India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాగంగా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో పొలిటికల్ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.సత్య శారద శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న వెలువడనున్నందున ఎన్నికల నిర్వహణకు పొలిటికల్ పార్టీల నాయకులు సహకరించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు జరుగుతుందన్నారు.
వరంగల్ రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా ఓ వృద్ధుడు కుప్పకూలాడు. వరంగల్ రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకునేందుకు వచ్చిన మంద నరసయ్య (74 ) రైల్వే బుకింగ్ కౌంటర్ వద్ద అనారోగ్యం కారణంగా కుప్పకులాడు. వెంటనే స్టేషన్ మాస్టర్ 108కి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి చూసి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని శవపంచనామా అనంతరం కొడుకు ప్రకాశ్ అప్పగించినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్ ద్వారా జనవరిలో వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న 161 చిన్నారులకు విముక్తి కలిగించామని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ఝా తెలిపారు. వీరిలో 137 మంది బాలలు, 24 మంది బాలికలు ఉన్నారన్నారు. తనిఖీల్లో గుర్తించిన చిన్నారులను బాలల సంరక్షణ గృహానికి తరలించామని సీపీ తెలిపారు.
వరంగల్ జిల్లాలో ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. జిల్లాలోని 13 మండలాల పరిధిలో 2304 మంది ఓటర్లు ఉన్నారని, 13 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అకౌంటింగ్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్, వీఎస్టీ మొదలగు బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించినట్లు స్థానిక నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మల్లం నవీన్, కోఆర్డినేటర్ డాక్టర్ వి పూర్ణచందర్ శనివారం తెలిపారు. 1, 3, 5 సెమిస్టర్ల పరీక్ష ఫీజు ఫిబ్రవరి 4 పొడిగించామన్నారు. ఐదో సెమిస్టర్ పరీక్షలు మార్చి 1 నుంచి 6 వరకు, మూడో సెమిస్టర్ పరీక్షలు 7 నుంచి 13 వరకు ఉంటాయన్నారు.
కరీంనగర్లో జరుగుతున్న మూడో రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల్లో శనివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వరంగల్ పోలీస్ బృందానికి చెందిన మహిళా కానిస్టేబుల్ రజియా బేగం తన ఏడాదిన్నర కొడుకును ఇంట్లో వదిలిపెట్టి ఉండలేక తనతో పాటు క్రీడా మైదానానికి తీసుకొచ్చింది. ఈరోజు ఉదయం తన బాబు సమక్షంలో జరిగిన డిస్కస్ త్రో ఫైనల్స్లో సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో అధికారులు, తోటి క్రీడాకారులు ఆమెను అభినందించారు.
రాష్ట్ర పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీసులు ఆర్చరీలో రికార్డు సృష్టించారు. ఈ క్రీడలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఏకంగా ఐదు పతకాలను సాధించారు. మూడు బంగారు పతకాలతో పాటు ఒక రజతం, ఒక కాంస్యం పతకాన్ని గెలుచుకున్నారు. ఎస్ఐ అనిల్ వేర్వేరు విభాగాల్లో మూడు బంగారు పతకాలు సాధించగా, ఎస్ఐ రాజేందర్, కానిస్టేబుల్ రాహుల్ ఒలింపిక్ విభాగంలో రజతం, కాంస్య పతకాలు సాధించారు.
వరంగల్ జిల్లా శివనగర్కు చెందిన సాయితేజ(26) ప్రేమ పేరుతో ఓ యువతిని(21) మోసం చేశారు. HYD SRనగర్ పోలీసుల ప్రకారం.. సనత్నరగ్కు చెందిన యువతి బేగంపేటలో పనిచేస్తోంది. సాయితేజ ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో సహజీవనం చేశాడు. ఆమె గర్భవతి కావడంతో అబార్షన్ చేయించాడు. చివరికి వేరే అమ్మాయిని చేసుకుంటానని బాధితురాలికి చెప్పి వెళ్లిపోయాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఏడో తరగతి బాలిక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాలో జరిగింది. పోలీసులు ప్రకారం.. గ్రామానికి చెందిన నందిని(12) సంక్రాతి సెలవులకు ఇంటికి వచ్చి పాఠశాలకు వెళ్లకపోవడంతో గురువారం తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక ఇంటి నుంచి బయటికి వెళ్లి శుక్రవారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఎస్ఐలు సారంగపాణి, రవీందర్, రమేశ్, గోవర్ధన్లను వరంగల్ సీపీ అంబర్ అంబర్ కిషోర్ ఝా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. తమ సేవలు నేటి తరం పోలీసులకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. పదవీ విరమణ తర్వాత కూడా తమ గౌరవం తగ్గదని, ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలని వ్యాయామం కొరకు సమయం కేటాయించాలన్నారు.
Sorry, no posts matched your criteria.