Warangal

News February 18, 2025

పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

మార్చి 5 నుంచి జరిగే ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద దేవి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు రాసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది తదితరులున్నారు.

News February 18, 2025

నిబంధనలు పాటిస్తేనే అనుమతులు జారీ: బల్దియా కమిషనర్

image

భవన నిర్మాణ నిబంధనలు పాటిస్తేనే అనుమతులు జారీ చేస్తామని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే స్పష్టం చేశారు. నూతన భవనాల నిర్మాణాలకు అనుమతుల మంజూరు బడా భవన నిర్మాణాలకు ఆక్యుపెన్సీని సర్టిఫికెట్ల జారీకి కమిషనర్ నగర పరిధిలోని సుబేదారి ప్రాంతంలోని పోస్టల్ కాలనీ ప్రకాశ్ రెడ్డి పేట ప్రాంతంలో గల లోటస్ కాలనీ ఖాజీపేట ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నమోదు చేసిన వివరాలను కొలతలు వేసి పరిశీలించారు.

News February 18, 2025

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని WGL కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మార్చి 5 నుంచి 25 వరకు జరిగే ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై సోమవారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణితో కలెక్టర్ కలసి ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

News February 17, 2025

స్కూలు విద్యార్థులకు కంటి పరీక్షలు: డీఎంహెచ్వో 

image

వరంగల్ జిల్లాలో 36,368 మంది విద్యార్థులు ఉండగా అందులో 33,516 మందికి కంటి పరీక్షలు 92.36% నిర్వహించినట్లు డీఎంహెచ్వో సాంబశివరావు తెలిపారు. అందులో నుంచి 1074 మంది కంటి దృష్టి లోపాలతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించామన్నారు. వారికి నేత్ర వైద్యులతో పరీక్షలు చేస్తూ ఆన్‌లైన్లో స్టేట్‌కి పంపించడం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమము నేటి నుంచి మార్చ్ 3 వరకు పూర్తి చేయాలన్నారు.

News February 17, 2025

ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ప్రతిపాదనలు పంపండి: సీడీఎంఏ డా.టికే శ్రీదేవి

image

ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ప్రతిపాదనలు పంపాలని కమిషనర్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డా.టి కే శ్రీదేవి అన్నారు. హైదరాబాద్ సీడీఎంఏ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు, నిర్వహణపై వీడియో కాన్ఫరెన్ ద్వారా మాట్లాడారు. జీడబ్ల్యూఎంసీ నుంచి బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News February 17, 2025

వరంగల్: మక్కలు క్వింటా రూ.2,355

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం మొక్కజొన్న తరలివచ్చింది. అయితే గత శుక్రవారం లాగే ఈరోజు కూడా మక్కలు (బిల్టీ) ధర రూ.2,355 ధర పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ.7200, పచ్చి పల్లికాయకి రూ.4,100 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. 

News February 17, 2025

వరంగల్‌లో “ది స్వయంవర్”

image

తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా ది స్వయంవర్ స్టోర్‌ను వరంగల్‌లో ప్రారంభించారు. దేశంలోని 12 రాష్ట్రాల్లోని 42 నగరాల్లో 85 బ్రాంచీలతో ప్రజలకు అందుబాటులో స్పెషల్ కలెక్షన్ అందిస్తోంది ది స్వయంవర్.వివాహాది శుభకార్యాలకు అద్భుతమైన కలెక్షన్ అందించడం స్టోర్ ప్రత్యేకత. పిల్లలు, పెద్దల కోసం పట్టు పంచెలు, దుపట్టా, పైజామా, కుర్తా మొదలైన వస్త్రాలు అందుబాటు ధరల్లో అందిస్తున్నట్టు ది స్వయంవర్ యాజమాన్యం తెలిపింది.

News February 17, 2025

వరంగల్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గత శుక్రవారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వింటా తేజ మిర్చి ధర గత శుక్రవారం రూ.13,600 పలకగా.. నేడు రూ.13,800కి చేరింది. అలాగే వండర్ హాట్(WH) మిర్చికి శుక్రవారం రూ.15,500 ధర రాగా.. ఈరోజు రూ. 16వేలు పలికింది. మరోవైపు 341 మిర్చికి మొన్న రూ.13,600 ధర రాగా.. ఈరోజు రూ.13,500 అయింది.

News February 17, 2025

గైర్హాజరైన విద్యార్థులకు ప్రత్యేక ప్రయోగ పరీక్షలు

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రయోగ పరీక్షల్లో గైర్హాజరైన విద్యార్థులకు మరొక అవకాశంగా ప్రత్యేక బ్యాచ్ ప్రయోగ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. మూడు విడుతల్లో నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో పలువురు విద్యార్థులు అనారోగ్య, తదితర కారణాల వల్ల గైర్హాజరయ్యారని, వారందరికీ ప్రత్యేక బ్యాచ్‌గా స్థానిక ఏవీవీ జూ.కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News February 17, 2025

కేయుూ: 21 నుంచి LLB మొదటి సెమిస్టర్‌ పరీక్షలు

image

కేయూ పరిధిలో LLB మూడేళ్ల కోర్సు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలు(రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌) ఈ నెల 21 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఆసిమ్‌ ఇక్బాల్‌ తెలిపారు. ఈ నెల 21, 24, 28, మార్చి 3, 5 తేదీల్లో మ.2 నుంచి సా. 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు.

error: Content is protected !!