Warangal

News February 17, 2025

వరంగల్: మక్కలు క్వింటా రూ.2,355

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం మొక్కజొన్న తరలివచ్చింది. అయితే గత శుక్రవారం లాగే ఈరోజు కూడా మక్కలు (బిల్టీ) ధర రూ.2,355 ధర పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ.7200, పచ్చి పల్లికాయకి రూ.4,100 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. 

News February 17, 2025

వరంగల్‌లో “ది స్వయంవర్”

image

తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా ది స్వయంవర్ స్టోర్‌ను వరంగల్‌లో ప్రారంభించారు. దేశంలోని 12 రాష్ట్రాల్లోని 42 నగరాల్లో 85 బ్రాంచీలతో ప్రజలకు అందుబాటులో స్పెషల్ కలెక్షన్ అందిస్తోంది ది స్వయంవర్.వివాహాది శుభకార్యాలకు అద్భుతమైన కలెక్షన్ అందించడం స్టోర్ ప్రత్యేకత. పిల్లలు, పెద్దల కోసం పట్టు పంచెలు, దుపట్టా, పైజామా, కుర్తా మొదలైన వస్త్రాలు అందుబాటు ధరల్లో అందిస్తున్నట్టు ది స్వయంవర్ యాజమాన్యం తెలిపింది.

News February 17, 2025

వరంగల్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గత శుక్రవారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వింటా తేజ మిర్చి ధర గత శుక్రవారం రూ.13,600 పలకగా.. నేడు రూ.13,800కి చేరింది. అలాగే వండర్ హాట్(WH) మిర్చికి శుక్రవారం రూ.15,500 ధర రాగా.. ఈరోజు రూ. 16వేలు పలికింది. మరోవైపు 341 మిర్చికి మొన్న రూ.13,600 ధర రాగా.. ఈరోజు రూ.13,500 అయింది.

News February 17, 2025

గైర్హాజరైన విద్యార్థులకు ప్రత్యేక ప్రయోగ పరీక్షలు

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రయోగ పరీక్షల్లో గైర్హాజరైన విద్యార్థులకు మరొక అవకాశంగా ప్రత్యేక బ్యాచ్ ప్రయోగ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. మూడు విడుతల్లో నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో పలువురు విద్యార్థులు అనారోగ్య, తదితర కారణాల వల్ల గైర్హాజరయ్యారని, వారందరికీ ప్రత్యేక బ్యాచ్‌గా స్థానిక ఏవీవీ జూ.కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News February 17, 2025

కేయుూ: 21 నుంచి LLB మొదటి సెమిస్టర్‌ పరీక్షలు

image

కేయూ పరిధిలో LLB మూడేళ్ల కోర్సు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలు(రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌) ఈ నెల 21 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఆసిమ్‌ ఇక్బాల్‌ తెలిపారు. ఈ నెల 21, 24, 28, మార్చి 3, 5 తేదీల్లో మ.2 నుంచి సా. 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు.

News February 17, 2025

వరంగల్: ప్రజాపాలన సేవా కేంద్రాల్లో అదనపు కలెక్టర్ తనిఖీ 

image

కులగణన సర్వేలో వివిధ కారణాల ద్వారా ఎవరైతే వివరాలు ఇవ్వలేదో వారికోసం మరోసారి అవకాశం కల్పించామని అదనపు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రజా పాలన సేవా కేంద్రాలను అదనపు కలెక్టర్ ఆదివారం తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో రీ సర్వేలో నమోదు వివరాలను, రిజిస్టర్లు పరిశీలించారు. ఉ.9 గంటల నుంచి సా.5 గంటల వరకు టోల్ ఫ్రీ నంబర్ 040- 211111111కు ఫోన్ చేసి నమోదు చేసుకోవచ్చన్నారు.

News February 16, 2025

వరంగల్: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య 

image

రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ధర్మారంలో ఓ ప్రైవేట్ షాపులో పని చేసే గోపాల రమ్య(35) 3రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. ఆ బాధను తట్టుకోలేక చింతలపల్లి రైల్వే స్టేషన్ మధ్య ధర్మారం సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని జీఆర్పీ పోలీసులు తెలిపారు.

News February 16, 2025

WGL: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

image

వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

News February 16, 2025

వరంగల్: భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి

image

భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గురజాలలో జరిగింది. మెట్టు మల్లయ్య(78)కు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఆయన్ను వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు ఆయన భార్య సమ్మక్క(69) అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 6వ తేదీన మల్లయ్య మృతి చెందగా, శనివారం సమ్మక్క మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News February 16, 2025

MPTC, ZPTC ఎన్నికలు: వరంగల్ జిల్లా UPDATES

image

వరంగల్ జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారులు శనివారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 13 మండలాలు ఉండగా, వరంగల్, ఖిలా వరంగల్ గ్రేటర్ పరిధిలో ఉన్నాయి. 694 పోలింగ్ కేంద్రాలను ఫైనల్ చేశారు. మొత్తం 130 ఎంపీటీసీ స్థానాలకు, 11 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో మొత్తం 3,85,162 మంది ఓటర్లు ఉన్నారు.