Warangal

News August 10, 2024

ఉమ్మడి జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> HNK: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
> BHPL: ప్రభుత్వ పాఠశాల అటెండర్ ఆత్మహత్య
> WGL: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి
> MLG: ట్రాక్టర్ కిందపడి ఒకరు మృతి
> MLG: గుడుంబా స్వాధీనం.. ఐదుగురిపై కేసు
> MHBD: గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం
> HNK: మత్తు పదార్థాల వినియోగం పట్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

News August 10, 2024

ధర్మసాగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన శనివారం ధర్మసాగర్ మండలం జానకిపురంలో చోటుచేసుకుంది. ధర్మసాగర్ సీఐ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మళ్లీకుదుర్ల గ్రామానికి చెందిన గురజాల మల్లారెడ్డి, సారంపెళ్లి అమరేందర్ రెడ్డి బైకుపై ధర్మసాగర్ వైపు వెళ్తుండగాఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 10, 2024

కేసముద్రం: మహిళా వేషధారణలో వ్యక్తి పర్యటన

image

మహిళా వేషధారణ వేసుకొని ఓ వ్యక్తి కేసముద్రంలో పర్యటిస్తున్నాడు. ఒంటరిగా ఉన్న ఓ మహిళ ఇంట్లోకి చొరబడి డబ్బులు అడగాడు. దీంతో ఆమె భయంతో బయటికి పరుగులు తీసింది. ఇది గమనించిన స్థానికులు అతడిని విచారించారు. నాందేడ్ వాసిగా గుర్తించారు. అతడు బిక్షాటనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతని వద్ద కొడవలి ఉన్నట్లు స్థానికలు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 10, 2024

WGL: వందేభారత్ ట్రైన్ షెడ్యూల్లో మార్పు

image

వరంగల్ మీదుగా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (20833/20834) షెడ్యూల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైలు నిర్వహణ కోసం ప్రస్తుతం ప్రతీ ఆదివారం సెలవు ఉండగా.. డిసెంబర్ 10 నుంచి ప్రతి ఆదివారం రైలు నడుస్తుందని..అప్పట్నుంచి మంగళవారం సెలవు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

News August 10, 2024

MHBD మహిళా ఇన్‌ఛార్జిగా విజయలక్ష్మి

image

బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఇన్‌ఛార్జిగా బానోతు విజయలక్ష్మి నియమితులయ్యారు. విజయలక్ష్మి మాట్లాడుతూ.. జిల్లాలో బీజేపీ బలోపేతానికి కష్టపడి పని చేస్తూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని అన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్నారు.

News August 10, 2024

శిశువు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.. UPDATE

image

MGM ఆవరణలో నవజాత శిశువును కుక్కలు పీక్కుతిన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై WGL కలెక్టర్ సత్య శారదా దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు DCP స్థాయిలో విచారణ చేపట్టారు. శిశువును వదిలించుకోవాలని ఎవరైనా వదిలేశారా? లేక MGMలో పనిచేస్తున్న సిబ్బంది దీనికి కారణమా? అనే కోణంలో పోలీసులు CC కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే శిశువుకు బొడ్డు, కాలు భాగాలు లేకపోవడంతో ఆడ, మగ అన్నది గుర్తించ లేకుండా ఉంది.

News August 10, 2024

వరంగల్: దేవాదాయ శాఖలో బదిలీలు

image

దేవాదాయ శాఖలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 8 మంది ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పరిధిలో 6బి కేటగిరీకి వచ్చే దేవాలయాల నుంచి ఇద్దరు, రీజినల్ జాయింట్ కమిషనర్ పరిధిలోకి వచ్చే 6ఏ దేవాలయాల్లో ఆరుగురికి బదిలీలు జరిగాయి. వేయి స్తంభాల గుడిలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ ప్రేమ్ కుమార్ ఐనవోలుకు, ఐనవోలు ఆలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ మధుకర్ వేయిస్తంభాల గుడికి వచ్చారు.

News August 10, 2024

వరంగల్: ఈ గ్రంథాలయంలో 90వేల పుస్తకాలు

image

WGLలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం ఆకర్షణీయంగా నిలుస్తోంది. రూ.2కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో నగరంలోని రంగంపేటలో నిర్మించిన ఈ గ్రంథాలయంలో 90 వేలకు పైగా పుస్తకాలున్నాయి. శిథిలావస్తలో ఉన్న గ్రంథాలయాన్ని ఆధునికీకరించిన తర్వాత ఇక్కడకు వచ్చే పాఠకుల సంఖ్య క్రమంగా పెరిగింది. రోజుకు సుమారు 900 మంది పాఠకుల వరకు వస్తున్నారు. ప్రతి రోజు ఉ.8 నుంచి రా.8 వరకు చదువుకోవచ్చు. మీరూ ఇక్కడకు వెళ్లుంటే కామెంట్ చేయండి.

News August 10, 2024

వరంగల్: దంపతులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

image

ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులపై గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం దాడి చేశారు. సంగీత(24), అక్బర్ పాష(27)లు రెండేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకొని శివనగర్‌లోని రుద్రమ నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆరుబయట మాట్లాడుకుంటున్న సమయంలో బైకుపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడిచేశారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో అంబులెన్స్‌లో ఎంజీఎంకు తరలించారు.

News August 10, 2024

ఉమ్మడి వరంగల్లో పలువురు సీఐల బదిలీ

image

తెలంగాణ రాష్ట్రంలోని మల్టీజోన్-1 పరిధిలోని పలువురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూర్ సీఐగా కె.జగదీశ్, కురవి సీఐగా రాజకుమార్ గౌడ్, అలాగే డోర్నకల్ సీఐగా బీ.రాజేశ్ బదిలీపై రానున్నారు.