India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బడ్జెట్ సంబంధిత సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. రేపు జరగబోయే 2024-25కు సంబంధించిన బడ్జెట్ సమావేశం నిర్వహణ దృష్ట్యా బుధవారం ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి బడ్జెట్ అంశాలపై మేయర్ సమీక్షించారు. అధికారులు ఆదాయ వ్యయాలపై అవగాహన కలిగి ఉండి, సభ్యులు అడిగే అంశాలకు సమాధానం ఇచ్చే విధంగా ఉండాలని అన్నారు.
వరంగల్ జిల్లా కాన్ఫరెన్స్ హాల్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్పై కలెక్టర్ సత్య శారద సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని మండలాల్లో వేసవి నీటి ఎద్దడి నివారణ చర్యలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలతో సమీక్ష పురోగతి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ నూతన వైస్ ఛాన్సలర్గా డా.పివి నందకుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూనివర్సిటీ ప్రతిష్టను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. యూనివర్సిటీలోని పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో ముచ్చటించారు. వీసీకి రిజిస్టర్ సంధ్య, ఎగ్జామినేషన్ కంట్రోలర్ రమేశ్, ప్రవీణ్ కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు.
కాళోజి నారాయణ రావు హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీకి కొత్త వైస్ ఛాన్స్లర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ పీవీ నందకుమార్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నియమించారు. ఇతడు మూడు సంవత్సరాలు కొనసాగుతారని నియామక పత్రంలో తెలిపారు. నేడు లేక రేపు కొత్త వైస్ ఛాన్స్లర్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
వేసవికాలంలో సూర్యుడు అగ్నిగోళాన్ని తలపిస్తుంటాడు. ప్రస్తుతం మార్చి నెలలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం నుంచి అలా వేడెక్కి సూర్యుడు సాయంత్రానికి కాస్త శాంతిస్తాడు. అలాగే సాయంత్రం వేళ అందంగా కూడా కనిపిస్తాడు. వరంగల్ లోని హంటర్ రోడ్ లో బుధవారం ఇలా సూర్యాస్తమయం ప్రజలను ఆకట్టుకుంది. SHARE
ఈనెల 21 నుండి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహణపై సమీక్షించారు. ఉ.9:30 నుంచి 12:30 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. దీనికోసం 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు ఫ్లయింగ్ స్కార్డ్స్ 49 మంది శాఖ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర బడ్జెట్ మీద మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను రాష్ట్ర రెండో బడ్జెట్ ప్రతిబింబించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇవాళ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి తగిన మేరకు కేటాయింపులు చేయడం హర్షణీయం అని మంత్రి అన్నారు.
సెల్ఫోన్ లైట్లతో దహన సంస్కారాలు చేసిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరిలో జరిగింది. స్థానికుల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణించాడు. సమయం దాదాపు రాత్రి 7 కావడంతో సెల్ఫోన్ వెలుగుల్లో దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో అక్కడ ఎలాంటి విద్యుత్ ఏర్పాట్లు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో స్నానాలు చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యులెవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు 41,412 దరఖాస్తులు రాగా.. 14,899 క్రమబద్దీకరణకు మంజూరు చేశారు. ఫీజు చెల్లించిన 665 మందికి క్రమబద్ధీకరణ పత్రాలు అందజేయడం జరిగిందన్నారు.
సీఈవో ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయంలో అదరపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు నియోజకవర్గాల వారీగా ఎలక్ట్రోరల్ డ్రాఫ్ట్ మొత్తం ఓటర్లు 771139 కాగా, అందులో ఆడిషన్స్ 3777, డెలిషన్స్ 2092 ఉన్నాయని ఫైనల్ ఎలక్ట్రానిక్ ఓటర్లు 772824 ఉన్నారన్నారు.
Sorry, no posts matched your criteria.