Warangal

News March 12, 2025

WGL: గ్రూప్-2లో BC(A) విభాగంలో SIకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

image

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఏడో బెటాలియన్ రిజర్వ్‌డ్ ఎస్సై BC(A)లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం, లింగాపూర్ గ్రామానికి చెందిన వరంగంటి అశోక్ నాలుగేళ్లుగా డిచ్పల్లి ఏడో బెటాలియన్‌లో SIగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో బీసీఏలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు.

News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. వరంగల్ జిల్లాకు ఏం కావాలంటే?

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని పెండింగ్ పనులను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. WGL కలెక్టరేట్, నూతన బస్టాండ్, సూప్ స్పెషాలిటీ హాస్పిటల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మామునూరు ఎయిర్‌పోర్ట్ పూర్తి చేయాలని, కాజీపేట రైల్వే ఫ్లై-ఓవర్ చేపట్టాలని కోరుతున్నారు. టెక్స్ టైల్ పార్కులో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.

News March 12, 2025

ఎడ్ల బండ్ల ప్రబలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

image

WGL(D) గీసుగొండ కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర ప్రత్యేకమైనది. ఉమ్మడి జిల్లా నుంచి ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రబలతో ఇక్కడికి రావడం ఆనవాయితీ. జిల్లాలోని లంబాడా జాతులవారు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఉదయం హోలీ జరుపుకున్న తర్వాత నుంచి జాతరకు పోటెత్తుతారు. కోలాటాలు, లంబాడా నత్యాలతో ఆలయం చుట్టూ ప్రబలు తిరుగుంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. మరి జాతరకు మీరు వెళ్తున్నారా?

News March 12, 2025

HNK: గ్రూప్-1లో మెరిసిన సాయితేజ

image

TGPSC విడుదల చేసిన గ్రూప్-1 రిజల్ట్‌లో నయీంనగర్‌కి చెందిన పులి సాయితేజ 507 మార్కులతో సత్తా చాటారు. సాయితేజ్ తండ్రి కిషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి తండ్రుల ఆశయాలకు అనుగుణంగా సాయితేజ కష్టపడి చదివి ప్రతిభ కనబరిచారు.

News March 12, 2025

వరంగల్: బల్దియా పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం

image

కరీంనగర్‌లోనే లోయర్ మానేరు డాం వద్ద 33/11 కెవి సబ్ స్టేషన్ వార్షిక నిర్వహణ పనులు కొనసాగుతున్నందున నేడు ఉదయం 8గంటల నుంచి 6గంటల వరకు నీటి సరఫరా జరగదని మున్సిపల్ అధికారులు తెలిపారు. వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతం, మడికొండ, కడిపికొండ బట్టుపల్లి రాంపూర్ ఎల్లాపూర్ నేటి సరఫరా జరగదని పేర్కొన్నారు. ఇట్టి ప్రాంతవాసులు గమనించి సహకరించాలని ఎస్సీ ప్రవీణ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.

News March 12, 2025

రాయపర్తి: మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సందర్శించిన కలెక్టర్

image

మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..1/2 సాగునీటి తీరును క్షేత్రస్థాయిలో అధికారులు కలిసి పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు సాగునీరు అందించేలా కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

News March 12, 2025

వరంగల్: పూడికతీత వేగవంతంగా జరగాలి: కలెక్టర్లు 

image

భద్రకాళి చెరువు పూడికతీత, మట్టి తరలింపు ప్రక్రియ వేగవంతంగా జరగాలని హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద అన్నారు. పూడికతీత పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, బల్దియా కమిషనర్ పరిశీలించారు. పూడిక తీత మట్టి తరలింపు రూట్ మ్యాప్, వాహనాల రాకపోకలకు సంబంధించి వేస్తున్న ఫార్మేషన్ రోడ్డు పనులు మట్టి తరలించేందుకు ఇచ్చే వాహనాల రూట్‌లను పరిశీలించారు.

News March 12, 2025

రాయపర్తి: వరి పంట పొలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్

image

రాయపర్తి మండల పరిధిలో, ఉకల్, ఘటికల్, జగన్నాథపల్లి, గ్రామాల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డీబీఎం 54, 57, కాల్వ వరి పంట పొలాలను కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. ఈ సందర్భంగా వరికి నీరును సకాలంలో అందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను  కలెక్టర్ సత్య శారద అదేశించారు. వరి సాగు చేసే రైతులకు నూతన పద్ధతులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. 

News March 11, 2025

చేర్యాల: CMRF చెక్కు అందజేసిన మంత్రి

image

మంత్రి కొండా సురేఖ తన CMRF చెక్కును అందజేశారు. చేర్యాల మండలం నాగపురి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన ప్రశాంత్ కుమారుడు నయన్ కుమార్ మాటలు రాక ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఏ హాస్పటల్‌కి పోయినా రూ. 8 నుంచి 10లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సూచనతో తక్షణమే వారి పరిస్థితి తెలుసుకొని కింగ్ కోటిలోని ప్రభుత్వ ENT ఆసుపత్రికి రూ. 8లక్షలను CMRF చెక్కును మంత్రి అందజేశారు.  

News March 11, 2025

ములుగు: గిరిజన యూనివర్సిటీ వీసీ నియామకం

image

ములుగు జిల్లా సమక్క-సారక్క గిరిజన యూనివర్సిటీకి మొదటి వైస్ ఛాన్సలర్‌ను భారత ప్రభుత్వం/ కేంద్ర విద్యా శాఖ నియమించింది. హైదరాబాదులోని ఆరోరా హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అకాడమీకి చెందిన ప్రొఫెసర్ యెడవల్లి లక్ష్మీ శ్రీనివాస్‌ను నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.