Warangal

News August 9, 2025

రైతు బీమా చేయించుకోవాలి: వరంగల్ కలెక్టర్

image

రైతులందరూ రైతు బీమా చేయించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ రూ.5 లక్షల రైతు బీమా చేయిస్తోందని, 18 -59 సంవత్సరాల రైతులు అర్హులని చెప్పారు. గతేడాది బీమా చేసుకున్న వారు కరెక్షన్ ఏవో వద్ద చేపించుకోవాలన్నారు.

News August 9, 2025

సోలార్ విద్యుత్ ఏర్పాటుకు సమన్వయంతో పనిచేస్తాం: కలెక్టర్

image

జిల్లాలో సోలార్ విద్యుత్ ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించేందుకు సమన్వయంతో పని చేస్తామని కలెక్టర్ డా.సత్య శారద వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. జిల్లాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఖాళీ ప్రభుత్వ స్థలాల వివరాలను నిర్ణీత నమూనాలో అందించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు.

News August 9, 2025

రాయపర్తిలో యూరియా బస్తాల కోసం పాదరక్షల క్యూ

image

దేశానికి తిండి పెట్టడం కోసం ఆరుగాలం శ్రమించే అన్నదాతలు యూరియా బస్తాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పంటల సాగులో కీలకమైన యూరియా కోసం రైతన్నలు చెప్పరాని తిప్పలు ఎదుర్కొంటున్నారు. రాయపర్తిలోని PACSకు యూరియా బస్తాలు వచ్చాయనే సమాచారంతో మండలంలోని రైతులంతా పెద్ద ఎత్తున శుక్రవారం వేకువజాము నుంచే బారులు తీరారు. ఎండలో లైన్లో నిలబడలేక సాయంత్రం వేళ చెప్పులను క్యూగా పెట్టి యూరియా బస్తాలు తీసుకున్నారు.

News August 8, 2025

తిమ్మాపూర్ భూ నిర్వాసితులకు ఆర్బిట్రేషన్ నిర్వహణ

image

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163 నిర్మాణంలో భూమి కోల్పోయిన సంగెం మండలం తిమ్మాపూర్ గ్రామ భూ నిర్వాసిత రైతులకు అవార్డ్ పాస్ చేసేందుకు శుక్రవారం ఆర్బిట్రేషన్ మీటింగ్ నిర్వహించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. ఈ ఆర్బిట్రేషన్ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, తహశీల్దార్లు రాజ్ కుమార్, నేషన్ హైవే సైట్ ఇంజినీర్ ఈశ్వర్ రైతులు పాల్గొన్నారు.

News August 8, 2025

డా.ప్రత్యూష ఆత్మహత్య కేసులో సృజన్‌కు బిగ్ షాక్

image

డా.ప్రత్యూష ఆత్మహత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న మృతురాలి భర్త డా.సృజన్‌‌కు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అతడిపై మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సస్పెన్షన్ వేటు వేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులపై BNS యాక్ట్ 108, 115(2), 292, 351(2), 85 r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

News August 8, 2025

వరంగల్ జిల్లాలో దంచికొట్టిన వాన

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రంతా వాన దంచికొట్టింది. జిల్లాలో 621.4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. వరంగల్, ఖిలావరంగల్, గీసుగొండ మండలాల్లో భారీ వర్షం కురవగా మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వరంగల్‌లో 70.9 మి.మీ, ఖిలావరంగల్ లో 65.3 మి.మీ, గీసుగొండలో 92.9 మి.మీల వాన కురిసింది. కాగా వరంగల్, హనుమకొండ నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

News August 8, 2025

వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. జిల్లాలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు.

News August 7, 2025

వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు ఇలా..!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌లో గురువారం చిరుధాన్యాలు ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు(బిల్టీ) క్వింటాకు రూ.2,405, పసుపు రూ.12,003 ధర పలికింది. సూక పల్లికాయకి రూ.5,670, పచ్చి పల్లికాయకు రూ.4,500 ధర వచ్చిందని వ్యాపారులు చెప్పారు. అలాగే టమాటా మిర్చికి రూ.23,500 ధర రాగా..సింగల్ పట్టి మిర్చికి రూ.22,500 ధర వచ్చిందన్నారు.

News August 6, 2025

వసతి గృహాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించాలి: కలెక్టర్

image

గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను తరచూ ప్రత్యేక అధికారులు తనిఖీ చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల సంక్షేమం, భద్రత, పోషకాహారం, పరిశుభ్రత, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని సూచించారు. తనిఖీలలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News August 5, 2025

కళాశాలల్లో ఆధార్, అపార్ నవీకరణ: వరంగల్ డీఐఈఓ

image

జిల్లాలోని అన్ని కళాశాలల్లో ఆధార్, అపార్ నవీకరణ చేపట్టాలని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ అన్నారు. విద్యార్థులకు అందుబాటులోనే అన్ని సేవలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎల్బీ కళాశాలలో నిర్వహిస్తున్న ఆధార్ నవీకరణను శ్రీధర్ సుమన్ పరిశీలించి విద్యార్థులకు సకాలంలో సేవలందించాలని సూచించారు.