India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్యశారదా దేవి ఈరోజు వరంగల్ నగరంలోని పలు ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని ఎంజీఎం, కేఎంసీ ఆసుపత్రులను తనిఖీ చేసి, రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అలాగే చికిత్స పొందుతున్న రోగుల నుంచి పలు విషయాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
గురువారం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సెలవు అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పున:ప్రారంభం కావడంతో పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం గత మొన్నటితో పోలిస్తే తగ్గింది. నేడు మార్కెట్లో క్వింటా పత్తికి రూ.7,125 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
BHPL జిల్లా రేగొండ మండలం రావులపల్లె సమీపంలోని పాండవుల గుట్టలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో కొన్నాళ్లపాటు ఈ గుట్టల్లోనే నివసించారట. అందుకే దీనికి పాండవుల గుట్ట అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. ఎత్తైన గుట్టలు, లోతైన గుహలు, నీటి కొలనులు, రాక్ పెయింటింగ్స్ ఈ గుట్టల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గతంలో పాండవుల గుట్టలో రాక్ క్లైంబింగ్ కూడా ఉండేది.
WGL జిల్లా దుగ్గొండి మండలంలో విషాదం నెలకొంది. స్థానిలకు ప్రకారం.. వెంకటాపురం గ్రామానికి చెందిన సురేందర్కు NSPT మండలం బాంజిపేటకు చెందిన ప్రశాంతితో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి 11 నెలల కొడుకు ఉన్నాడు. ప్రశాంతి రెండో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. మరో వారం రోజుల్లో ఆమె ప్రసవించనుండగా.. HYDలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సురేందర్ భార్యను చూసేందుకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆరేళ్లకు భర్త ముఖం చాటేశాడు. బాధితురాలి ప్రకారం.. ముల్కనూరుకు చెందిన రంజిత్ రాజమండ్రి(AP)లోని ఓ ఆస్పత్రిలో పని చేస్తూ అక్కడే నర్స్గా పని చేస్తున్న చంద్రకళను 2018లో పెళ్లి చేసుకున్నాడు. జూలై9న స్వగ్రామం వచ్చి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులతో కలిసి బాధితురాలు ముల్కనూర్ వచ్చింది. భర్త కుటుంబీకులు కట్నం తేవాలంటున్నారని, వారినుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భీమదేవరపల్లిలో ఉరేసుకొని యువతి గురువారం <<13865404>>ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. SI సాయిబాబ, తండ్రి మహేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. భీమదేవరపల్లికి చెందిన నిఖిత కేయూలో పీజీ చేస్తూ మణికొండలోని ఓ ప్రైవేటు కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తోంది. అయితే నిఖితకు HZBలో ఉంటున్న అమ్మమ్మ వెంకటమ్మ అంటే ఇష్టం. ఇటీవల నెలకొన్న మనస్పర్ధల కారణంగా అమ్మమ్మ భీమదేవరపల్లికి రాకపోవడంతో మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
కాళేశ్వర క్షేత్రంలో నేడు సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆలయ ఆవరణలోని కల్యాణ మండపం వద్ద ఉదయం 10.30 గంటలకు అర్చకుల వేదమంత్రాల నడుమ వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మారుతి తెలిపారు. మహిళలకు ఆలయం తరఫున పూజా సామగ్రి ఆందజేయనున్నట్లు చెప్పారు. వ్రతాల నిర్వహణ అనంతరం మహిళలకు ప్రత్యేక ప్రసాదాలను అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత రుణమాఫీ రూ.2 లక్షల వరకు ప్రకటించింది. గురువారం మూడో విడత రుణమాఫీ ప్రకటించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 56,704 మంది రైతులకు లబ్ధి చేకూరింది. వీరికి సంబంధించి రూ.735.29 కోట్ల రుణం మాఫీ కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. శుక్రవారం నుంచి ఖాతాలో డబ్బులు జమ కానున్నాయని అధికారులు తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
> MHBD: వీరభద్రస్వామి పేరుపై రిజర్వాయర్ పరిశీలించండి: సీఎం > JN: స్టేషన్ ఘనపూర్లో ఉప ఎన్నిక వస్తుంది: కేటీఆర్ > JN: BRS మళ్లీ అధికారంలోకి వస్తుంది: ఎమ్మెల్యే పల్లా > WGL: ఉప్పలయ్య హోటల్ కు కేంద్ర ప్రభుత్వ అవార్డు.. > HNK: ఉద్యమ జిల్లా.. మన ఓరుగల్లు > MLG: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు > MHBD: 17వ తేదీన మహబూబాబాద్ జిల్లా బంద్ > WGL: పాకాల సరస్సు వద్ద పర్యాటకుల సందడి
> MHBD: నకిలీ చైన్లు అమ్ముతున్న ఇద్దరి అరెస్ట్
> TRR: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
> HNK: ఆన్లైన్ బెట్టింగ్.. బుకీ అరెస్టు
> MHBD: కారు బోల్తా.. కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు
> HNK: చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్
> BHPL: బాలికను వేధించిన యువకుడిపై కేసు
> WGL: మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
Sorry, no posts matched your criteria.