Warangal

News March 2, 2025

WGL: యువకుడితో పరారైన 35 ఏళ్ల వివాహిత

image

ఓ వివాహిత యువకుడితో పరారైన ఘటన మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్‌లో జరిగింది. KPHBలో ఉంటున్న పల్నాడుకు చెందిన గోపి(22)కి వరంగల్‌‌కు చెందిన సుకన్య(35)కు ఓ యాప్‌లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. FEB 5న గోపిని కలిసేందుకు సుకన్య వస్తుందని గుర్తించిన భర్త వారిని వెంబడించాడు. బైక్‌పై వెళ్తుండగా.. భర్త అడ్డుకోవడంతో బైక్ వదిలేసి ఇద్దరు పరారయ్యారు. దీంతో ఆమె భర్త పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 2, 2025

వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

image

వరంగల్ జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. లైవ్ కోడి కిలో రూ.120 పలకగా.. విత్‌ స్కిన్ KG రూ.130-140 పలకగా, స్కిన్‌లెస్ KG రూ.160 పలుకుతోంది. అయితే గత వారంతో పోలిస్తే ఈరోజు ధరలు స్వల్పంగా పెరిగాయి. బర్డ్స్ ఫ్లూ ప్రభావంతో స్వల్పంగా అమ్మకాలు పడిపోయాయని నిర్వాహకులు తెలుపుతున్నారు. కాగా.. సిటీతో పోలిస్తే పల్లెలలో రూ.10-20 ధర వ్యత్యాసం ఉంది.

News March 2, 2025

బొల్లికుంట: ‘మామునూరు భూసేకరణకు రూ.205 కోట్ల విడుదల’

image

వరంగల్(జిల్లా )మామునూరు విమానాశ్రయం భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు అటవీ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు 696 ఎకరాల భూ సేకరణ పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలో 253 ఎకరాల భూసేకరణకు ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు కోరారు.

News March 2, 2025

WGL: బాలికపై అత్యాచారయత్నం. పోక్సో కేసు నమోదు

image

వరంగల్ గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాల్‌కు చెందిన రాజు (50) పై పొక్సో కేసు నమోదు చేశారు. నాలుగు సంవత్సరాలు బాలికపై అత్యాచారయత్నం ఘటనలో కేసు నమోదైంది. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసేందుకు వచ్చిన రాజు అదే కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి కుమార్తెపై లైంగికదాడి పాల్పడుతుండగా బాలిక ఏడ్చింది. దీంతో రాజు అక్కడి నుంచి పారిపోయాడు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

News March 2, 2025

కమలాపూర్: రూ.9,51,000ల సైబర్ మోసం

image

సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ వ్యక్తి రూ.9,51,000 పోగొట్టుకున్న ఘటన కమలాపూర్ మండలంలో చోటుచేసుకుంది. సీఐ హరికృష్ణ కథనం ప్రకారం.. శనిగరం గ్రామానికి చెందిన మనోజ్‌కు టెలిగ్రామ్ ద్వారా బావి జోషి అనే అడ్రస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. టాస్క్ ఆడితే డబ్బులు రెట్టింపు అవుతాయని తెలుపగా విడతల వారీగా రూ.9.51లక్షలు వేశారు. ఎంతకూ నగదు రెట్టింపు కాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 2, 2025

నేషనల్ మెరిట్ స్కాలర్షిప్‌కు వరంగల్ బిడ్డలు

image

చెన్నారావుపేట మండలం లింగాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్‌కు ఎంపికయ్యారు. 8వ తరగతి చదువుతున్న బూర మానస, మైధం నవంబర్‌లో నిర్వహించిన స్కాలర్షిప్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచారు. విద్యార్థులకు నాలుగేళ్ల పాటు రూ.12వేల చొప్పున స్కాలర్షిప్ వస్తుందని HM సలీం తెలిపారు.

News March 2, 2025

నెక్కొండ: ‘భార్య తిట్టిందని పురుగుమందు తాగాడు’

image

భార్య మందలించడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నెక్కొండ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సె మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటతండాకు చెందిన ధరావత్ శ్రీనివాస్ (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. భార్య తిట్టడంతో బాధపడిన శ్రీనివాస్ పురుగుమందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

News March 2, 2025

గీసుగొండ: భార్యతో గొడవ.. భర్త సూసైడ్

image

మనస్తాపంతో యువకుడు ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గీసుగొండ మండలంలో జరిగింది. గీసుగొండ సీఐ మహేందర్ కథనం ప్రకారం.. మరియాపురానికి చెందిన గొలమారి థామస్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన మంజులతో కులాంతర వివాహం పెద్దల సమక్షంలో జరిగింది. కాగా భార్యాభర్తల మధ్య విభేదాలు రాగా మనస్తాపం చెందిన థామస్ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుడి అక్క నీలిమ ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేశారు.

News March 2, 2025

గీసుగొండ: బాలికపై లైంగికదాడి

image

నాలుగు సంవత్సరాల బాలికపై లైంగికదాడి చేసిన ఘటన గీసుగొండ మండలంలో చోటు చేసుకుంది. గీసుగొండ సీఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి కోసం దంపతులు ఇతర రాష్ట్రం నుంచి గీసుగొండ మండలానికి వచ్చారు. ఇక్కడ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రాజు అనే వ్యక్తి 4 సంవత్సరాల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

News March 1, 2025

ఎల్కతుర్తి: క్రేన్ తగిలి తండ్రి, కొడుకు స్పాట్ డెడ్

image

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రేన్ తగిలి తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతులు కోతులనడుమ గ్రామానికి చెందిన రాజేశ్వర్ రావు, వికాస్‌గా గుర్తించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.