Warangal

News February 28, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 93.57%

image

ఉమ్మడి WGL-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న నల్గొండలో లెక్కింపు జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సా. 4 గం. వరకు 93.57% పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా.. హనుమకొండ 91.66, వరంగల్ 94.13, జనగామ 94.31, మహబూబాబాద్ 94.47, భూపాలపల్లి 93.62, ములుగులో 92.83% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మీరు ఓటు వేశారా? కామెంట్ చేయండి.

News February 28, 2025

దుగ్గొండి: పులి అడుగులంటూ ప్రచారం..!

image

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రామయ్యపల్లి గ్రామంలో పులి సంచరిస్తున్నట్లు స్థానికంగా కలకలం రేపింది. ఒక రైతు మొక్కజొన్న చేనులో పులి పాదముద్రలు ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో గురువారం ఆ అడుగులను పరిశీలించారు. అవి పులి అడుగులు కాదని హైనా జంతువు అడుగులని తెలిపారు.

News February 28, 2025

వరంగల్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు జరిగింది. సీఐ రాఘవేందర్ కథనం ప్రకారం.. బాలాజీనగర్‌కి చెందిన జక్కోజు శివకృష్ణచారి(31)కూలీ పని చేస్తుండేవాడు. తరచు మద్యం తాగి ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. నిన్న సాయంత్రం మద్యం తాగి వచ్చిన అనంతరం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. భార్య లావణ్య ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసినట్లు తెలిపారు.

News February 28, 2025

జిల్లాలో రాయపర్తిలోనే తక్కువ పోలింగ్

image

రాయపర్తి మండలంలో గురువారం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో వరంగల్ జిల్లాలోనే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. రాయపర్తి మండలంలో 66మంది ఓటర్లుండగా.. 60 మంది టీచర్లు ఓటును వినియోగించుకున్నారు. మొత్తంగా 90.90శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఎక్కువగా సంగెం మండలంలో 98.48శాతం నమోదైంది.

News February 28, 2025

వరంగల్: మీ మండలంలో ఎంత పోలింగ్ అయిందంటే..?

image

వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జిల్లాలో 94.13శాతం పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి. వర్ధన్నపేట-97.83, రాయపర్తి-90.91, నెక్కొండ-97.18, ఖానాపురం-94.52, నర్సంపేట- 94.91, చెన్నారావుపేట-94.92, పర్వతగిరి-97.44, సంగెం-98.48, నల్లబెల్లి-95.24, దుగ్గొండి-91.67, గీసుకొండ-94.44, వరంగల్-93.07, ఖిల్లా వరంగల్-93.99

News February 28, 2025

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు : WGL కలెక్టర్

image

ఖమ్మం వరంగల్ నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయులు ఉదయం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 2,352 మంది ఓటర్లకు 94.13 శాతం ఓటేశారని పేర్కొన్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా బ్యాలెట్ పత్రాలను భారీ బందోబస్తు మధ్య నల్గొండ జిల్లాకు తరలించారని తెలిపారు.

News February 27, 2025

వరంగల్: ముగిసిన పోలింగ్.. 94 శాతం పోలింగ్

image

ఉమ్మడి వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. వరంగల్ జిల్లాలో మొత్తం 2352 ఓట్లకు 2214మంది ఉపాధ్యాయులు ఓటేశారు. మొత్తంగా 94.13 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

News February 27, 2025

వరంగల్: మధ్యాహ్నం 2గంటల వరకు 75.64% పోలింగ్

image

వరంగల్ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు 75.64 శాతం పోలింగ్ నమోదైనట్లు ఉపాధ్యాయ ఎన్నికల అధికారి తెలిపారు. వరంగల్ జిల్లాలో మొత్తం 2,352 ఓట్లకు మధ్యాహ్నం 2గంటల వరకు 1,779 ఓట్లు పోలైనట్లు చెప్పారు. 13మండలాల్లో 13 చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

News February 27, 2025

వరంగల్ జిల్లాలో 46.81% ఓటింగ్

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ శాతం మెరుగుపడింది. 12 గంటల వరకు 46.81 శాతం అధికారులు వెల్లడించారు. వరంగల్ జిల్లాలో మొత్తం 2352 ఓట్లు ఉండగా, 1101 ఓట్లు పోలింగ్ అయ్యాయి. వద్దన్నపేట 54.35, రాయపర్తి 57.58, నెక్కొండ 74.65, ఖానాపూర్ 54.79, నర్సంపేట 51.2, చెన్నారావుపేట 52.54, పర్వతగిరి 53.85, సంగెం 56.06, నల్లబెల్లి 52.35, దుగ్గొండి 35, గీసుకొండ 65.56, వరంగల్ 41.58, కిల్లా వరంగల్ 40.9 నమోదయింది.

News February 27, 2025

లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పరిశీలించిన WGL కలెక్టర్

image

వరంగల్ కలెక్టర్లో ఏర్పాటు చేసిన లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని జిల్లా కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. జిల్లాలో 13 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ కేంద్రాల ఓటింగ్ విధానంపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.