India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ములుగు గ్రామ పంచాయతీ అధికారుల ఐడియా బాగుందని ప్రజలు కితాబు ఇస్తున్నారు. జాతీయ రహదారితో పాటు ఇతర కాలనీ రోడ్లలో పనులు చేసే సిబ్బంది రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. గో స్లో ములుగు గ్రామపంచాయతీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటూ బోర్డులను పెట్టుకొని పని చేస్తున్నారు. వాహనదారులు గమనించి నెమ్మదిగా వెళ్తున్నారని, పని ప్రదేశంలో జీపీ సిబ్బందిపై ప్రమాదాలు తగ్గుతున్నాయని ఈఓ రఘు చెప్పారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎనుమాముల, కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు అధికారులు ఐదు రోజుల పాటు సాధారణ సెలవులు ప్రకటించారు. ఈనెల 14 నుంచి 19 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ప్రత్యేక హోదా కార్యదర్శులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు సెలవు రోజుల్లో మార్కెట్కు సరుకు తీసుకువచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు.
వర్షాకాలం నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులు అవగాహన కల్పించినప్పటి డెంగీ, మలేరియా, టైఫాయిడ్ బారిన పడుతున్నారు. జ్వరం వచ్చిన తర్వాత తలనొప్పి, వాంతులు, కండరాలు, కీళ్లనొప్పులు మొదలగు లక్షణాలు ఉంటే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యాధికారులు తెలిపారు. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు.
వరంగల్, హనుమకొండగా విస్తరించి ఉన్న వరంగల్ మహా నగరాన్ని ఒకే జిల్లాగా గుర్తించేందుకు మరో ఉద్యమం చేపట్టనున్నట్లు మహానగర ఏకీకరణ పునర్నిర్మాణ కమిటీ తీర్మానించింది. మంగళవారం కాజీపేటలోని బాలవికాస కేంద్రంలో కమిటీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ మేయర్ డాక్టర్ రాజేశ్వరరావు, కమిటీ కన్వీనర్ వెంకటనారాయణ, కర్ర యాదవ రెడ్డి, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
* బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హనుమకొండ చౌరస్తాలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఉదయం 10 గంటలకు హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.
* ఉదయం 10 గంటలకు వరంగల్ చౌరస్తాలో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన సభ.
* కేయూ సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 9 గంటల నుంచి 11 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం
MLG: సచివాలయంలో మంత్రి సీతక్కను హీరోయిన్ రెజీనా మర్యాదపూర్వకంగా కలిశారు. తాము తలపెట్టిన రూరల్ విమెన్ లీడర్ షిప్ ప్రోగ్రాంకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రి సీతక్కను హీరోయిన్ రెజీనా కోరారు. అనంతరం పలు అంశాలపై మంత్రి సీతక్కతో హీరోయిన్ చర్చించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం కాజీపేట్ ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. కాజీపేట్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో సమావేశమై కాజీపేట డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలతో పాటు, పెండింగ్ కేసులపై చర్చించారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, కాజీపేట ఏసీపీ తిరుమల్, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
MLG: సచివాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను హీరోయిన్ రెజీనా మర్యాదపూర్వకంగా కలిశారు. తాము తలపెట్టిన రూరల్ విమెన్ లీడర్ షిప్ ప్రోగ్రాంకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రి సీతక్కను హీరోయిన్ రెజీనా కోరారు. అనంతరం పలు అంశాలపై మంత్రి సీతక్కతో హీరోయిన్ చర్చించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
1.CRP: రెండు బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు.
2.HNK: పోక్సో కేసులో యువకుడికి పదేళ్ల జైలు శిక్ష.
3. KRV: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
4.NKD: పాము కాటుతో రైతు మృతి.
5.GNP: పేకాట ఆడుతున్న ఆరుగురి అరెస్ట్.
6.PLK: బాలికపై క్యాటరింగ్ వర్కర్ లైంగిక వేధింపులు.
7.WGL: 36 కిలోల గంజాయి పట్టివేత.
8.KZP: క్యాబ్ డ్రైవర్ పై యువకుల దాడి.
9.RGD: ఇల్లు కూలి వృద్ధురాలికి తీవ్రగాయాలు.
1.HNK: వీరభద్ర స్వామిని దర్శించుకున్న వరంగల్ సీపీ
2.HNK: కాళోజీ కళాక్షేత్రానికి రూ. 45 కోట్లు మంజూరు
3.JN: గురుకుల హాస్టల్స్ పై ఏసీబీ దాడులు
4.WGL: ఎంజీఎంలో ప్రత్యేక ఫీవర్ వార్డు ఏర్పాటు
5.JN: కోర్టుకు హాజరైన మాజీ మంత్రి పొన్నాల
6.HNK: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా- నాయిని
7.NSPT: సీఎంకు ఉత్తరాలు రాసిన పాఠశాల విద్యార్థులు
8.WGL: వరంగల్ లో అతి పెద్ద మట్టి గణపతి
Sorry, no posts matched your criteria.