India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యుత్తును అవసరం ఉన్నంత వరకు వాడుకొని, అనవసరంగా వాడకుండా ఉండటమే విద్యుత్తును ఉత్పత్తి చేసినంత విలువని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం ప్రభుత్వ మర్కాజి ఉన్నత పాఠశాలలో హిటాచి ఎనర్జీ కంపెనీ వారు సామాజిక బాధ్యతలో భాగంగా ఏర్పాటు చేసిన సోలార్ పవర్ సిస్టంను ప్రారంభించి, కలెక్టర్ మాట్లాడారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు.
రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా SI వెంకన్నను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్సై గుగులోతు వెంకన్నపై అన్నారం పెద్ద తండా బెల్లం వ్యాపారుల ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రైడ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గత మూడు రోజులుగా పత్తి ధరలు అమాంతం పడిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రూ.7,130 పలికిన క్వింటా పత్తి ధర.. నిన్న రూ.7,080కి చేరింది. నేడు మరింత పతనమై రూ.7,030కి పడిపోయింది. రోజురోజుకు పత్తి ధరలు తగ్గిపోవడం రైతులకు తీవ్ర నిరాశ కలిగించే విషయం.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తేజ మిర్చి నిన్నటితో పోలిస్తే ఈరోజు తగ్గింది. నిన్న క్వింటాకు రూ.18,500 పలకగా.. ఈరోజు రూ.18,000 పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.15 వేలు ధర రాగా.. నేడు రూ.15,500 వచ్చింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చి ధర పెరిగింది. నిన్న రూ.13,500 ధర పలకగా.. నేడు రూ.15,000కి చేరింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గంజాయి విక్రయాలు యథేచ్చగా సాగుతున్నాయి. అయితే ఆంధ్ర-ఒడిశాలో దొరికే శీలావతి పేరు కలిగిన గంజాయికి డిమాండ్ ఎక్కువ. అక్రమార్కులు దీన్ని చాకచక్యంగా సరిహద్దులు దాటిస్తున్నారు. ఒడిశా నుంచి APలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా భద్రాద్రి కొత్తగూడెం దాటుకుని తీసుకువస్తున్నట్లు సమాచారం. MHBD, WGLకు ఒడిశా నుంచి వచ్చే రైలులో తీసుకువస్తుండగా ఈ ఏడాది పోలీసులు 3సార్లు పట్టుకున్నారు.
ఉమ్మడి WGL వ్యాప్తంగా <<13756149>>డెంగ్యూ<<>>తో పాటు.. వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. రెండ్రోజుల క్రితం చెన్నారావుపేట మండలంలోని ఓ బాలుడు డెంగ్యూతో మృతి చెందగా.. గురువారం నిండు గర్భిణితో పాటు ఆమె కడుపులోని కవల పిల్లలూ మృతి చెందారు. దీంతో జిల్లాలో జ్వరం బారిన పడినవారు MGM బాట పడుతున్నారు. గత వారం రోజులుగా చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజులో దాదాపు 50-55 మందికి డెంగ్యూ నిర్ధారణవుతోందని వైద్యులు చెబుతున్నారు.
హన్మకొండ జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి సారంగపాణి తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 3న అండర్ 14, 16, 18, 20 బాల బాలికలు, మహిళ, పురుషులకు జావెలిన్ త్రో, 100 మీటర్ల పరుగు ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న జిల్లా అథ్లెట్లు శనివారం ఉదయం 10 గంటలకు JNS స్టేడియంలో హాజరు కావాలని కోరారు.
వరంగల్ మహానగర పాలకసంస్థ పాలకవర్గంలో అధికార కాంగ్రెస్ బలం పెరిగింది. గురువారం తూర్పు నియోజకవర్గానికి చెందిన BRS కార్పొరేటర్లు పల్లం పద్మ, సోమిశెట్టి ప్రవీణ్, జోగి సువర్ణ హస్తం గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య 7 నుంచి 39కి పెరిగింది. BRS బలం 39 నుంచి 17కు తగ్గింది. BJP 10 నుంచి 11కు పెరిగింది. కాగా, తూర్పులో BRS కార్పొరేటర్ల చేరికలపై కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్తో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ నేడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఉన్నతాధికారులతో పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ బాలసముద్రంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కాళోజీ కళాక్షేత్ర నిర్మాణ పనులను కలెక్టర్ ప్రావీణ్య వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డితో కలిసి పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.