Warangal

News August 6, 2024

WGL: ‘పాటమ్మ రాంబాబు’ పై కేసు నమోదు

image

‘పాటమ్మ తోటి ప్రాణం’ పాట ఫేమ్ రాంబాబుపై కొమరారం పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. ఎస్సై సోమేశ్వర్ వివరాల ప్రకారం.. మర్రిగూడెంకి చెందిన లతను, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సమీపంలోని అమ్మపురం గ్రామానికి చెందిన రాంబాబు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలంగా రాంబాబు, అతని తల్లిదండ్రులు లతను కట్నం కోసం వేధిస్తూ ఉండడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News August 6, 2024

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్!

image

తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ HNK జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామానికి చెందినవారు. ఆగస్టు 6వ తేదీ 1934లో జన్మించి, 21 జూన్ 2011లో మరణించారు. గతంలో కేయూ వైస్ ఛాన్సలర్‌గా విధులు నిర్వర్తించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ధ్యేయంగా ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కీలకపాత్ర పోషించారు. జయశంకర్ సార్ పేరిట భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

News August 6, 2024

HNK: ఈనెల 7న దివ్యాంగులకు ప్రత్యేక వైద్య శిబిరం

image

హనుమకొండ జిల్లా సమగ్ర శిక్ష అలింకో సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 7న జిల్లాలోని దివ్యాంగులకు వైద్య పరీక్షల కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసినట్లు డీఈవో అబ్దుల్ హై తెలిపారు. హనుమకొండలోని ప్రభుత్వ ఉపాధ్యాయ కళాశాలలో ఉదయం 9 గంటలకు శిబిరం ప్రారంభం అవుతోందని చెప్పారు. ఆధార్ కార్డు, ఆదాయ, సదరం ధ్రువపత్రం, రెండు పాస్ ఫొటోలు, యుడిఐడి కార్డుతో రావాలన్నారు. 40% వైకల్యం ఉన్నవారు అర్హులన్నారు.

News August 6, 2024

జనగామ: గుట్టపై దేవాలయం.. ఒక్క నిద్ర చేస్తే ఆయురారోగ్యాలు

image

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామపరిధిలోని వానకొండయ్య గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారి ఆలయం ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రతి ఏటా హోలీ రోజు ప్రారంభమై ఉగాది వరకు ఇక్కడ జాతర జరుగుతుంది. దీన్ని వానకొండయ్య జాతర అని కూడా అంటారు. అయితే ఇక్కడ దైవాన్ని దర్శించిన అనంతరం ఒక రాత్రి సేద తీరితే ఆయురారోగ్యాలతో ఉంటామని స్థానికులు భావిస్తుంటారు. వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు.

News August 6, 2024

WGL: బాలికపై అత్యాచారం.. పదేళ్ల జైలు

image

బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఒకరికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు జడ్జి నారాయణబాబు తీర్పు వెలువరించినట్లు SI శ్రవణ్ కుమార్ తెలిపారు. 2019లో చిట్యాల పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన ఈసంపెల్లి భాస్కర్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

News August 6, 2024

వరంగల్: వన మహోత్సవానికి రూ.11.69 కోట్లు

image

వరంగల్ ఉమ్మడి జిల్లాకు వక్రోత్సవం-వన మహోత్సవం కార్యక్రమం కోసం రూ.11.69 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్, హనుమకొండ జిల్లాలకు రూ.5.60 కోట్లు, ములుగుకు రూ.6 కోట్లు మంజూరు చేశామన్నారు. సోమవారం సాయంత్రం హనుమకొండ ఆర్అండ్ బీ అతిథి గృహంలో నగరాభివృద్ధి, సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

News August 6, 2024

ములుగు: తునికి ఆకు సేకరణ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

image

స్వచ్ఛందనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం ములుగు జిల్లా తాడ్వాయి అడవి డివిజన్ కార్యాలయంలో మండలాల్లోని 141 గ్రామాలకు చెందిన బ్లాక్ ఫారెస్ట్ తునికి ఆకు సేకరణ లబ్ధిదారులకు మంత్రి సీతక్క చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అటవీశాఖ అధికారులు పోలీసులు తదితర నాయకులు పాల్గొన్నారు.

News August 5, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి టాప్ న్యూస్..

image

> MLG: జిల్లాలో స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క> WGL: రీజనల్ కంటి ఆసుపత్రిని సందర్శించిన మంత్రి కొండా సురేఖ > JN: హాట్ సీటుగా కొమురవెల్లి ఆలయ చైర్మన్ పదవి> HNK: కాళోజీ కళా క్షేత్ర పనులను పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ> MHBD: కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన MLA లు కడియం శ్రీహరి, మురళినాయక్ > HNK: ఆలయ అభివృద్ధిపై కేంద్ర ప్రత్యేక ఫోకస్ పెట్టాలి: ఎంపీ కావ్య

News August 5, 2024

ఉమ్మడి జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> MHBD: సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించిన పోలీసులు
> WGL: స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
> MHBD: జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం
> HNK: ఇటుకాలపల్లిలో పోలీసుల కార్డన్ సేర్చ్
> WGL: రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య
> MLG: డ్రగ్స్ కి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు: ఎస్సై
> BHPL: లైంగిక వేధింపులకు గురికాకుండా ఆడపిల్లలకు అవగాహన సదస్సు

News August 5, 2024

హన్మకొండ: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలి: కలెక్టర్ ప్రావీణ్య

image

పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించడం వల్ల ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్‌ ఐనవోలు మండలం పంథిని లో స్వచ్చందనం – పచ్చందనం కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామాలలో పరిశుభ్రత, పచ్చందనం పెంపొందించేందుకు 5 రోజులు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిందన్నారు.