India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని దీనిపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద సూచించారు. తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ రవీందర్తో కలిసి మాదకద్రవ్యాల డ్రగ్స్ నియంత్రణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ఈనెల 18న హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి బ్లైండ్ పార జూడో ఛాంపియన్షిప్లో వరంగల్కు చెందిన తొమ్మిది మంది క్రీడాకారులు బంగారు పథకం సాధించారు. వారిని గురువారం వరంగల్ కలెక్టర్ సత్య శారద అభినందించారు. ఈనెల 24 నుంచి ఉత్తరప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొంది రాష్ట్రానికి జిల్లాకు పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి సత్యవాణి, క్రీడాకారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అన్నారు. వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించుటకు తగిన సూచనలు చేశారు. సుందరయ్యనగర్లో సీసీ రోడ్ డ్రైన్, క్రిస్టియన్ కాలనీలో గల కమ్యూనిటీ హాల్, చింతల్లో సిసి రోడ్ డ్రైన్, శాంతి నగర్లో కొనసాగుతున్న పనులను పరిశీలించారు.
భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో బుధవారం రాత్రి 15వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ సరళ భర్త రాజలింగమూర్తి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం రాజలింగమూర్తి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో నలుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారని స్థానికులు తెలిపారు. ఈ హత్యకు జిల్లా కేంద్రంలోని ఓ భూవివాదమే కారణమని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనారోగ్యంతో చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన బాలిక ప్రజ్ఞాశాలిని(8) వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో కుటుంబీకులు చిన్నారిని HYDలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు వారు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
కాకతీయ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రానికి సంబంధించిన <<15507872>>పీజీ మొదటి సెమిస్టర్ పరీక్ష<<>> వాయిదా పడింది. ఈ నెల 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఉండటంతో ఆ రోజు జరగాల్సిన పరీక్షను మార్చి 5వ తేదీన నిర్వహిస్తామని, మిగతా పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి, ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.
వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్, ఫిల్టర్ బెడ్లను మేయర్ సందర్శించి నీటి నిల్వల తీరు, ఫిల్టర్ బెడ్ పరికరాలను పరిశీలించారు. నగర వాసులకు తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ఉన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి వివిధ రకాల ఉత్పత్తులు, చిరుదాన్యాలు తరలిరాగా.. ధరలు ఇలా ఉన్నాయి. 5,531 మిర్చి ధర రూ.11వేలు పలకగా, దీపిక మిర్చి రూ.16,000, అకిరా బ్యాగడి రూ.11వేల ధర పలికాయి. అలాగే 2043 రకం మిర్చి రూ.14వేలు, ఎల్లో మిర్చికి రూ.17,000, సూక పల్లికాయకి రూ.6820, పచ్చి పల్లికాయకి రూ.5వేల ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
స్మార్ట్ సిటీ పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూసీ పరిధిలోస్మార్ట్ సిటీ పథకం కింద కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టీచర్స్ కాలనీ ఫేజ్-1లో సీసీ రోడ్ను, వడ్డేపల్లి బండ్పై కొనసాగుతున్న అభివృద్ధి పనులు, 52వ డివిజన్ రాజాజీ నగర్ కల్వర్టు ఇతర పనులను పరిశీలించారు.
ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాలు.. వరంగల్ నగరం కరీమాబాద్కు చెందిన రాజేశ్(24) కొంతకాలంగా HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడి స్నేహితుడి పెళ్లి కోసం ఇంటికి వచ్చాడు.ఆదివారం ఉదయం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని కన్పించాడు. మెడపై గాయాలున్నాయనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.