Warangal

News February 13, 2025

శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో మాఘమాస గురువారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ అర్చకులు తదితరులున్నారు.

News February 13, 2025

వరంగల్ జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు!

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా చలి తగ్గి.. క్రమంగా ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటేనే ఎండలకు భయపడుతున్నారు. మరోవైపు జిల్లాలోని పలు చోట్ల చెక్ డ్యామ్‌లు, చెరువులు సైతం ఎండే పరిస్థితికి వచ్చింది. మీ ప్రాంతంలో ఎండ తీవ్ర ఎలా ఉందో కామెంట్ చేయండి.

News February 13, 2025

పోలీసులు విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలి: పీటీసీ ప్రిన్సిపల్

image

పోలీసులు విధి నిర్వహణలోని మంచి పేరు తెచ్చుకోవాలని మామునూర్ పీటీసీ ప్రిన్సిపల్ పూజ అన్నారు. బుధవారం మామునూర్ క్యాంప్‌లో కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొందిన 256 కానిస్టేబుళ్ల శిక్షణకు పూజ హాజరై మాట్లాడారు. శిక్షణ ద్వారా నేర్చుకున్న ప్రతి విషయం విధి నిర్వహణలో తోడ్పాటు కాగలదని, చెప్పారు. డీఎస్పీలు రమేష్, వేంకటేశ్వర రావు, రవీందర్, పాండునాయక్, పీఆర్‌ఓ రామాచారి పాల్గొన్నారు.

News February 12, 2025

ముగిసిన రెండో విడత ఇంటర్ ప్రయోగ పరీక్షలు

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఫిబ్రవరి 8 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రయోగ పరీక్షలు ఐదు రోజులు నిరాటంకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు వేళల్లో పరీక్షలు నిర్వహించారు.

News February 12, 2025

ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల రేటు పెంచాలి: DMHO

image

ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల రేటు పెంచాలని జిల్లా DMHO గోపాల్ రావు అన్నారు. గీసుగొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని DMHO తనిఖీ చేసి మాట్లాడారు.ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు విశ్వాసాన్ని కల్పించాలన్నారు. పల్లె దవాఖానలో పని చేసే డాక్టర్లు, సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 12, 2025

ఎనుమాముల మార్కెట్ సెక్రటరీ సస్పెండ్

image

ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల సస్పెండ్‌కు గురయ్యారు. జిల్లా పరిధిలోని పత్తి కొనుగోలు కేంద్రాల్లో చోటుచేసుకున్న అక్రమాల నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ మార్కెటింగ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాలకు సంబంధించి 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. మార్కెట్ సెక్రటరీ సస్పెండ్ హాట్ టాపిక్‌గా మారింది.

News February 12, 2025

2కె రన్ ప్రారంభించిన వరంగల్ సీపీ

image

‘SAY NO TO DRUGS,’ డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రం అనే నినాదంతో వరంగల్ నగరంలో ఈరోజు తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్(TSJU) ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. పోచంమైదాన్ కూడలి నుంచి కేఎంసీ వరకు జరుగుతున్న ఈ రన్‌ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, వరంగల్ జిల్లా ఉన్నతాధికారులు, వైద్యులు, యువత పాల్గొన్నారు.

News February 12, 2025

వరంగల్ మార్కెట్లో భారీగా పతనమైన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధర భారీగా పతనమైంది. నిన్న మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. నేడు రూ.6,950కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఒకరోజు వ్యవధిలోనే రూ.110 ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News February 12, 2025

నెక్కొండలో అత్యధికం.. నర్సంపేటలో అత్యల్పం

image

వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 130 ఎంపీటీసీ, 11 జీడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి కోసం నెక్కొండ మండలంలో 81 పోలింగ్ కేంద్రాలు, రాయపర్తిలో 78, పర్వతగిరి-68, సంగెం-66, దుగ్గొండి-65, చెన్నారావుపేట-55, నల్లబెల్లి-53, గీసుకొండ-48, ఖానాపురం-48, వర్ధన్నపేట-47, నర్సంపేట మండలంలో 36 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి.

News February 12, 2025

వరంగల్: స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు

image

వరంగల్ జిల్లాలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయన్న సంకేతాలతో అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లాలో మూడు మండలాల చొప్పున గ్రామపంచాయతీ ఎన్నికలకు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసేలా సమాయత్తం అవుతున్నారు.

error: Content is protected !!