India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
> WGL: ఆటో, బైక్ ఢీ.. విద్యార్థులకు గాయాలు
> JN: రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
> WGL: ఇంట్లో దూరిన కొండచిలువ
> MHBD: సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాలు
> MLG: గుడుంబా స్థావరాలపై దాడులు.. ముగ్గురిపై కేసు
> WGL: శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్న వ్యక్తిపై రౌడీషీట్
> JN: పెట్రోల్ బంకులో చోరీ ఇద్దరు అరెస్ట్
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో బుధవారం కొండచిలువ కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. తురకల సోమారం గ్రామంలోని ఓ ఇంట్లో కొండ చిలువ దూరింది. అనంతరం బోనులో ఉన్న నాటుకోళ్లపై దాడి చేసి చంపేసింది. ఒక్కసారిగా గ్రామంలో కొండ చిలువ ప్రత్యక్షమవడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు పల్లికాయ, పసుపు తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటా సూక పల్లికాయ రూ.6,050 ధర పలకగా.. పచ్చి పల్లికాయకు రూ.4,400 ధర వచ్చింది. అలాగే 5531 రకం రూ.12వేలు, మిర్చికి పసుపు క్వింటా రూ.13,669 ధర పలికిందని వ్యాపారస్తులు తెలిపారు.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండెలగూడెం వాసి బాబు, కళ్యాణి దంపతులకు కొద్దిరోజుల క్రితం బాబు జన్మించాడు. పుట్టుకతోనే శ్వాసకోశ నాళం, ఆహార నాళం అతుక్కుపోయింది. గుండెలో రంధ్రం పడింది. ఒకే కిడ్నీతో బాధపడుతున్నాడు. HYD బోడుప్పల్లోని అంకుర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఆపరేషన్కు రూ.7 లక్షలు కావాలని పేద కుటుంబానికి చెందిన ఆ తల్లిదండ్రులు వాపోతున్నారు. KTR, దాతలు ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే తేజ మిర్చి ధర భారీగా పెరిగింది. నిన్న క్వింటాకు రూ.17,300 పలికిన తేజ మిర్చి నేడు రూ.18,200 పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.15,500 రాగా నేడు రూ.15 వేలకు తగ్గింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి మంగళవారం రూ.15,500 ధర రాగా నేడు రూ. 14 వేల ధర వచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండల పరిధిలోని పాకాల సరస్సు నీటిమట్టం బుధవారం ఉదయం నాటికి 26.5 అడుగులకు చేరుకుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పాకాల సరస్సులోకి వచ్చి చేరుతోంది. కాగా పాకాల పూర్తి స్థాయి నీటిమట్టం 30.3 అడుగులుగా ఉంది. ఇలాగే వరద నీరు సరస్సులోకి వస్తే కొన్ని రోజుల్లోనే అలుగు పడుతుందని రైతులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర మోస్తారుగా పెరిగింది. నిన్న రూ.7,060 పలికిన క్వింటా పత్తి ధర.. నేడు రూ.7,130కి పెరిగింది. దీంతో రైతన్నలకు కొంత ఊరట లభించినట్లు అయింది. ధరలు మరింత పెరగాలని, ఇందుకు అధికారులు, వ్యాపారులు సహకరించాలని రైతులు కోరుతున్నారు.
MHBD జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. డోర్నకల్ పీఎస్ పరిధిలో 2021 అక్టోబర్ 10న బానోత్ కిరణ్, బాదావత్ సూర్య 300 కిలోల గంజాయిని ట్రాక్టర్ ట్రాలీ కింది భాగంలో పెట్టి తరలిస్తూ పోలీసులకు పట్టుబడటంతో కేసు నమోదైంది. దీంతో నిందితులను మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టగా జిల్లా కోర్టు జడ్జి చంద్రశేఖర ప్రసాద్ నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, ఒక్కొక్కరికి రూ.2 లక్షల జరిమానా విధించారు.
ఎంజీఎం ఆసుపత్రిలో చాలా కాలంగా పని చేస్తున్న స్టాఫ్ నర్సులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆసుపత్రిలో మొత్తం 478 మంది స్టాఫ్ నర్స్లు పని చేస్తున్నారు. అందులో నాలుగేళ్లకు పైగా ఇక్కడే ఉంటున్న వారితో పాటు మూడేళ్లు పూర్తయి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న 230 మంది కౌన్సెలింగ్కు హాజరయ్యారు. ఉత్తర్వులు అందుకున్న వారు తక్షణమే విధుల్లో చేరాలని పేర్కొన్నారు.
> WGL: ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం
> HNK: బైకును ఢీకొన్న లారీ.. యువకుడు మృతి
> MLG: పుష్కర ఘాటులో కొట్టుకొచ్చిన మృతదేహం
> JN: జిల్లాలో పోలీసుల కార్డన్ సెర్చ్
> WGL: ఇంట్లోకి చొరబడి దొంగల హల్చల్
> WGL: సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం
> MHBD: డోర్నకల్ మండలంలో కొండచిలువ ప్రత్యక్షం
Sorry, no posts matched your criteria.