Warangal

News August 12, 2024

వరంగల్: నేడు క్వింటా పత్తి ధర రూ.7,160

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పున: ప్రారంభమైంది. దీంతో పత్తి తరలివచ్చినప్పటికీ.. ధర మాత్రం గత వారంలాగే పలికింది. నేడు మార్కెట్లో క్వింటా పత్తికి రూ.7,160 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

News August 12, 2024

MHBD: బోనాల పండుగ.. కోడిపుంజుకు బంగారు ఆభరణాలు

image

మహబూబాబాద్ జిల్లాలో ఆదివారం వింత ఘటన చోటుచేసుకుంది. జిల్లాలో కేసముద్రం మండల కేంద్రంలో ఆదివారం ముత్యాలమ్మ తల్లి బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన తొడేటి వెంకన్న అనే భక్తుడు బోనాల కోడిపుంజుకు బంగారు ఆభరణాలు అలంకరించి ఊరేగింపు చేశాడు. ఈ జాతరలో బోనాల కోడి అందరి దృష్టిని ఆకర్షించడంతో పలువురు సెల్ఫీలు.. ఫొటోలు దిగారు.

News August 12, 2024

వరంగల్: ఈ ఆలయం వద్ద దీపం వెలిగిస్తే అప్పులు తీరుతాయి!

image

చిల్పూర్ గుట్టపై వెలసిన శ్రీ గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకంగా నిలుస్తోంది. అక్కడ దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. వెంకటేశ్వర స్వామి తన పెండ్లి కోసం కుబేరుడి దగ్గర చేసిన అప్పును తీర్చలేక ఈ గుట్ట పైకి వచ్చి గుబులుగా చింతిస్తూ.. ఓ గుహలో తపస్సు చేస్తుండగా వెలిసిన గుడినే ఇప్పుడు గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

News August 12, 2024

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మాజీ వరంగల్ సీపీ తరుణ్ జోషి

image

వరంగల్ నగర మాజీ పోలీసు కమిషనర్, ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి ఆదివారం కుటుంబ సమేతంగా శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సవర్భంగా ఈవో శేషుభారతి, ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో ఐపీఎస్ అధికారికి స్వాగతం పలికారు. భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు.

News August 12, 2024

WGL: వర్షాకాలం..? నిండని చెరువులు!

image

గత రెండు నెలలుగా పూర్తి స్థాయిలో వర్షపాతం నమోదుకాకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా చేరలేదు. దీంతో రైతులకు వానలకోసం ఎదురుచూపులు తప్పట్లేదు. జిల్లాలో భూగర్భ జలాల సరాసరి నీటి మట్టం 8.09 మీ. లోతుకి పాతాళగంగ ఉండగా.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత లోతుకి వెళ్లాయి. ఆగస్టులో ఇప్పటివరకు 85.7 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 76.4మి.మీ మాత్రమే నమోదైంది.

News August 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్..

image

1.CTL : ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలు మృతి.
2.JFGD: పిడిఎఫ్ బియ్యం పట్టివేత.
3.HNK: మాజీ ఎమ్మెల్యే నరేందర్ పై కేసు నమోదు.
4. .MRPD: మరిపెడ సిఐ గా రాజ్ కుమార్.
5.RYP: ప్రభుత్వ భూమిలో అక్రమ సాగుపై ఫిర్యాదు.
6.INGT: విద్యుత్ షాక్ తో రైతు మృతి
7.PKL: పోలీస్ ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో పని చేయాలి : ఎమ్మెల్యే
8.PGR. పర్వతగిరి ఎస్సై, సీఐ సస్పెండ్.
9. HNK: హనుమకొండలో గుర్తు తెలియని వ్యక్తి మృతి.

News August 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి టాప్ న్యూస్..

image

1.HNK:నగరంలో అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ తనిఖీలు
2.HNK: జర్నలిస్ట్ యోగి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో ర్యాలీ
3.WGL: వరుస దొంగతనాలతో భయాందోళనలో ప్రజలు
4.THR: టిఆర్ఎస్ ను వీడను :ఎర్రబెల్లి
5.WGL: జిల్లా వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు
6.MHBD: బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి: వినోద్ కుమార్
7.HNK: మంత్రిని కలిసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే

News August 11, 2024

పర్వతగిరి సీఐ, ఎస్సై సస్పెండ్

image

పర్వతగిరి సీఐతో పాటు వీఆర్ ఎస్ఐని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. ఓ కేసు విషయంలో పర్వతగిరి సీఐ శ్రీనివాస్ నాయక్‌తో పాటు అప్పటి ఎస్ఐగా విధులు నిర్వహించిన అనిల్ కుమార్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో సీపీ విచారణకు ఆదేశించారు. వారు అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఇరువురిని సస్పెండ్ చేసినట్లు సీపీ తెలిపారు.

News August 11, 2024

ఇనుగుర్తి: విద్యుత్తుషాక్‌తో వ్యక్తి మృతి

image

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారంలో విషాదం చోటుచేసుకుంది. దర్శనం సోమయ్య (60) అనే వ్యక్తి పనుల నిమిత్తం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్ళగా కరెంటు షాక్ తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సోమయ్యతో పాటు రెండు మూగజీవులు (కుక్క, కోతి) మృతిచెందాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

News August 11, 2024

తిరిగి ప్రారంభమైన శాతవాహన, గోల్కొండ రైలు

image

శాతవాహన, గోల్కొండ, కాజీపేట-డోర్నకల్-విజయవాడ పుష్ పుల్ రైళ్లు పున: ప్రారంభమయ్యాయి. మూడోలైన్ పనుల కారణంగా ఈనెల 5నుంచి ఈ రైళ్లను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిలిచిపోయిన ఈ రైళ్లు శనివారం నుంచి యథావిధిగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. కావున రైల్వే ప్రయాణికులు విషయాన్ని గమనించి ఈ రైళ్లను వినియోగించుకోవాలని కోరారు.