India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గొంతులో పల్లీ ఇరుక్కుని MHBD జిల్లా గూడురు మండలంలో <<15703711>>బాలుడు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. నాయకపల్లికి చెందిన వీరన్న, కల్పనలకు ఇద్దరు కూతుళ్ల తర్వాత 3వ సంతానం కొడుకు అక్షయ్(18 నెలలు). ఈనెల 7న బాలుడు పల్లి గింజను మింగాడు. దగ్గడం గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు డాక్టర్లు గుర్తించారు. MGMలో చికిత్స పొందుతూ శ్వాస ఆడక ఆదివారం మృతి చెందాడు.
WGL జిల్లాలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్రం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం మామునూరులో దాదాపు రూ.2కోట్లకు పైనే ధర పలుకుతున్నట్లు రియల్ వర్గాలు చెబుతున్నాయి. భూ నిర్వాసిత గ్రామాల రైతులు మాత్రం ఎకరాకు రూ.5 కోట్లు ఇవ్వాలని, తమ గ్రామం నుంచే హైవే వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. మీ ప్రాంతంలో భూముల ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
వరంగల్లో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.160 నుంచి రూ.170 వరకు ధర పలకగా.. విత్ స్కిన్ కేజీ రూ.140, లైవ్ కోడి రూ.100 పలుకుతోంది. సిటీకి పల్లెలకు రూ.10-20 తేడా ఉంది. గత 2 వారాల క్రితం బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చాలా మంది మటన్, చేపల దుకాణాల వైపు మొగ్గుచూపగా మళ్లీ వారం రోజుల నుంచి చికెన్ అమ్మకాలు పెరిగాయని, షాపు నిర్వాహకులు చెబుతున్నారు.
వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో శనివారం ఈ ఏడాది మొదటి లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్లో జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వి.బి.నిర్మల గీతాంబ, సీఎహ్.రమేశ్ బాబు పాల్గొని వివిధ కోర్టుల నుంచి 17 బేంచిలను ఏర్పాటు చేసి మొత్తం 17,542 కేసులు పరిష్కరించారని తెలిపారు. అనంతరం కేసులు ఉన్నవారికి అవగాహన కల్పించినట్లు తెలిపారు.
మహిళల అభివృద్ధి దేశ పురోగతి సాధ్యమవుతుందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. నగరంలోని ఫంక్షన్ హాల్లో జిల్లా సంక్షేమ అధికారి రాజమణి అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద ఇతర అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. మానవునిగా ఆలోచిస్తే మహిళ, పురుష లింగ అసమానత్వం ఉండదని, మహిళ పట్ల అసభ్య ప్రవర్తన జరగదని కలెక్టర్ అన్నారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి, వరంగల్ ఎంపీ డా.కడియం కావ్యలు మర్యాదపూర్వకంగా కలిశారు. కాజీపేట జంక్షన్కు రైల్వే డివిజన్గా అప్గ్రేడ్ చేయాలని కోరుతూ ఎంపి కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. అలాగే నష్కల్ నుంచి హసన్పర్తి, నష్కల్ నుంచి చింతలపల్లి నూతన రైల్వే బైపాస్ లైన్లను ORR చుట్టూ అలైన్మెంట్ చేయాలని కోరారు.
హనుమకొండ(D),ఎల్కతుర్తి(M), వీరనారాయణ గ్రామంలో తల్లి రేవతిని <<15683962>>కొడుకు చంపిన<<>> విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. కుమారస్వామి,రేవతి(40) దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు అజయ్(23) 2ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. తండ్రి 15ఏళ్ల క్రితం చనిపోగా తల్లి పెద్దకొడుకు వద్ద ఉంది. రాత్రి తాగొచ్చిన అజయ్ తల్లిని గొడ్డలితో నరికి చంపాడు.
ఓరుగల్లును మరోసారి మహిళా శక్తి శాసిస్తోంది. ఒకప్పుడు రుద్రమదేవి పరిపాలనలో గొప్ప శోభను అందుకున్న వరంగల్ రాజ్యం,నేడు అనేక కీలక పదవుల్లో మహిళా నేతలు, అధికారులతో మరో చరిత్ర సృష్టిస్తోంది.మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, వరంగల్ ప్రాంతాన్ని నడిపిస్తున్న మహిళా నేతల కృషిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కీలక హోదాల్లో మహిళలు ప్రభుత్వ పరిపాలన నుంచి రాజకీయాల వరకు భాగమవుతున్నారు. HAPPY WOMEN’S DAY.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో జరిగిన సమావేశంలో కీలక ప్రకటన చేశారు. ఓరుగల్లు (వరంగల్)లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ, అలాగే నిట్ లాంటి కళాశాలల్లో సీటు ఇప్పిస్తున్నానంటూ బాధితుల నుంచి రూలక్షల్లో డబ్బుతో పాటు బంగారు అభరణాలను స్వాహా చేసిన మోసగాడిని హనుమకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి పోలీసులు సుమారు రూ.5.10 లక్షల విలువ గల బంగారు అభరణాలతోపాటు రూ.2.68 లక్షల నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.