India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వరంగల్ జిల్లాలో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కలెక్టర్ సత్య శారద అన్నారు. జిల్లాలో 816 చెరువులు ఉండగా, అందులో 262 చెరువులు సర్ ప్లస్లో ఉన్నాయన్నారు. చెరువులకు ఎలాంటి గండి పడ్డా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ శాఖల సమన్వయంతో పర్యవేక్షిస్తున్నామన్నారు. అత్యవసర సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

రాష్ట్రంలోనే ఆర్టీసీ వరంగల్-1 డిపో అగ్రస్థానంలో నిలిచింది. రాఖీ పండుగ రోజు రాష్ట్రంలోని 97 డిపోల్లో వరంగల్-1 డిపో రూ.49.14 లక్షల ఆదాయాన్ని రాబట్టినట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. బస్సులు 79,057 కి.మీలు తిరిగాయన్నారు. మహాలక్ష్మి పథకంతో పాటు మామూలు ప్రయాణికులతో ఈ ఆదాయాన్ని రాబట్టినట్లు వెల్లడించారు.

రానున్న 72 గంటల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరంగల్ కమిషనర్ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాలని అలాగే శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇండ్లల్లో నివసించే వారు సైతం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కమిషనర్ తెలిపారు.

వరంగల్: దేవాదాయ శాఖలోని పలువురు ఉద్యోగులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బదిలీలు జరిగాయి. వరంగల్ భద్రకాళి ఆలయం నుంచి అద్దంకి విజయ్ కుమార్ను మేడారానికి, అక్కడి క్రాంతిని భద్రకాళికి బదిలీ చేశారు. రికార్డు అసిస్టెంట్ ఆకారపు వీరన్నలను పరస్పరం బదిలీ చేసినట్లు దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. ఉద్యోగులపై ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ సత్యశారదతో మంత్రి కొండా సురేఖ ఫోన్లో మాట్లాడారు. సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడగా.. జిల్లా ప్రజలకు ప్రభుత్వ పరంగా చేసిన ఏర్పాట్లపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయి నివేదికలతో మంత్రికి కలెక్టర్ అందజేశారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

వరంగల్ జిల్లాలో రానున్న 72 గంటలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. జిల్లాలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎంతటి భారీ వర్షాలు వచ్చినా ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలపై వంతెనలపై నుంచి రాకపోకలు లేకుండా చూడాలని సూచించారు.

భారీ వర్ష సూచన నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని కలెక్టర్ సత్య శారద కోరారు. మంగళవారం CM వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆమె జిల్లా పరిస్థితులు, అధికారులు చేపడుతున్న చర్యలను వివరించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులెవరూ సెలవు తీసుకోవద్దని ఆదేశించారు.

వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి మొదటిసారిగా వరంగల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయింది. వర్ధన్నపేట, ఖిలా వరంగల్, సంగెం మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, పర్వతగిరి, గీసుగొండ, నెక్కొండ, చెన్నరావుపేట, రాయపర్తి మండలాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. 40-210 మి.మీ వరకు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వర్షం పడింది.

జిల్లాలో 12 గంటల్లో సగటు వర్షపాతం 92.9 మి.మీ.గా నమోదైంది. అత్యధికంగా సంగెంలో 202.4 మి.మీ. వర్షం కురిసి ‘ఎక్స్ట్రీమ్ హెవీ’ వర్షపాతం కేటగిరీలోకి చేరింది. ఖిలా వరంగల్లో 148.5 మి.మీ., వర్ధన్నపేటలో 93.3 మి.మీ., పర్వతగిరిలో 107.5 మి.మీ. వర్షం పడింది. గీసుగొండ, చెన్నారావుపేట, నెక్కొండ, రాయపర్తి, దుగ్గొండి మండలాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది.
Sorry, no posts matched your criteria.