Warangal

News August 13, 2024

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ యాంకర్ సుమ

image

వరంగల్ భద్రకాళి అమ్మవారిని ప్రముఖ యాంకర్ సుమ దర్శించుకున్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, తనకు అమ్మవారు పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలని యాంకర్ సుమ నేడు ట్వీట్ చేశారు. ప్రముఖ యాంకర్ సుమతో పలువురు జిల్లా వాసులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు.

News August 13, 2024

ఉమ్మడి జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> WGL: ప్రేమ జంట ఆత్మహత్య
> MLG: జిల్లాలో దారుణం.. అత్త, మామలపై అల్లుడి దాడి
> JN: దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్
> HNK: అనుమానాస్పద స్థితిలో మృత దేహం లభ్యం
> WGL: బొల్లికుంట వద్ద గంజాయి పట్టివేత
> BHPL: గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
> WGL: సోషల్ మీడియాలో అమ్మాయిల ఫోటోలు పెట్టొద్దు
> JN: పద్మావతి ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం

News August 12, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

> WGL: స్వల్పంగా పెరిగిన పల్లికాయ, పసుపు ధరలు > JN: ఈ ఆలయం వద్ద దీపం వెలిగిస్తే అప్పులు తీరుతాయి! > MHBD: బోనాల జాతర.. కోడిపుంజుకు బంగారు ఆభరణాలు > BHPL: మేడిగడ్డ బ్యారేజీకి తగ్గుముఖం పడుతున్న వరద ప్రవాహం > WGL: టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులకు కొరియన్ కంపెనీల ఆసక్తి: సీఎం > MLG: ఉమ్మడి జిల్లాలో ప్రజావాణి > WGL: డ్రైవర్ ను అభినందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ > JN: ఏసీబీకి చిక్కిన AE

News August 12, 2024

WGL: ఉమ్మడి జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

image

1.WGL: జూద కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.
2.TRR: గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు.
3.RYP: ద్విచక్ర వాహనంపై వచ్చి బ్యాగు చోరీ.
4. STNGNP: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.
5.TRR: తొర్రూరు పట్టణంలోకి గంజాయి.
6.HNK: అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం.
7. MLG: అత్తమామలపై అల్లుడి దాడి.
8.JN: దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తుల అరెస్ట్.
9.RYP: ప్రేమ జంట ఆత్మహత్య.

News August 12, 2024

వరంగల్: ‘సోషల్ మీడియాలో అమ్మాయిల ఫొటోలు పెట్టొద్దు’

image

వరంగల్ గ్రేన్ మార్కెట్ గేట్ హైస్కూల్లో షీ టీం ఆధ్వర్యంలో పిల్లలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేరాలు, అకృత్యాలు పెరుగుతున్న కాలంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన ఉండాలన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పెట్టకూడదని చెప్పారు. సైబర్ నేరాలు జరిగితే టోల్ ఫ్రీ నంబర్ 1930కి తెలపాలన్నారు.

News August 12, 2024

WGL: స్వల్పంగా పెరిగిన పల్లికాయ, పసుపు ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌కి నేడు పసుపు, పల్లికాయ తరలివచ్చాయి. క్వింటా సూక పల్లికాయకి రూ.6,450, పచ్చి పల్లికాయకు రూ.4,050 ధర వచ్చింది. అలాగే పసుపు క్వింటా రూ.14,011 ధర, 5531 రకం మిర్చి రూ.11,500 ధర పలికిందని వ్యాపారులు తెలిపారు. అయితే మొన్నటితో పోలిస్తే నేడు అన్ని రకాల సరకుల ధరలు స్వల్పంగా పెరిగాయని అధికారులు తెలిపారు.

News August 12, 2024

బ్యాంక్ మేనేజర్లతో మార్నేని రవీందర్ రావు సమీక్ష

image

డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో బ్యాంక్ మేనేజర్లతో టెస్కాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. రుణమాఫీ కింద లబ్ధి పొందిన రైతులకు త్వరితగతిన తిరిగి కొత్త పంట రుణాలు ఇవ్వాలని, సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానీ రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

News August 12, 2024

WGL టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులకు కొరియన్ కంపెనీలు ఆస్తకి: సీఎం

image

వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపుతో కొరియా టెక్స్‌టైల్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించిందన్నారు. టెక్స్‌టైల్ రంగం విస్తృతికి తాము తీసుకున్న కార్యాచరణ స్థానిక కంపెనీలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు అనుకూలంగా ఉందని CM అన్నారు. WGL టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులను సీఎం వివరించారు.

News August 12, 2024

ప్రజావాణి నుంచి దరఖాస్తులను స్వీకరించిన వరంగల్ కలెక్టర్

image

వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వినతులు కలెక్టర్ డా.సత్య శారదా దేవి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

News August 12, 2024

కొమురవెల్లి ఆలయ భక్తులకు ముఖ్య గమనిక

image

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ ఈవో బాలాజీ ముఖ్య సూచనలు చేశారు. నేటి నుంచి గర్భ గుడిలో ఫొటోలు నిషేధించనున్నట్లు తెలిపారు. ఆలయంలోని గర్భగుడిలో స్వామి వారి అమ్మవార్ల మూలవరుల ఫొటోలు తీసి సామాజిక మధ్యమాల్లో ప్రచురించడం వల్ల దేవాలయ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. భక్తులు విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.