India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. 6 నెలల అనంతరం జిల్లా అధికారుల్లో కదలిక మొదలైంది. ఉమ్మడి జిల్లాలో 1650 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు ఐదుగురి చొప్పున మాస్టర్ ట్రైనర్లుగా ఆపరేటర్ల జాబితా తయారు చేసి పంచాయతీ అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. వీరు శిక్షణ పొందిన అనంతరం పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బందికి ఓటరు జాబితాపై అవగాహన కల్పిస్తారు.
రూ.40 వేలు లంచం తీసుకుంటూ పర్వతగిరి SI వెంకన్న శుక్రవారం ACB అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా
పర్వతగిరిలో అధికారులు లంచం తీసుకుంటూ ACBకి పట్టుబడిన ఘటన ఇది <<13763255>>మూడోది<<>>. గతంలో కల్లెడ ఊర చెరువు కట్టకు గండి పడటంతో మరమ్మతు బిల్లులు చేయడానికి ఓ అధికారి లంచం డిమాండ్ చేయడంతో ACBకి పట్టుబడ్డాడు. అనంతరం కల్లెడలోనే సీసీ రోడ్డు బిల్లుల విషయమై పంచాయతీరాజ్శాఖ AE డబ్బులు డిమాండ్ చేసి ACBకి చిక్కాడు.
హనుమకొండలోని ప్రభుత్వ ఐటీఐల్లో నిర్మిస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాల పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. శుక్రవారం ములుగు రోడ్డులోని రెండు ప్రభుత్వ ఐటీఐలను కలెక్టర్ సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రభుత్వ ఐటీఐలను ఉన్నతీకరించడానికి ఆధునిక వర్క్ షాపులు, కొత్త యంత్రాలు, పరికరాలు ఏర్పాటు చేసేందుకు నిర్మిస్తున్న భవనాలను పరిశీలించారు.
> WGL: ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం > WGL: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పర్వతగిరి ఎస్సై > MHBD: భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి వీఆర్ఏ హల్చల్ > WGL: మార్కెట్లో తగ్గిన పత్తి ధర, పెరిగిన WH మిర్చి ధర > JN: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు > HNK: కేయూలో ఘనంగా తీజ్ ఉత్సవాలు > JN: మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి: ఎమ్మెల్యే పల్లా
> BHPL: గోపాలపురం గ్రామంలో వ్యక్తి మృతి
> WGL: ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరికి తీవ్ర గాయాలు
> JN: స్కూల్ బస్ కింద పడి విద్యార్థి మృతి
> WGL: అన్న గొంతు కోసిన తమ్ముడు
> JN: గుండెపోటుతో పురోహితుడు మృతి
> MHBD: విద్యుత్ షాక్ తో మహిళా మృతి
> BHPL: గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
> MLG: విద్యార్థులకు అస్వస్థత.
స్కూల్ బస్సు కింద పడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. జనగామ మండలం అడవి కేశవాపూర్కు చెందిన విద్యార్థి బానోతు వరుణ్ స్కూల్ బస్సుకు బ్యాగ్ తట్టుకొని వెనుక టైర్ కింద పడిపోయాడు. దీంతో బస్సు టైరు విద్యార్థి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థి బంధువులు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.
TGNPDCL హనుమకొండ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఈలు, డీఈలు, నోడల్ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. ట్రాన్స్ఫార్మర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అంతరాయాలు, బ్రేక్ డౌన్స్, ట్రిప్పింగ్స్ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
పాలకుర్తి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి లేగ రామ్మోహన్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి రిజర్వాయర్కు రీటెండర్ వేసి రూ.370 కోట్ల నుంచి రూ. 470 కోట్లకు పెంచారని ఆరోపించారు. 30 కి.మీ మేర కెనాల్ కాలువలను తవ్వించారని ఎమ్మెల్యే అసత్య ప్రచారం చేసుకుంటున్నారన్నారు. బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. భూ వివాదంలో ఘర్షణ ఏర్పడి అన్న గొంతును తమ్ముడు బ్లేడుతో కోశాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. రంగశాయిపేటలోని గవిచర్ల క్రాస్ రోడ్డు వద్ద భూ వివాదంలో అన్న రాజుపై తమ్ముడు రాజేశ్ బ్లేడుతో దాడి చేశాడు. ఈ క్రమంలో రాజు గొంతుకు తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం అతడిని ఎంజీఎం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యుత్తును అవసరం ఉన్నంత వరకు వాడుకొని, అనవసరంగా వాడకుండా ఉండటమే విద్యుత్తును ఉత్పత్తి చేసినంత విలువని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం ప్రభుత్వ మర్కాజి ఉన్నత పాఠశాలలో హిటాచి ఎనర్జీ కంపెనీ వారు సామాజిక బాధ్యతలో భాగంగా ఏర్పాటు చేసిన సోలార్ పవర్ సిస్టంను ప్రారంభించి, కలెక్టర్ మాట్లాడారు.
Sorry, no posts matched your criteria.