Warangal

News August 22, 2024

పీపుల్స్‌ ఛాయిస్‌ టైటిల్‌ విన్నర్‌గా వరంగల్ యువతి

image

దేశాయిపేట శివారు లక్ష్మిటౌన్‌ షిప్‌కు చెందిన దీక్షిత పీపుల్స్‌ ఛాయిస్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది. ఈనెల 14 నుంచి 17 వరకు HYDకు చెందిన మాంటి ప్రొడక్షన్‌ సంస్థ మిస్టర్‌ అండ్‌ మిస్‌ గార్జియస్‌ ఆఫ్‌ ఇండియా (సీజన్‌-4) పోటీలను నిర్వహించింది.క్యాన్సర్‌ బాధితులకు ఫడ్‌ రేసింగ్, మహిళలు క్యాన్సర్‌ బారిన పడకుండా ముందస్తుగా తీసుకునే జాగ్రత్తలపై చేసిన సూచనలకు పీపుల్స్‌ ఛాయిస్‌ టైటిల్‌ దక్కినట్లు ఆమె తెలిపారు.

News August 21, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్

image

> HNK: వచ్చే ఏడాది కల్లా ముంపు ప్రాంతాలను అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే నాయిని
> HNK: జిల్లా వ్యాప్తంగా ఘనంగా బోనాల పండుగ వేడుకలు
> JN: రైతు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి
> WGL: పెరిగిన మిర్చి, పత్తి ధరలు
> HNK: అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు!
> MHBD: అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలి
> WGL: వ్యక్తిని కాపాడిన పోలీసులను అభినందించిన సీపీ

News August 21, 2024

బంగారు మైసమ్మ దేవాలయం మంత్రి కొండా సురేఖ పూజలు

image

బంగారు మైసమ్మ దేవాలయం హైదరాబాద్ దేవాదాయ శాఖ కేంద్ర కార్యాలయంలోని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ పాల్గొని అమ్మ వారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజాలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, పాల్గొన్నారు.

News August 21, 2024

ఈనెల 22న ధర్నాను విజయవంతం చేయాలి: దాస్యం

image

కేసీఆర్ ప్రభుత్వం రైతులను రాజును చేస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రోడ్డుపాలు చేసిందని మాజీ MLA వినయ్ భాస్కర్ అన్నారు. బుధవారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 22న ఏకశిలా పార్క్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టనున్నామని అన్నారు. రైతులందరికీ రుణమాఫీ అయ్యేవరకు రైతుల పక్షాన పోరాడుతామన్నారు.

News August 21, 2024

వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు (బిల్టీ) క్వింటాకు రూ. 2780, పసుపు ధర రూ.12,273 పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ.6,260 పలకగా.. పచ్చి పల్లికాయ ధర రూ.4,200 పలికింది. మరో వైపు 5531 రకం మిర్చికి రూ.12 వేల ధర వచ్చినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు.

News August 21, 2024

వరంగల్: పత్తి క్వింటా రూ.7,500

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రెండు రోజులుగా పత్తి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,370 ఉండగా.. నేడు రూ.130 పెరిగి రూ.7,500 పలికింది. రెండు నెలల వ్యవధిలో ఇంత ధర రావడం ఇదే మొదటిసారి. రెండు రోజులుగా పత్తి ధరలు పెరుగుతుండడం అన్నదాతలకు కొంత ఉపశమనం కలిగించే విషయం.

News August 21, 2024

నేడు మేడారంలో పొట్ట పండుగ

image

మేడారంలో పొట్ట పండుగను బుధవారం సమ్మక్క పూజారులు నిర్వహించనున్నారు. సమ్మక్క గుడిని శుద్ధి చేసి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి పూజారులు రాత్రి గుడి నుంచి అమ్మవారి రూపంలో పసుపు, కుంకుమ, పూజ సామగ్రిని తీసుకెళ్లి జాగారాలు చేస్తారు. గురువారం తెల్లవారుజామున కొత్తగా పొట్టకు వచ్చిన ధాన్యాన్ని నైవేద్యంగా తల్లికి సమర్పిస్తామని పూజారులు తెలిపారు.

News August 21, 2024

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి అప్‌లోడ్ చేయాలి: కలెక్టర్

image

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన బృందాలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దరఖాస్తులకు డాక్యుమెంట్లు, ప్లాట్ ఇమేజెస్, మాస్టర్ ప్లాన్ జత చేసి ఉండాలని, అధికారులు పరిశీలనకు వెళ్లేటప్పుడు గ్రామాల వారీగా, సర్వే చేయాలని కలెక్టర్ తెలిపారు.

News August 20, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> BHPL: కారు, ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు
> MHBD: వ్యవసాయ మోటార్ల దొంగలని అరెస్టు చేసిన పోలీసులు
> JN: తమ్మడపల్లి దుర్గామాత ఆలయంలో చోరీ
> MHBD: రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
> WGL: గుర్తు తెలియని వ్యక్తిని కాపాడిన పోలీసులు
> BHPL: గాంధీనగర్ క్రాస్ రోడ్ వద్ద కొండ చిలువ కలకలం
> HNK: ఫాతిమా నగర్లో కుక్కల స్వైర విహారం

News August 20, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి టాప్ న్యూస్..

image

> MLG: లక్నవరంలో మంత్రులు జూపల్లి, సీతక్క బోటింగ్
> BHPL: పాండవుల గుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి జూపల్లి
> WGL: భారీగా పెరిగిన పత్తి ధర
> HNK: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
> JN: బ్యాంకును సందర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
> HNK: వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్
> MLG: విధులు బహిష్కరించిన జీపీ సిబ్బంది