India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మారు వేషంలో వచ్చిన బంగారు లేడిని శ్రీరాముడు పట్టుకునే సమయంలో శ్రీ రామచంద్రస్వామి ఆలయం ఉద్భవించిందని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం జీడికల్ గ్రామంలో ఉంది. గుడి సమీపంలో ఉన్న కోనేరులో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఏటా శ్రీరామనవమి, కార్తీక మాసంలో ఇక్కడ జాతర జరుగుతుంది. దీనిని రెండో భద్రాద్రి అని పిలుస్తారు. ఈ ఆలయం పేరిట గుంటూరులో 11 ఎకరాల భూమి ఉండటం విశేషం.
హరిత నిధి పురోగతి అంశంపై నేడు సచివాలయంలో అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. హరితనిధి నిధులతో వరంగల్, ములుగు డీఎఫ్ఓల అధికార పరిధిలో వరంగల్ నగరం నుంచి మేడారం వరకు మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్, మీడియన్ ప్లాంటేషన్ను చేపట్టేందుకు స్టేట్ లెవల్ కమిటీ ఆమోదం తెలిపింది. హరితనిధి ద్వారా చేపట్టిన ప్రాజెక్టుల వివరాలతో కూడిన సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
> JN: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
> MHBD: విష జ్వరంతో కాంగ్రెస్ నాయకుడు మృతి
> WGL: బైకును ఢీ కొట్టిన లారీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
> MHBD: బ్రెయిన్ డెడ్ అయి వ్యక్తి మృతి
> JN: రైలు ఢీకొని వ్యక్తి మృతి
> HNK: మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు
> JN: వీధి కుక్కల దాడిలో గొర్రెలు మృత్యువాత
> MLG: జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క > HNK: కొత్తకొండ ఆలయాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ > WGL: భారీ ధర పలుకుతున్న మక్కలు> MHBD: జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు > HNK: ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం > JN: సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు సత్యనారాయణరావు, రాజేశ్వర్ రెడ్డి > BHPL: జిల్లా వ్యాప్తంగా 2వ రోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం
KU డిగ్రీ (థియరీ) 6వ సెమిస్టర్లో ఒక సబ్జెక్టు ఫెయిలైన విద్యార్థులకు ఆగస్టు 17న పరీక్ష నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.తిరుమల దేవి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫీజు నోటిఫికేషన్ను నేడు విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ లోపు సంబంధిత కళాశాలలో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.
పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రహర్షిత్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సన్మార్గంలో ప్రయాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.
ఢిల్లీలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను మాజీ మంత్రి దయాకర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కేటీఆర్కు ఎర్రబెల్లి వివరించి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కాసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధర భారీగా పలుకుతూ రైతన్నలకు సంతోషం కలిగిస్తున్నాయి. గత నెల మొదటివారంలో రూ.2,780 రికార్డు ధర పలికిన క్వింటా మొక్కజొన్న(మక్కలు) స్వల్పంగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. గత వారం రూ.2,680 పలికిన మక్కల ధర.. నేడు(మంగళవారం) రూ.2,715 కి పెరిగిందని అధికారులు తెలిపారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర మళ్లీ తగ్గింది. సోమవారం పత్తి ధర క్వింటాకు రూ.7,160 పలకగా.. నేడు రూ.7,100కి పడిపోయింది. పత్తి ధరలు రోజురోజుకు భారీగా తగ్గుతుండటంతో అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్ను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు తెలుపుతున్నారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన హన్మకొండలోని చారిత్రాత్మకమైన స్వయంభు సిద్ధేశ్వర ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆర్చకులు ఈరోజు ప్రత్యేక అలంకరణ చేశారు. క్రోదినామ సంవత్సరం, శ్రావణమాసం, మొదటి మంగళవారం సందర్భంగా మల్లెపూలు, నిమ్మకాయలు, నెమలి ఈకలతో అలంకరణ చేశారు. చుట్టుపక్కల ప్రజలు, భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.