Warangal

News July 30, 2024

MHBD: డయల్ 100 కాల్స్ పట్ల తక్షణమే స్పందించాలి: ఎస్పీ

image

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకాన్ ఆదేశాల మేరకు జిల్లాలోని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ సిబ్బందితో డీఎస్పీ తిరుపతి రావు నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. బాధితులు 100కు కాల్ చేయగానే, సమాచారం వచ్చిన వెంటనే బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ సిబ్బంది తక్షణమే స్పందించి ఘటన స్థలానికి చేరుకొని బాధితులకు ధైర్యం అందించాలని సూచించారు.

News July 30, 2024

హనుమకొండ: బైక్‌ను ఢీకొన్న లారీ.. యువకుడు మృతి

image

హనుమకొండ జిల్లా మామునూర్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నుండి మిర్చి లోడుతో ఖమ్మం వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వర్ధన్నపేట మండలం సింగారం గ్రామానికి చెందిన అఖిల్ (20)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 30, 2024

WGL: మావోయిస్టు లేఖ కలకలం

image

ములుగు జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు (JMWP) డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ పేరుతో మావోయిస్టు లేక కలకలం సృష్టిస్తోంది. ఏటూరు నాగారం- మహాదేవపూర్ దళంలోని జైసింగ్, రమేశ్, సుక్కి అనే ముగ్గురిని చర్లలో పోలీసులు పట్టుకున్నారని లేఖలో పేర్కొన్నారు. వారిని చిత్రహింసలు పెట్టి, ఎన్కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వారికి ఏం జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.

News July 30, 2024

వరంగల్: ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం

image

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుడి కార్యాలయం ముందు గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరికాయలను వేశారు. మరో తరగతి గదిలో సైతం కనిపించాయి. దీంతో వరుస సెలవుల అనంతంరం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు వీటిని చూసి భయాందోళనకు గురయ్యారు. కాగా, ఈ పని ఎవరు చేశారనేది తెలియరాలేదు.

News July 30, 2024

పోలీస్ కమిషనర్ పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఖాతా!

image

వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచారు. ఫ్రెండ్స్ రిక్వెస్టు పంపిస్తున్నారు. దీన్ని ఎవరూ అనుమతించవద్దని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయం నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నకిలీ ఫేస్‌బుక్ ఐడీలు సృష్టించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News July 30, 2024

వరంగల్ జిల్లాలో విష జ్వరాలు

image

ఉమ్మడి WGL జిల్లాలో విష జ్వరాలు పెరుగుతున్నాయి. పెద్దలు, పిల్లలతో కలిసి మొత్తం 1,300 పడకల వార్డులున్న MGMకు జిల్లాతో పాటు.. పొరుగు జిల్లాలు, AP, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి రోగులు వస్తున్నారు. ప్రతిరోజు 50కి పైగా రోగులు ఆస్పత్రిలో చేరుతున్నారు. జులై నెలలలో ఇప్పటి వరకు PHCలలో 41,152 ఓపీ రోగులు రాగా.. 1,856జ్వరాలు, 29వాంతులు, విరేచనాలు, 6డెంగీ, 2మలేరియా కేసులు నమోదైనట్లు వైధ్యాధికారులు తెలిపారు.

News July 30, 2024

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డోర్నకల్ ఎమ్మెల్యే

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డోర్నకల్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే వివరించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పర్ణికరెడ్డి, యశస్వినిరెడ్డి పాల్గొన్నారు.

News July 29, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

> MLG: కౌశిక్ రెడ్డిపై మంత్రి సీతక్క ఫైర్
> MHBD: పార్లమెంటులో ప్రసంగించిన ఎంపీ బలరాం నాయక్
> MLG: జల కళను సంతరించుకున్న లక్నవరం సరస్సు
> WGL: తండ్రిని పోలీసులు వేధించారని టవర్ ఎక్కిన కొడుకు
> MLG: చత్తీస్ ఘడ్-తెలంగాణా రాకపోకలు ప్రారంభం
> HNK: అనుమతి లేని జల పాతాళ వద్దకు వెళ్తే చర్యలు
> WGL: అసెంబ్లీలో ప్రసంగించిన పశ్చిమ, వర్ధన్నపేట, డోర్నకల్ ఎమ్మెల్యేలు

News July 29, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> JN: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
> BHPL: గంజాయి అమ్ముతున్న ముగ్గురి అరెస్టు
> MLG: కారును వెనుక నుంచి ఢీ కొట్టిన మరో వాహనం
> HNK: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఇల్లు ధ్వంసం
> MHBD: అతి వేగంతో పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
> WGL: బాలుడి మృతి.. కుటుంబీకుల ధర్నా
> WGL: కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి సూసైడ్

News July 29, 2024

ములుగు: జలపాతాల వద్దకు వెళితే కఠిన చర్యలు

image

ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల, గుండం జలపాతాలతో పాటు ఇతర జలపాతాలకు అధికారికంగా ఎలాంటి అనుమతి లేదని ఫారెస్ట్ రేంజర్ చంద్రమౌళి తెలిపారు. అనుమతి లేకుండా దొంగచాటుగా స్థానిక గ్రామస్థుల సహాయంతో పర్యాటకులు సందర్శనకు వెళుతున్నారన్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని, అలా చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదాలు జరిగి, ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.