Warangal

News August 18, 2024

జనగామ: ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లాలో జరిగింది. ఎస్సై సృజన్ కుమార్ తెలిపిన వివరాలు.. దేవరుప్పులకు చెందిన రంజిత్ ఫైనాన్స్‌లో కారు తీసుకొని నడుపుకొంటూ జీవనం కొనసాగించేవాడు. ఈ క్రమంలో 3 నెలల కింద రోడ్డు ప్రమాదం జరిగి కారు ధ్వంసం కావడంతో పాటు అతడి కాలు విరిగింది. దీంతో అనారోగ్యానికి గురయ్యాడు. మనస్తాపం చెందిన రంజిత్ శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News August 18, 2024

కాళేశ్వరంలో రెండు శివలింగాల కథ మీకు తెలుసా?

image

కాళేశ్వరంలోని రెండు లింగాల వెనుక ఒక కథ ఉంది. యమధర్మరాజు శివుడి కోసం తపస్సు చేసి వరం పొంది స్వర్గానికి మించిన పట్టణం నిర్మించాలని విశ్వకర్మ వద్దకు వెళ్లాడట. గోదావరి- ప్రాణహిత నదుల సంగమ తీరంలో ఇంద్రలోకాన్ని మించిన పురాన్ని నిర్మించారని అదే కాళేశ్వరక్షేత్రం అని చెబుతారు. అలా శివుడి వరంతో ఈ క్షేత్రంలో(యముడు) ఈశ్వరుడు(శివుడు) ఒకే పానపట్టంపై కొలువయ్యారని కాళేశ్వర ఖండం చెబుతోంది.

News August 18, 2024

వరంగల్- నర్సంపేట రోడ్డులో ప్రమాదం.. ఇద్దరు మృతి

image

వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. WGL-నర్సంపేట రోడ్డులోని గీసుగొండ మండలం కొనాయమాకుల వద్ద బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న రంజిత్, వెంకటనారాయణ మృతి చెందారు. పెళ్లి పత్రికలు పంపిణీ చేసి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతులు హనుమకొండ జిల్లా ఐనవోలు వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 18, 2024

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: అమర్‌సింగ్

image

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ అమర్ సింగ్, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారదను కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో విషజ్వరాలు, డెంగ్యూ, చికెన్‌గున్యా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారించేందుకు తీసుకుంటున్న జాగ్రత్తలు చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించారు. ఈ కార్యక్రమంలో DMHO డాక్టర్ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

News August 17, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి టాప్ న్యూస్..

image

> MHBD: కొడుకు విగ్రహం చేయించిన తండ్రి
> MLG: పోడు భూముల అంశంపై సమీక్ష నిర్వహించిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క
> HNK: జిల్లాలో సందడి చేసిన ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్
> WGL: కలకత్తా వైద్య విద్యార్థిని అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలని నిరసనలు
> MHBD: ప్రశాంతంగా కొనసాగిన జిల్లా బంద్
> JN: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా రాఖీ పండుగ వేడుకలు.

News August 17, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్..

image

> WGL: రైలు ఎక్కుతుండగా ప్రమాదం..
> MHBD: కొత్తగూడలో భారీ కొండ చిలువ..
> WGL: చోరికి పాల్పడ్డ వ్యక్తి అరెస్టు..
> MLG: బైకు ఢీ-కొని బాలుడికి గాయాలు
> MHBD: కురవిలో తప్పిన పెను ప్రమాదం
> JN: కారు- బైకు ఢీ-కొని ఒకరికి గాయాలు
> MHBD: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
> MHBD: ఇసుక డంపులను గుర్తించిన అధికారులు..

News August 17, 2024

వరంగల్: రైలు ఎక్కుతుండగా ప్రమాదం

image

రైలు ఎక్కే క్రమంలో కాలుజారి కాలు తెగిపోయిన ఘటన వరంగల్ రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. శివనగర్‌కు చెందిన శ్రీదేవి (48) వరంగల్ నుంచి సికింద్రాబాద్ రైలు ఎక్కబోయారు. ఈ క్రమంలో కాలు జారి ప్లాట్‌ఫారమ్‌లో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె కాలు విరిగిపోయింది. స్టేషన్ మాస్టర్ 108 అంబులెన్స్‌కి సమాచారం అందించారు. వెంటనే అంబులెన్స్ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

News August 17, 2024

జనగామ: మున్సిపల్ రెవెన్యూ పెంచేందుకు కృషిచేయాలి: కలెక్టర్

image

జనగామ మున్సిపల్ రెవెన్యూ పెంచేందుకు అధికారులు ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పన్నుల వసూలు, ట్రేడ్ లైసెన్స్, ప్రచార హోర్డింగ్స్ అనుమతులు, భవన నిర్మాణ అనుమతులు, రెంటల్ ఛార్జిస్, జరిమానాలపై ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటూ ఆదాయం పెంచాలన్నారు. వసూళ్లలో జాప్యం చేయొద్దన్నారు.

News August 17, 2024

గంగారం: కొడుకు విగ్రహం చేయించిన తండ్రి

image

మృతి చెందిన కొడుకుపై ఉన్న ప్రేమతో ఓ తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోడిశెల మిట్ట గ్రామానికి చెందిన ఈసాల రాకేశ్ గతేడాది విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. రాకేశ్‌పై ఉన్న ప్రేమతో ఆయన తండ్రి సారయ్య గ్రామంలోని వారి వ్యవసాయ భూమి వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. రాజేశ్ విగ్రహాన్ని శనివారం కుటుంబ సభ్యులు ప్రారంభించారు.

News August 17, 2024

నేడు హనుమకొండకు ప్రముఖ నటి కీర్తి సురేశ్

image

ప్రముఖ సినీనటి కీర్తి సురేశ్ ఈరోజు హనుమకొండ నగరానికి రానున్నారు. నక్కలగుట్టలో గల ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె రానున్నట్లు షాపింగ్ మాల్ నిర్వాహకులు తెలిపారు. ఉ.11 గం.లకు వస్తారని పేర్కొన్నారు. ఆమెతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు సైతం హాజరవుతారన్నారు.