Warangal

News February 3, 2025

నెక్కొండ: మద్యం మత్తులో పోలీసులపై యువకుల దాడి

image

నెక్కొండ మండల కేంద్రంలో గొడవ జరుగుతుండగా అడ్డుకోబోయిన పోలీసులపై యువకులు దాడి చేశారు. మండల కేంద్రానికి చెందిన యువకులకు, ఆటో డ్రైవర్‌కు మధ్య ఆదివారం గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎంక్వయిరీ చేస్తుండగా ఇద్దరు యువకులు పోలీసులపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం నిందితులను స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 3, 2025

WGL: నేటి నుంచే నామినేషన్లు.. 27న పోలింగ్!

image

NLG – KMM – WGL టీచర్ MLC స్థానానికి అభ్యర్థుల నుంచి సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు. NLG కలెక్టరేట్‌లో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేయనున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 27న ఉ. 8 నుంచి సా. 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఆర్జాలబావి వద్ద ఉన్నవేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News February 2, 2025

బీసీలు అంతా ఒక్క తాటిపైకి రావాలి: MLC సారయ్య

image

బీసీలు అంతా ఒక్కతాటి పైకి వచ్చి, బీసీ రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం జరుగుతున్న ‘బీసీ రాజకీయ యుద్ధభేరి’ సభలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీసీలు హాజరయ్యారు.

News February 2, 2025

ఇంటర్ ప్రయోగ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రయోగ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయినట్లు డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యే ప్రయోగ పరీక్షల వివరాలు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 36 జనరల్ పరీక్షా కేంద్రాలు, 7 ఒకేషనల్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

News February 2, 2025

నెక్కొండ: పారా అథ్లెటిక్స్‌లో దేవాకు బంగారు పతకాలు

image

నెక్కొండ మండలంలోని బొల్లికొండ గ్రామానికి చెందిన నునావత్ దేవా రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీల్లో అత్యంత ప్రతిభ చూపి రెండు బంగారు పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 17 -20వ తేదీ వరకు తమిళనాడులోని చెన్నైలో జరగబోయే 23వ నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ క్రీడా పోటీలకు దేవా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పారా అథ్లెటిక్స్ అధ్యక్షుడు శేఖర్ అభినందించారు.

News February 2, 2025

మహబూబాబాద్: మహిళపై లైంగిక దాడి.. వ్యక్తి అరెస్ట్

image

లైంగిక దాడి కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తొర్రూరు సీఐ, ఎస్ఐ తెలిపారు. వారి వివరాల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం తొర్రూరుకి వలస వచ్చారు. ఈక్రమంలో నెల్లికుదురు మండలం హనుమాన్‌నగర్‌తండాకు చెందిన దేశిలావ్ JAN 29న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మరో బాలికపై లైంగిక దాడికి యత్నించిన కాంస్యతండా వాసి బానోత్‌ అజయ్‌పై పొక్సో కేసు నమోదవ్వడంతో అరెస్ట్ చేశారు.

News February 2, 2025

రాత్రి కాజీపేట్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు

image

నేరాల నియంత్రణతో పాటు నేరస్థులను గుర్తించడం కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కాజీపేట పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాత్రి రైల్వే స్టేషన్‌లో తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులతో పాటు బ్యాగులను తనిఖీ చేశారు.

News February 2, 2025

జీవవైవిధ్య పరిరక్షణలో చిత్తడినేలల పాత్ర అద్వితీయం: మంత్రి సురేఖ

image

జీవ వైవిధ్య పరిరక్షణలో చిత్తడి నేలల పాత్ర అద్వితీయమైనదని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఫిబ్రవరి 2న చిత్తడినేలల (వెట్ ల్యాండ్స్) పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి తన భావాలను పంచుకున్నారు. చిత్తడి నేలలు జీవ వైవిధ్యానికి ఆలవాలంగా ఉన్నాయన్నారు. కాలుష్య తీవ్రత కారణంగా పర్యావరణ అసమతుల్యతతో తలెత్తే దుష్ప్రభావాలను అరికట్టడంలో, నీటినాణ్యతను పెంచడంలో చిత్తడి నేలలు వడపోత వ్యవస్థగా పనిచేస్తాయన్నారు.

News February 2, 2025

వరంగల్: టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష: కలెక్టర్

image

నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాగంగా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో పొలిటికల్ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.సత్య శారద శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న వెలువడనున్నందున ఎన్నికల నిర్వహణకు పొలిటికల్ పార్టీల నాయకులు సహకరించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు జరుగుతుందన్నారు.

News February 1, 2025

వరంగల్: రైల్వే స్టేషన్లో కుప్పకూలిన వృద్ధుడు

image

వరంగల్ రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా ఓ వృద్ధుడు కుప్పకూలాడు. వరంగల్ రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకునేందుకు వచ్చిన మంద నరసయ్య (74 ) రైల్వే బుకింగ్ కౌంటర్ వద్ద అనారోగ్యం కారణంగా కుప్పకులాడు. వెంటనే స్టేషన్ మాస్టర్ 108కి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి చూసి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని శవపంచనామా అనంతరం కొడుకు ప్రకాశ్ అప్పగించినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు.

error: Content is protected !!