Warangal

News August 5, 2024

హన్మకొండ: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలి: కలెక్టర్ ప్రావీణ్య

image

పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించడం వల్ల ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్‌ ఐనవోలు మండలం పంథిని లో స్వచ్చందనం – పచ్చందనం కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామాలలో పరిశుభ్రత, పచ్చందనం పెంపొందించేందుకు 5 రోజులు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిందన్నారు.

News August 5, 2024

జనగాం: క్రీడారంగ బలోపేతానికి కృషి చేయాలి: మాజీ డీప్యూటీ సీఎం

image

జనగాం జిల్లాలో క్రీడారంగ బలోపేతానికి కృషి చేయాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన రఘునాథపల్లి మాజీ ఎంపీపీ కుమార్ గౌడ్‌ను రాజయ్య ఘనంగా సన్మానించారు. జిల్లాలో క్రీడా పోటీలు నిర్వహించి గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను గుర్తించాలని మాజీ డీప్యూటీ సీఎం కోరారు.

News August 5, 2024

తొర్రూర్‌లో స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం

image

ఓ స్కూల్ బస్సుకు ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు.. తొర్రూరులోని ఆర్యభట్ట స్కూల్‌కు చెందిన బస్సు ఈరోజు చెర్లపాలెం, గోపాలగిరి గ్రామాలకు చెందిన విద్యార్థులను ఎక్కించుకొని స్కూలుకు బయలుదేరి వస్తుండగా చీకటాయపాలెం వద్ద చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. అక్కడే ఉన్న ఓ చెట్టును ఢీకొట్టగా, విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా స్కూల్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

News August 5, 2024

WGL: ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలి: ఎంపీ

image

వేయి స్తంభాల ఆలయ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టి అధిక నిధులు మంజూరు చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. మీడియాతో కావ్య మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి కోసం ఎంపీ నిధులు మంజూరు చేస్తానని, కాకతీయుల వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

News August 5, 2024

హాట్‌ సీటుగా కొమురవెల్లి ఆలయ ఛైర్మన్‌ పదవి

image

కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌, డైరెక్టర్ల పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. యాదవ సామాజిక వర్గం ఆరాధ్య దైవమైన కొమురవెల్లి మల్లన్న ఆలయ పాలక మండలి ఛైర్మన్‌ పదవిని అదే సామాజిక వర్గానికి కేటాయించాలని దేవాలయ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య ప్రస్తావించారు. ఛైర్మన్ పదవికి 8 మండలాల నుంచి 22 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

News August 5, 2024

వరంగల్: క్వింటా పత్తి రూ.7,160

image

రెండు రోజుల విరామం అనంతరం ఈరోజు ఉదయం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రారంభం కాగా పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం రైతన్నలకు నిరాశ కలిగించింది. పత్తి క్వింటాకు రూ.7,160 పలికింది. పత్తి ధరలు పెరగకపోవడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. కాగా మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News August 5, 2024

WGL: అయుష్మాన్ కార్డుల్లో.. ఆరోగ్య వివరాలు

image

ప్రతిఒక్కరి ఆరోగ్య వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు జాతీయ వైద్య మండలి అయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అబా) శ్రీకారం చుట్టింది. ఇందులో నమోదైన వారికి వైద్యపరీక్షలు నిర్వహించి అయుష్మాన్ కార్డులు ఇస్తారు. ఆరోగ్య వివరాలు కార్డ్‌లో నమోదు చేస్తారు. ఉమ్మడి జిల్లాలో నమోదైన ఆయుష్మాన్ కార్డుల వివరాలిలా ఉన్నాయి. WGL 9,75,682, HNK 2,90,664, MHBD 1,97,304, JN 1,85,619, BHPL 1,32,783, MLG 25,931.

News August 5, 2024

WGL: నేటితో ముగియనున్న రైతుబీమా గడువు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులతో పాటు ఇప్పటివరకు భీమా చేసుకోని వారికి రైతుభీమా పథకంలో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఈ గడువు ఈరోజుతో ముగియనుంది. అర్హత ఉన్నా ఇప్పటికీ భీమా పథకంలో చేరని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ వ్యవసాయ శాఖ ఏడి దామోదర్ రెడ్డి కోరారు.

News August 5, 2024

WGL: నేటి నుంచి శుభకార్యాలు షురూ

image

మూడంతో 3 నెలలు నిలిచిన శుభకార్యాలు నేటి నుంచి మళ్లీ షురూ కానున్నాయి. నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌లో వివాహాది కార్యక్రమాలు జోరందుకోనున్నాయి. ఈ నెల రోజుల పాటు ఎటుచూసినా సందడి వాతావరణమే నెలకొననుంది. ఇప్పటికే పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న వారు నిశ్చయ తాంబూలాలు మార్చుకొని వివాహానికి సిద్ధమవుతున్నారు. వివాహాలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో కల్యాణ మండపాలు ముస్తాబుకానున్నాయి.

News August 5, 2024

నేడు వరంగల్ మార్కెట్ పున: ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుంది. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచిధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.