక్ష్మీ(52) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. లక్ష్మీ, మొగిలి దంపతులు బర్రెల వ్యాపారం చేశారు. అందులో నష్టాలు రావడంతో 5ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుండగా దిగుబడి రాలేదు. అప్పులను తీర్చలేక 4 రోజుల క్రితం లక్ష్మీ పురుగుల మందు తాగింది. వరంగల్ MGMలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు తెలిపారు.

News March 3, 2025

WGL: శ్రీపాల్ రెడ్డి నేపథ్యం ఇదే..!

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన పింగళి శ్రీపాల్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా గూడూరులో జన్మించారు. ఆయనకు 52 ఏళ్లు. వృత్తి రీత్యా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయన గతంలో PRTU TS, UTF రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(AIFTO) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. కాగా ఇటీవల ఆయన తన టీచర్ పోస్ట్‌కు రాజీనామా చేశారు.

News March 3, 2025

భూపాలపల్లిలో యాక్సిడెంట్.. ముగ్గురి మృతి

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్ క్రాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన పింగిలి రాజిరెడ్డి, లడ్డు, పంబాపూర్‌కు చెందిన సతీష్‌గా ఘటనాస్థలిలోనే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 3, 2025

వరంగల్: MLC ఎన్నికలు.. మొదటి రౌండ్ ఫలితాలు

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ఫలితాలను అధికారులు వెల్లడించారు.
1) PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి – 6,035
2) UTF అభ్యర్థి నర్సిరెడ్డి – 4,820
3) స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి- 4,437
4) స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్- 3,115
5) BJP మద్దతు అభ్యర్థి సరోత్తంరెడ్డి- 2,289
కాగా మొత్తం 19 మంది అభ్యర్థులకు చెల్లిన ఓట్లు 23,641, చెల్లని ఓట్లు 494

News March 3, 2025

రైల్వే డివిజన్ ఏర్పాటుపై కేంద్రమంత్రిని కలుస్తా: ఎంపీ కావ్య

image

వరంగల్ మహానగరంలో 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తున్నామని ఎంపీ కడియం కావ్య అన్నారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. రైల్వే సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తానని తెలిపారు. రైల్వే డివిజన్ ఏర్పాటు విషయంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలుస్తామన్నారు. వరంగల్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

News March 3, 2025

WGL: మక్కలు, పల్లికాయ ధరలు ఎలా ఉన్నాయంటే?

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు చిరుధాన్యాలు తరలివచ్చాయి. ఈ క్రమంలో మొక్కజొన్న, పల్లికాయ ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు(బిల్టి) క్వింటాకు రూ.2,355 పలికింది. గత వారంతో పోలిస్తే మక్కల ధర తగ్గింది. అలాగే పచ్చి పల్లికాయ క్వింటాకి రూ.5,500 ధర రాగా.. సూక పల్లికాయకి రూ.7,500 ధర వచ్చింది.

News March 3, 2025

వరంగల్: అతిపెద్ద రన్‌‌ వే ఉన్న ఎయిర్‌పోర్ట్ మనదే!

image

మామునూర్ విమానాశ్రయాన్ని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యాపారాల కోసం 1930లో నిర్మించారు. నిజాం కాలంలో దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద రన్‌ వే కలిగిన ఎయిర్‌పోర్ట్ కూడా మనదే. చైనాతో యుద్దం సమయంలోనూ మన ఎయిర్‌‌పోర్ట్ సేవలందించింది. మాజీ ప్రధాని నెహ్రూ సైతం ఓసారి ఈ ఎయిర్‌పోర్టులో దిగారు. మరి ఎయిర్‌పోర్ట్‌కు ఏ పేరు పెట్టాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 2, 2025

మాజీ MLA వన్నాల శ్రీరాములు సతీమణి మృతి

image

వర్ధన్నపేట మాజీ MLA, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకుడు, కర్ణాటక ఇన్‌ఛార్జి వన్నాల శ్రీరాములు సతీమణి వన్నాల విజయలక్ష్మి(70) మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు, పలు పార్టీల కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News March 2, 2025

నల్లబెల్లి: అర్ధ శతాబ్ద అపూర్వ కలయిక

image

1975 సంవత్సరంలో ఏడో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు 50 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థులు కలుసుకొని బాల్యంలోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈవో దేవా, మురళి, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.