India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్లోని మొగిలిచర్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సున్నం శ్వేత సస్పెండ్ అయ్యారు. ప్రజలకు సంబంధించిన డబ్బులను శ్వేత వాడుకున్నారే ఫిర్యాదులు వచ్చినట్లు వరంగల్ సౌత్ సబ్ డివిజన్ సూపరింటెండెంట్ తెలిపారు. ఈ మేరకు సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఆమె వద్ద ఎవరూ డిపాజిట్లు చేయెద్దని సూచించారు.
పురుగు మందు తాగిన ఓ యువకుడిని మిత్రులు కాపాడిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. SI హరీశ్ ప్రకారం.. WGLలోని రామన్నపేటకు చెందిన సాయికృష్ణ ఐదేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది వాజేడు మం.లోని బొగ్గులవాగు సమీపంలో శుక్రవారం రాత్రి పురుగుమందు తాగి స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. స్పందించిన మిత్రులు పోలీసులకు సమాచారమివ్వడంతో యువకుడిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.
దోస్తానా అంటే ఓరుగల్లు వాసులు జాన్ ఇస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు నగరంలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్వెల్ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day
కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఆగస్టు 5న సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా దీనిని ప్రజలు గమనించి సహకరించగలరని విజ్ఞప్తి చేశారు.
> BHPL: భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క
> JN: ఇల్లు బాగుపడాలంటే ఆడపిల్లలు చదువుకోవాలి: ఎమ్మెల్సీ మల్లన్న
> WGL: జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు
> JN: సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి
> MLG: ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారు: సీతక్క
> MHBD: జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ నగర్ సంబరాలు
అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను టాస్క్ఫోర్స్, నర్సంపేట పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డొంకరాయి నుంచి 256 కిలోల గంజాయిని 128 ప్యాకెట్లలో నింపి కారులో తరలిస్తుండగా నర్సంపేటలో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.64 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బాబు, కుమారస్వామి, ఎన్.కుమారస్వామిలను అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నట్లు తెలిసింది. పక్కా సమాచారంతో జాతీయ రహదారి-365పై శుక్రవారం అర్ధరాత్రి టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఒక కారులో సుమారు క్వింటాన్నర గంజాయి గుర్తించినట్లు సమాచారం. పట్టుకున్న గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మూడంతో మూడు నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నాయని అర్చకులు తెలిపారు. శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలకు ఇప్పటికే చాలా మంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది వివాహాలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగుస్తుంది.
ఎంజీఎం ఆసుపత్రికి వచ్చే రోగుల మూత్రపిండాల పని తీరును తెలుసుకోవడానికి చేసే రెనాల్ ఫంక్షన్ (ఆర్ఎఫ్) పరీక్షలను శనివారం నుంచి నిర్వహిస్తామని ఎంజీఎం ఆసుపత్రి ఆర్ఎంవో-3 డాక్టర్ అంబి శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం పని చేయని యంత్రానికి మరమ్మతులు చేయడానికి బదులుగా కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని సెమి ఆటో అనలైజర్ యంత్రాన్ని ఎంజీఎంకు తీసుకువచ్చి రోగులకు పరీక్షలు చేస్తున్నామన్నారు.
మిత్రుడి జన్మదిన వేడుకలకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన అన్నబోయిన శ్రీనివాస్ పెద్ద కుమారుడు సందీప్(23) గురువారం భూపాలపల్లి జిల్లా రేగొండలో తన మిత్రుడి జన్మదిన వేడుకలకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా పరకాల అయ్యప్ప ఆలయ సమీపంలో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సందీప్ తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.