India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాను BRSను వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూర్లో ఆయన మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతానని కావాలనే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలను కార్యకర్తలు నమ్మకూడదని, కార్యకర్తలు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని సూచించారు.
వరంగల్లో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య చేసిన ప్రయత్నం ఫలించింది. వరంగల్కు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకం కింద వెల్నెస్ సెంటర్ మంజూరు అయింది. వెల్నెస్ సెంటర్ ఏర్పాటుతో ఉద్యోగులకు లాభం చేకూరుతుందని ఎంపీ కడియం కావ్య చెప్పుకొచ్చారు. ఎంపీకి ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు.
విభజన హామీల్లో భాగంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ట్వీట్ చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని గతంలో ఉద్యమం జరిగిందని, పదేళ్లుగా బీజేపి కేంద్రంలో అధికారంలో ఉందని, తెలంగాణలో భారీ పరిశ్రమలకు మోదీ పది పైసలైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు.
రోడ్డు ప్రమాదంలో శనివారం <<13825176>>ఇద్దరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. బంధువుల ప్రకారం.. వేలేరు మం. మల్లికుదుర్లకు చెందిన మల్లారెడ్డి(52), అమరేందర్ రెడ్డి(42) మేనబావ, బామ్మర్దులు. వీరి వయసులో వ్యత్యాసం ఉన్నా స్నేహితుల్లాగే ఉండేవారు. ఈ క్రమంలోనే బైకుపై వెళ్తుండగా నిన్న సా. జానకీపురం మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టి 20 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ప్రత్యేకంగా నిలుస్తోంది. గుట్టపై అప్పట్లో సీతారామ, లక్ష్మణులు నివసించారని స్థానికులు చెబుతుంటారు. వాల్మీకి మహర్షి జన్మస్థలంగా ఉన్న ఒకప్పటి వాల్మీకిపురమే నేటి వల్మిడి అని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి గుట్టపై వాల్మీకి రామాయణం రచించారని చరిత్రకారుల అభిప్రాయం. కొండపై ఉన్న గుండం ఎంత కరవు కాలం వచ్చినా ఎండిపోకపోవడం విశేషం.
వరంగల్ జిల్లాలో అమానవీయ ఘటనలు పెరుగుతున్నాయి. MGMలో శుక్రవారం కుక్కలు నోటకరచి తీసుకెళ్తున్న 2-3 రోజుల వయస్సున్న మృతశిశువును పోలీసులు గుర్తించారు. అంతేకాదు, ఈ ఏడాది మే 4న ఒక పసిపాపను మట్టిలో కదులుతున్న ఓ లారీ డ్రైవర్ గుర్తించాడు. గతేడాది డిసెంబర్లో తొర్రూరు డివిజన్ కేంద్రంలో మురుగు కాలువలో 7-9 రోజుల వయసున్న పసిబాబు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనలతో ఈ ఘోరాలను ఆపేదెవరంటూ జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.
ఇండిపెండెంట్ డేను పురస్కరించుకొని కాజీపేట మీదుగా హైదరాబాద్-సంత్రగాచి స్పెషల్ రైలు నడిపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 14, 15వ తేదీల్లో ఈ రైలు నడిపించనున్నారు. హైదరాబాద్లో ఉదయం 5:30కు బయలుదేరి కాజీపేటకు 7:30 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, విజయవాడ,ఖమ్మం, ఏలూరు స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి.పూర్ణిమ శనివారం తెలిపారు. ఆదివారం నుంచి సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు www.navodaya.gov.in వెబ్సైట్లో చే వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
మలక్పేట హాస్టల్ ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. కేసు విచారణ త్వరితగతిన పూర్తిచేసి తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షపడేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదని, కఠినంగా వ్యవహరిస్తుందని సీతక్క చెప్పుకొచ్చారు.
> MHBD: మహిళా వేషధారణలో వ్యక్తి పర్యటన
> JN: అకౌంట్ నుంచి 11 లక్షల రూపాయలు కొట్టేశారు
> BHPL: మేడిగడ్డ బ్యారేజీకి కొనసాగుతున్న వరద ప్రవాహం
> WGL: మూడెకరాల పత్తి పంటను పీకేసిన గుర్తు తెలియని వ్యక్తులు
> WGL: ఈ గ్రంథాలయంలో 90 వేల పుస్తకాలు
> MLG: ఏజెన్సీ ప్రాంతాల్లో అంగన్వాడి సెంటర్లు ఏర్పాటు చేయాలి: సీతక్క
> HNK: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఘనంగా తీజ్ పండుగ వేడుకలు
Sorry, no posts matched your criteria.