Warangal

News August 7, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

> MLG: కార్పొరేట్ కంపెనీలు గ్రామాలకు తరలిరావాలి: సీతక్క
> HNK: కలెక్టర్ కార్యాలయంలో 2వ ఆర్థిక సంఘ సమావేశం
> WGL: జిల్లా వ్యాప్తంగా చేనేత దినోత్సవ వేడుకలు
> MHBD: ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం.. అలుగులు దుంకుతున్న చెరువులు
> WGL: మార్కెట్లో పెరిగిన మిర్చి ధర, తగ్గిన పత్తి ధర
> MLG: జిల్లాలో మరో అద్భుతమైన జలపాతం
> JN: ఈ కోనేరులో స్నానం చేస్తే పాపాలు తొలుగుతాయి!

News August 7, 2024

తాడ్వాయి: ‘గ్రామపంచాయతీ సిబ్బందిని కాపలాగా పెట్టాలి’

image

తాడ్వాయి మండలంలో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. దీంతో మండలంలోని నార్లాపూర్-పడిగాపూర్ గ్రామాల మధ్య ఉన్న జంపన్నవాగు భారీగా ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన ములుగు డీఎంహెచ్‌వో అప్పయ్య జంపన్న వాగును పరిశీలించారు. జంపన్నవాగు వద్ద గ్రామపంచాయతీ సిబ్బందిని కాపలా పెట్టాలని గ్రామపంచాయతీ కార్యదర్శి ధర్మేందర్‌ను ఆదేశించారు.

News August 7, 2024

నెక్కొండలో ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ రైలు హాల్టింగ్

image

వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్లో గుంటూరు-సికింద్రాబాద్ మధ్య నడిచే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు హాల్టింగ్‌కు రైల్వే అధికారులు ఆమోదించారు. గత కొన్నాళ్లుగా నెక్కొండలో పలు రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్ కొనసాగుతోంది. ఇందులో ఇంటర్సిటీ రైలు హాల్టింగ్ డిమాండ్ ఉంది. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి రాను, పోను హాల్టింగ్ ఇచ్చారు.

News August 7, 2024

కార్పొరేట్ కంపెనీలు గ్రామాలకు తరలి రావాలి: మంత్రి సీతక్క

image

కార్పొరేట్ కంపెనీలు గ్రామాలకు తరలి రావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాదులోని ప్రజా భవన్‌లో ఐటీ దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్వాల్కమ్, బోష్, గ్రాన్యుల్స్ ఇండియా, టీసీఎస్, ఉషా, నిర్మాన్, తదితర కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఒక్కో కార్పొరేట్ కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరారు.

News August 7, 2024

రామప్ప హుండీ ఆదాయం రూ.3.95లక్షలు

image

ప్రపంచ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ హుండీ లెక్కించినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు అనిల్ తెలిపారు. ఆలయ ఆదాయం రూ.3,95,140లు వచ్చినట్లు పేర్కొన్నారు. రూ.3,76,535ల నోట్లు, రూ.18,605ల నాణాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ శ్రీనివాస్, అర్ఐ రమేశ్, అర్చకులు హరీశ్ శర్మ, ఉమా శంకర్, ఏఎస్సై కిష్టయ్య, పురావస్తు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

News August 7, 2024

వరంగల్ మార్కెట్ చిరు ధాన్యాల ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌‌‌లో బుధవారం వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా సూక పల్లికాయ రూ.6,590, పచ్చి పల్లికాయకు రూ.4,750 ధర వచ్చింది. పసుపు క్వింటా రూ.13,859 ధర, 5531 రకం మిర్చి రూ.11,500 ధర పలికిందని వ్యాపారులు తెలిపారు. మరోవైపు మక్కలు క్వింటాకి రూ. రూ.2,715 పలికాయి. అయితే నిన్నటితో పోలిస్తే నేడు అన్ని రకాల సరకుల ధరలు పెరిగాయి.

News August 7, 2024

త్వరలో నర్సంపేటకు సీఎం రేవంత్ రెడ్డి!

image

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఈ నెలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు తెలిసింది. నర్సంపేటకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలకు NMC నుంచి అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల మూడో వారంలో కాలేజీని CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఉమ్మడి WGL జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో CM పర్యటనపై చర్చించారు.

News August 7, 2024

వరంగల్ మార్కెట్‌లో పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు మంగళవారం రూ.18,500 పలకగా.. నేడు రూ.17,500కి తగ్గింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.14 వేలు పలకగా.. నేడు రూ.15 వేలకు చేరింది. నిన్న రూ.14,800 ధర పలికిన వండర్ హాట్(WH) మిర్చి.. నేడు రూ.15,500కి పెరిగింది.

News August 7, 2024

వరంగల్ మార్కెట్‌లో పత్తి ధర ఎంతంటే..?

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర తటస్థంగా ఉంది. మంగళవారం లాగే ఈరోజు క్వింటా పత్తి ధర రూ. 7,100 పలికింది. సోమవారం రూ.7,160 పలికిన పత్తి.. నిన్న, ఈ రోజు రూ. 7100కి పడిపోయింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు నాణ్యమైన, తేమ లేని సరుకులు మార్కెట్‌కు తీసుకువచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.

News August 7, 2024

సార్వత్రిక ‘పది’, ఇంటర్‌లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

image

సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి శంకర్‌రావు విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రవేశ రుసుం వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలని చెప్పారు. పూర్తి వివరాలకు 8008403631, 9396337572 నంబర్లను సంప్రదించాలన్నారు.