Warangal

News February 20, 2025

లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి: వరంగల్ కలెక్టర్

image

వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రబి 2024-25 ధాన్యం సేకరణ, 2023-24 సీఎంఆర్ మిల్లింగ్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ సత్యశారద దేవి సమావేశం నిర్వహించారు. గురువారం అదనపు కలెక్టర్‌తో కలిసి పౌర సరఫరాల అధికారులు, సంస్థ మేనేజర్, మిల్లర్లతో సమావేశం నిర్వహించి 2024-25 రబి సీజన్లో వరి ధాన్యాన్ని సేకరించేందుకు ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

News February 20, 2025

రబీ ధాన్యం సేకరణపై WGL కలెక్టర్ సమీక్ష  

image

రబీ 2023-24 సీఎంఆర్ మిల్లింగ్ ప్రక్రియ వచ్చే మార్చి 17నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సత్య శారద తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రబీ 2024-25 ధాన్యం సేకరణ 2023-24 సీఎంఆర్ మిల్లింగ్ ప్రక్రియపై కలెక్టర్ పౌర సరఫరాల అధికారులు, సంస్థ మేనేజర్, మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. 2024-25 రబి సీజన్లో 2,10,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేశారు.

News February 20, 2025

మత్తు పదార్థాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి: WGL కలెక్టర్

image

జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని దీనిపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద సూచించారు. తన ఛాంబర్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ రవీందర్‌తో కలిసి మాదకద్రవ్యాల డ్రగ్స్ నియంత్రణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

News February 20, 2025

క్రీడాకారులను అభినందించిన WGL కలెక్టర్

image

ఈనెల 18న హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి బ్లైండ్ పార జూడో ఛాంపియన్షిప్‌లో వరంగల్‌కు చెందిన తొమ్మిది మంది క్రీడాకారులు బంగారు పథకం సాధించారు. వారిని గురువారం వరంగల్ కలెక్టర్ సత్య శారద అభినందించారు. ఈనెల 24 నుంచి ఉత్తరప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొంది రాష్ట్రానికి జిల్లాకు పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి సత్యవాణి, క్రీడాకారులు పాల్గొన్నారు.

News February 20, 2025

WGL: నాణ్యత ప్రమాణాలు పాటించాలి: కమిషనర్

image

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అన్నారు. వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించుటకు తగిన సూచనలు చేశారు. సుందరయ్యనగర్లో సీసీ రోడ్ డ్రైన్, క్రిస్టియన్ కాలనీలో గల కమ్యూనిటీ హాల్, చింతల్‌లో సిసి రోడ్ డ్రైన్, శాంతి నగర్‌లో కొనసాగుతున్న పనులను పరిశీలించారు.

News February 20, 2025

భూపాలపల్లిలో దారుణ హత్య.. భూ వివాదమే కారణమా?

image

భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో బుధవారం రాత్రి 15వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ సరళ భర్త రాజలింగమూర్తి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం రాజలింగమూర్తి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో నలుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారని స్థానికులు తెలిపారు. ఈ హత్యకు జిల్లా కేంద్రంలోని ఓ భూవివాదమే కారణమని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 20, 2025

డోర్నకల్: అనారోగ్యంతో చిన్నారి మృతి

image

అనారోగ్యంతో చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన బాలిక ప్రజ్ఞాశాలిని(8) వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో కుటుంబీకులు చిన్నారిని HYDలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు వారు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

News February 20, 2025

కేయూ: పీజీ మొదటి సెమిస్టర్ పరీక్ష వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రానికి సంబంధించిన <<15507872>>పీజీ మొదటి సెమిస్టర్ పరీక్ష<<>> వాయిదా పడింది. ఈ నెల 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఉండటంతో ఆ రోజు జరగాల్సిన పరీక్షను మార్చి 5వ తేదీన నిర్వహిస్తామని, మిగతా పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి, ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.

News February 20, 2025

పటిష్ఠ చర్యలు చేపట్టండి: నగర మేయర్

image

వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్, ఫిల్టర్ బెడ్లను మేయర్ సందర్శించి నీటి నిల్వల తీరు, ఫిల్టర్ బెడ్ పరికరాలను పరిశీలించారు. నగర వాసులకు తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ఉన్నారు.

News February 19, 2025

వరంగల్: చిరుదాన్యాలు, ఉత్పత్తుల ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వివిధ రకాల ఉత్పత్తులు, చిరుదాన్యాలు తరలిరాగా.. ధరలు ఇలా ఉన్నాయి. 5,531 మిర్చి ధర రూ.11వేలు పలకగా, దీపిక మిర్చి రూ.16,000, అకిరా బ్యాగడి రూ.11వేల ధర పలికాయి. అలాగే 2043 రకం మిర్చి రూ.14వేలు, ఎల్లో మిర్చికి రూ.17,000, సూక పల్లికాయకి రూ.6820, పచ్చి పల్లికాయకి రూ.5వేల ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.