Warangal

News February 22, 2025

వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్

image

వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజి వాకడే క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కొనసాగుతున్న ఫౌండేషన్, సెల్లార్‌తో పాటు ఎర్త్ వర్క్ ఎక్సవేషన్ పనులను పరిశీలించారు. గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.

News February 21, 2025

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలి: బల్దియా కమిషనర్ 

image

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు జూనియర్ అసిస్టెంట్లతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై సమీక్ష ఏర్పాటు చేశారు. కమిషనర్ టీపీఎస్‌ల ద్వారా ఇప్పటివరకు పూర్తి చేసిన దరఖాస్తుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నిర్వహణ తిరుపతి అసహనం వ్యక్తం చేశారు.

News February 21, 2025

సహకార సంఘాలను తనిఖీ చేసిన WGL కలెక్టర్

image

చౌటపల్లి, నల్లబెల్లిలో గల కర్షక సేవ సహకార సంఘాలను వరంగల్ కలెక్టర్ సత్య శారద ఆకస్మిక తనిఖీలు చేశారు. సహకార సంఘాల చెరువులను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లను కోపరేటివ్ సొసైటీ రికార్డులను పరిశీలించారు. రైతులకు ఎమ్మార్పీ ధరలకే ఎరువులను విక్రయించాలని కలెక్టర్ ఆదేశించారు. అక్కడే ఎరువులు కొనుగోలుకు వచ్చిన రైతులతో కలెక్టర్ మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.

News February 21, 2025

వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు ఇలా

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి శుక్రవారం వివిధ రకాల మిర్చి ఉత్పత్తులు తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. 5,531 మిర్చి ధర రూ.11వేలు పలకగా, దీపిక మిర్చి రూ.16,400, డబ్బి బ్యాగడి రూ.25,500 ధర పలికాయి. అలాగే 2043 రకం మిర్చికి రూ.14,500, టమాటా మిర్చికి రూ.26వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు చెప్పారు.

News February 21, 2025

కాకతీయ రాజు పెళ్లి ఉత్సవాలు.. హాజరైన ఓరుగల్లు బీజేపీ నేతలు

image

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బస్తర్ కేంద్రంగా పరిపాలించిన కాకతీయ రుద్రమదేవి వారసుడు రాజా కమల్ చంద్ర బాంజ్ దేవ్ మహారాజ్ వివాహ వేడుకలు జగదల్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్ ఇండోర్ రాజవంశ యువరాణితో గురువారం పెళ్లి జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రముఖులు హాజరయ్యారు. ఓరుగల్లు నుంచి బీజేపీ నేతలు నాంపల్లి శ్రీనివాస్, పూసల శ్రీమాన్, శ్రీనివాస్, శ్రీహరితో పాటు మరికొందరు హాజరయ్యారు.

News February 21, 2025

వరంగల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వెబ్‌సైట్!

image

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ తీసుకువచ్చింది. వరంగల్ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా.. లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తుతం దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారంతా https:indirammaindlu.telangana.gov.inలో ఆధార్, ఫోన్ నంబర్ ద్వారా దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు. Share It.

News February 21, 2025

WGL: స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. క్వింటా తేజ మిర్చి ధర బుధవారం రూ.13,600 పలకగా.. నేడు 100 పెరిగి రూ.13,700కి చేరింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చి నిన్న రూ.16,300 ధర రాగా.. ఈరోజు రూ. 16,500కి పెరిగింది. మరోవైపు 341 రకం మిర్చికి నిన్న రూ.13,300 ధర వస్తే.. నేడు రూ.13,200కి తగ్గింది.

News February 21, 2025

WGL: స్ప్రింగ్ స్ప్రీ-2025 వేడుకలకు బ్రహ్మానందం

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) వరంగల్ ప్రతిష్ఠాత్మక వార్షిక సాంస్కృతిక మహోత్సవమైన స్ప్రింగ్ స్ప్రీ-2025కు ముస్తాబవుతోంది. ఈ వేడుకలకు హాజరు కావాలని పద్మశ్రీ డా.బ్రహ్మానందంకు ఆహ్వానం అందజేశారు. ఈ మేరకు ఎన్ఐటీ ఉన్నతాధికారులు ఈరోజు బ్రహ్మానందం ఇంటికి వెళ్లి ఆయనను ఆహ్వానించారు. వేడుకలకు తప్పకుండా వస్తానని బ్రహ్మానందం తెలిపినట్లు వారు చెప్పారు.

News February 20, 2025

లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి: వరంగల్ కలెక్టర్

image

వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రబి 2024-25 ధాన్యం సేకరణ, 2023-24 సీఎంఆర్ మిల్లింగ్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ సత్యశారద దేవి సమావేశం నిర్వహించారు. గురువారం అదనపు కలెక్టర్‌తో కలిసి పౌర సరఫరాల అధికారులు, సంస్థ మేనేజర్, మిల్లర్లతో సమావేశం నిర్వహించి 2024-25 రబి సీజన్లో వరి ధాన్యాన్ని సేకరించేందుకు ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

News February 20, 2025

రబీ ధాన్యం సేకరణపై WGL కలెక్టర్ సమీక్ష  

image

రబీ 2023-24 సీఎంఆర్ మిల్లింగ్ ప్రక్రియ వచ్చే మార్చి 17నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సత్య శారద తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రబీ 2024-25 ధాన్యం సేకరణ 2023-24 సీఎంఆర్ మిల్లింగ్ ప్రక్రియపై కలెక్టర్ పౌర సరఫరాల అధికారులు, సంస్థ మేనేజర్, మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. 2024-25 రబి సీజన్లో 2,10,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేశారు.

error: Content is protected !!