India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యారణ్య ప్రభుత్వ సంగీతా నృత్య కళాశాలలో పలు విభాగాల్లో సర్టిఫికెట్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుధీర్ కుమార్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కూచిపూడి నృత్యం, సితార్, పేరిణి నృత్యం పలు విభాగాల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
కోటగుళ్లను మరింతగా అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం గణపురం మండలం కోటగుళ్లను సందర్శించారు. గణపురం కోటగుళ్ల విశిష్ఠత మాటల్లో చెప్పలేనిదని, తప్పనిసరిగా గణపురం కోటగుళ్లను మరింతగా అభివృద్ధి చేసి వరంగల్ జిల్లాలోనే పేరుగాంచిన ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధరల రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రెండు నెలలుగా మొక్కల ధరలు భారీ ధర పలుకుతున్నాయి. నేడు మార్కెట్కు మొక్కజొన్న తరలిరాగా ధర క్వింటాకు రూ.2,780 పలికింది. దీంతో మక్కలు పండించిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేని శివారు బాల్యనాయక్ తండా కి చెందిన బానోతు రాజన్న ఇటీవల మరణించారు. రాజన్న ఎంతో ఇష్టంతో తీసుకున్న బైక్ను తన అక్క బోడ శ్రీలత ఆమె భర్త కోసం కేసముద్రం మండలం బెరువాడ తన అత్తగారింటికి తీసుకొచ్చింది. సోమవారం రాఖీ పండుగ నేపథ్యంలో బైక్కు రాఖీ కట్టి కన్నీరు మున్నీరుగా విలపించింది.
అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం భూపాలపల్లి వాసి, కాంగ్రెస్ కార్యకర్త నదీమ్ తన రక్తంతో మంత్రి సురేఖ బొమ్మ గీయించి అవధులు లేని తన అభిమానాన్ని చాటాడు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభ్యున్నతికి శ్రమిస్తున్న మంత్రి సురేఖ నిండు నూరేళ్లు వర్ధిల్లాలన్నారు. ఆమె దిశానిర్దేశంలో కాంగ్రెస్ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని నదీమ్ ప్రకటించాడు.
నేడు భూపాలపల్లి జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు కొడవటంచ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని, ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11:15 గంటలకు పాండవుల గుట్టను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1గంటలకు ఘనపూర్ చెరువును, మధ్యాహ్నం 2:15 గంటలకు కోటగుళ్లను సందర్శిస్తారు. అనంతరం ములుగు జిల్లాలోని రామప్ప, లక్నవరం చెరువును సందర్శిస్తారు.
3 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మంగళవారం పున: ప్రారంభం కానుంది. వరుసగా రెండు వారాంతపు సెలవులు, నిన్న రాఖీ సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
> HNK: ఆర్టీసీ బస్సును ఆపి సోదరుడికి రాఖీ కట్టిన అక్క
> MLG: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క
> JN: మానవత్వం చాటుకున్న ఎంపీ కడియం కావ్య
> WGL: పాకాల సరస్సు వద్ద పర్యాటకుల సందడి
> MHBD: జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం
> WGL: పలు కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం
> BHPL: మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన గండ్ర
ఆడ బిడ్డలను రక్షించుకుంటూ అన్నిరంగాల్లో రాణించే విధంగా ప్రోత్సహిద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఇతర నేతలకు సీతక్క రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మహిళా నేతలు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమమే లక్ష్యంగా, వారి రక్షణే ధ్యేయంగా మహిళలను మహాలక్ష్ములుగా చూసుకుంటుందని డిప్యూటీ సీఎం చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాగమయి, మహిళా నేతలు, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.