India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
> WGL: అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం, పటిక స్వాధీనం
> NSPT: ఆర్టీసీ బస్సు ఢీకొని గేదె మృతి
> HNK: ఇంటర్ విద్యార్థిని మృతి.. తల్లి ఆవేదన
> WGL: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
> JN: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
> HNK: మత్తు పదార్థాల వినియోగం పట్ల కలిగే అనర్ధాలపై అవగాహన సదస్సు
> MLG: విద్యుత్ షాక్తో దుక్కిటెద్దు మృతి
> HNK: విషాదం.. డెంగ్యూతో నిండు గర్భిణీ మృతి
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడుగురు సబ్ ఇన్స్పెక్టర్లను సీపీ అంబర్ కిషోర్ ఝా గురువారం బదిలీ చేశారు. కొత్తగా పోస్టింగ్ల వివరాలు ఇలా ఉన్నాయి. లింగాల గణపురం-శ్రావణ్ కుమార్, ఇంతేజార్ గంజ్-రాజు, జఫర్ గడ్-బానోతు రాంచరణ్, వేలేరు-సురేష్, సుబేదారి-హరిత, చిల్పూర్-నవీన్ కుమార్, కేయూసీకి రాజేందర్ బదిలీ అయ్యారు.
డెంగ్యూ జ్వరంతో నిండు గర్భిణి మృతి చెందిన ఘటన HNK జిల్లా శాయంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. గట్లకానిపర్తికి చెందిన శిరీష 9 నెలల గర్భవతి. శిరీషకు డెంగ్యూ జ్వరం రావడంతో 3 రోజుల క్రితం HNKలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఆమె కడుపులో ఉన్న కవల శిశువులను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం వృథా అయింది. తల్లి, బిడ్డలు మృతి చెందారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు రైతన్నలను కంట నీరు తెప్పిస్తున్నాయి. ధరలు ఏ రోజు పెరుగుతున్నాయో, ఏరోజు తగ్గుతున్నాయో తెలియక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. మంగళవారం రూ.7,060 పలికిన క్వింటా పత్తి ధర.. నిన్న రూ.7,130కి పెరిగింది. ఈరోజు మళ్లీ తగ్గి రూ.7,080 కి పడిపోయింది. దీంతో రైతులు నిరాశ చెందుతున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి నిన్న క్వింటాకు రూ.18,200 పలకగా.. నేడు రూ.18,500 పలికింది. అలాగే 341 రకం మిర్చి నిన్నటి లాగే నేడు రూ.15 వేలు పలికింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చి ధర తగ్గింది. నిన్న రూ.14 వేల ధర వచ్చిన మిర్చి నేడు రూ.13,500కి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు.
హనుమకొండ జిల్లాలో విషాదం జరిగింది. ఓ ఇంటర్ కాలేజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. ములుగు జిల్లా మంగపేటకు చెందిన భవానీ హనుమకొండలోని వైబ్రంట్ అకాడమీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బుధవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. విద్యార్థిని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి పోలీసులు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
డీఈఈ సెట్ లో అర్హత సాధించిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు 2024 -26 విద్యా సంవత్సరంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరేందుకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని డైట్ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ వాసంతి ప్రకటనలో తెలిపారు. హనుమకొండ లష్కర్ బజార్లోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో గురువారం నుంచి ఆగస్టు 6 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో బుధవారం భూ క్రయవిక్రయదారులు పోటెత్తడంతో రికార్డులు బ్రేక్ అయ్యాయి. మంగళవారం 265 దస్తావేజుల రిజిస్ట్రేషన్లు రాత్రి 9 గంటల వరకు పూర్తి కాగా.. ఖజానాకు రూ.2.10 కోట్ల ఆదాయాన్ని సబ్ రిజిస్ట్రార్ అమ్జద్ అందజేశారు. అదే విధంగా బుధవారం రాత్రి 8.30 గంటల వరకు 272 దస్తావేజుల రిజిస్ట్రేషన్లను పూర్తి చేయడంతో ఖజానాకు దాదాపు రూ.2.30 కోట్ల ఆదాయం సమకూరింంది.
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఆగస్ట్ 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు హన్మకొండ జిల్లా సంక్షేమ అధికారిణి కె.మధురిమ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. అమృతం కన్నా విలువైంది అమ్మ పాలని, చంటి బిడ్డకు ఆరోగ్యంతో పాటు పోషణ అందించాలన్నారు. ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలని “అంతరాలను తొలగించి తల్లిపాల ప్రాముఖ్యతను చాటుదాం” అనే నినాదంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
> WGL: ఆటో, బైక్ ఢీ.. విద్యార్థులకు గాయాలు
> JN: రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
> WGL: ఇంట్లో దూరిన కొండచిలువ
> MHBD: సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాలు
> MLG: గుడుంబా స్థావరాలపై దాడులు.. ముగ్గురిపై కేసు
> WGL: శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్న వ్యక్తిపై రౌడీషీట్
> JN: పెట్రోల్ బంకులో చోరీ ఇద్దరు అరెస్ట్
Sorry, no posts matched your criteria.