India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిన్నతనం నుంచి పోరాటాలు చేస్తూనే పెరిగానని మంత్రి సీతక్క అన్నారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సీతక్క మాట్లాడుతూ.. తాను ఎన్నో సమస్యలను అధిగమించి నేడు ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. ఆదివాసి బిడ్డగా తాను ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, పేదరికంలో ఉన్న ప్రజల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటానని సీతక్క అన్నారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు అవినీతి రహిత పాలనను అందిస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. చిల్పూరు మండలంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ఎమ్మెల్యే ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
కాలేజీల్లో విద్యార్థులు ర్యాగింగ్ లాంటి విష సంస్కృతికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. నూతనంగా విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ కళాశాలల్లో ర్యాగింగ్ భూతాన్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ర్యాగింగ్కు గురవుతున్న విద్యార్థులు తక్షణమే డయల్ 100కు చేయాలని సూచించారు.
కర్ణాటక ప్రభుత్వ షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ సీనియర్ స్థాయి అధికారులతో జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ సమావేశం నిర్వహించారు. హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
కాజీపేటలో రూ.521.36 కోట్లతో అభివృద్ధి చేస్తున్న పీరియాడికల్ ఓవర్ హాలింగ్(పీవోహెచ్) యూనిట్కు గత మార్చి వరకు రూ. 190.88 కోట్లు ఖర్చు చేశామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మరో రూ.150 కోట్లు కేటాయించామని తెలిపారు. బుధవారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి) అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు తేజ మిర్చి మినహా ఇతర మిర్చి ధరలు భారీగా తగ్గాయి. తేజ మిర్చి క్వింటాకు బుధవారం రూ.17,500 పలకగా.. నేడు రూ.18 వేలకు చేరింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.15 వేల ధర రాగా.. నేడు రూ.14 వేలకు పడిపోయింది. మరో వైపు నిన్న రూ.15,500 ధర పలికిన వండర్ హాట్(WH) మిర్చి.. నేడు రూ.14,500కి తగ్గింది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా BHPL జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి సమీపంలోని వెంకటేశ్వర స్వామివారి జాతరను ఘనంగా నిర్వహిస్తుంటారు. శైవత్వం, వైష్ణవత్వం కలిసి ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. కొండ కింద భాగంలో శివుని గుడి, కొండ పైభాగంలోని గుహలో వెంకటేశ్వరసామి కొలువై ఉండటంతో భక్తులు జాతరను రెండో తిరుపతిగా అభివర్ణిస్తుంటారు. ఏటా భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకొని పాండవుల గుట్టను తిలకిస్తుంటారు.
పచ్చ కామెర్లతో తల్లీబిడ్డ మృతి చెందిన ఘటన నర్సంపేట మండలం లక్నెపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. తూర్పతి కావేరి(23)కి 8 నెలలు నిండాయి. ఆమెకు వారం కిందట జ్వరంతో పచ్చ కామెర్లు వచ్చాయి. స్థానికంగా చికిత్స చేయించినప్పటికి తగ్గలేదు. పరిస్థితి విషమంగా ఉండటంతో HYDలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం డెలివరీ చేయగా.. మగ శిశువు పుట్టిన కొద్దిసేపటికే మృతి చెందాడు. బుధవారం కావేరి మృతి చెందింది.
తెలంగాణ ఫుడ్ కమిషన్ వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా కమిషన్ సభ్యులు ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రెండ్రోజులుగా జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పర్యటన చివరి రోజు జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాలను, వసతి గృహాలను, రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. తనిఖీ అనంతరం బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సత్య శారద దేవితో కలిసి సమావేశం నిర్వహించారు.
> MHBD: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
> HNK: ఎస్బిఐ ఎటిఎంలో చోరీకి యత్నం
> WGL: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం
> HNK: పేకాట కేంద్రంపై పోలీసుల దాడి
> WGL: అట్రాసిటీ కేసులో మహిళకు రిమాండ్
> MHBD: నిషేధిత ఉత్పత్తులపై పోలీసుల తనిఖీలు
Sorry, no posts matched your criteria.