India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మూడు రోజుల ముందు వరకు వరంగల్ జిల్లాలోని అధికార యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై తలమునకలయ్యారు. ఇంతలోనే BC సర్వే పూర్తయ్యాకే ఎన్నికల్లోకి వెళ్తామని మంత్రులు ప్రకటించడంతో అధికారులు నిరుత్సాహానికి గురయ్యారు. WGL జిల్లాలో 323 పంచాయతీలు, 130 MPTC, 11 ZPTC స్థానాలు ఉన్నాయి. వాటి ఎన్నికల కోసం ఇప్పటికే RO, AROలకు ట్రైనింగ్, సామగ్రి, పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాపై ఏర్పాటు చేశారు.
జాతీయ గ్రామీణ ఉపాధి పనుల్లో పారదర్శకత లోపిస్తే చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో కౌసల్యాదేవి తెలిపారు. దుగ్గొండిలో ఉపాధి హామీ 2023-24 వార్షిక సంవత్సరంలో చేపట్టిన పనులపై మండల స్థాయి సామాజిక ప్రజా వేదికను శుక్రవారం నిర్వహించారు. గ్రామాల వారీగా చేపట్టిన పనులపై ఈజీఎస్, పంచాయతీ అధికారులు సభలో చదివి వినిపించారు. ఎంపీడీవో అరుంధతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కలెక్టరేట్లో శుక్రవారం సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వరంగల్ కలెక్టర్ సత్యశారదా దేవి సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి రైతులు తమ భూములు అందించి సహకరించాలని కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో గ్రీన్ ఫిల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి భూ సేకరణ కోసం సంగెం గ్రామానికి చెందిన రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేశాభివృద్ధికి రహదారులు చాలా అవసరమని తద్వారా జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో ధరలు వివరాలు చూస్తే 5,531 మిర్చి రూ.11 వేలు, దీపిక మిర్చి రూ.17,500, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే 1048 రకం మిర్చి రూ.11 వేలు, మక్కలు (బిల్టీ) రూ. 2,355, సూక పల్లికాయ రూ.6,500, పచ్చి పల్లికాయకి రూ.4,500 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
విజిబుల్ పోలీసింగ్తో పాటు నేరాల నియంత్రణలో భాగంగా మట్టెవాడ పోలీసులు శుక్రవారం సాయంత్రం ఎంజీఎంలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆస్పత్రి పరిసరాల్లో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను, బ్యాగులను తనిఖీ చేయడంతో పాటు వారి వివరాలను నమోదు చేశారు. ఈ తనిఖీల్లో మట్టెవాడ ఎస్ఐ విఠల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ప్రేమించుకున్న ప్రతి జంట పెళ్లి పీటలెక్కడం చాలా అరుదు. పెద్దలు ఒప్పుకోకపోవడం, ఇతర కారణాలతో విడిపోయినవారినే ఎక్కువగా చూస్తుంటాం. కానీ, వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన వినయ్, నాగలక్ష్మిలు ప్రేమించి ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇంటర్మీడియట్ నుంచి స్నేహితులుగా ఉన్న వీరు.. 2019లో వివాహం చేసుకున్నారు. అంతేకాదు, 2024 డీఎస్సీలో ఇద్దరు ఉపాధ్యాయ కొలువులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు తగ్గాయి.
> క్వింటా తేజ మిర్చి ధర గురువారం రూ.14,000 పలకగా.. నేడు రూ.13,600కి చేరింది.
> 341 మిర్చికి నిన్న రూ.13,500 ధర రాగా.. ఈరోజు రూ.13,600 అయింది.
> వండర్ హాట్(WH) మిర్చికి గురువారం రూ.16వేల ధర రాగా.. ఈరోజు భారీగా రూ. 500 తగ్గి రూ.15,500కి పడిపోయింది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈవారం మొదటి నుంచి పత్తి ధరలు భారీగా పడిపోతున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. బుధవారం రూ.6,950, గురువారం రూ.6,900కి పడిపోయింది. నేడు ఇంకా పతనమై రూ.6820కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే రూ.240 ధర తగ్గడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో ది బెస్ట్ లవ్ కపుల్ ఎవరంటే కొండా మురళి, సురేఖ దంపతులని ఎవరిని అడిగినా చెప్పేస్తారు. 1980లో వరంగల్ LB కళాశాలలో చిగురించిన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్తా పెళ్లి వరకు వెళ్లింది. 1987లోనే సురేఖను తిరుపతి తీసుకెళ్లి మురళి పెళ్లి చేసుకున్నారట. వీరి ప్రేమపై ‘కొండా’ మూవీ సైతం వచ్చిన విషయం తెలిసిందే. మీకు తెలిసిన ఓ లవ్ స్టోరీని కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.