Warangal

News January 28, 2025

శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

భద్రకాళి దేవస్థానంలో నేడు మంగళవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ అర్చకులు తదితరులున్నారు.

News January 28, 2025

అర్ధనారీశ్వరుని అలంకరణలో రుద్రేశ్వరస్వామి

image

చారిత్రాత్మకమైన వేయి స్తంభాల దేవాలయంలో నేడు సోమవారం మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ రుద్రేశ్వరస్వామి వారికి అభిషేకం నిర్వహించి అర్ధనారీశ్వరునిగా ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అర్ధనారీశ్వరుని రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మణికంఠ శర్మ తదితరులున్నారు.

News January 28, 2025

పదోన్నతి అర్హత పరీక్షను పరిశీలించిన సీపీ

image

హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐగా పదోన్నతికి మడికొండ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏర్పాటుచేసిన అర్హత పరీక్షను వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం పరిశీలించారు. భద్రాద్రి, కాళేశ్వరం జోన్ల పరిధిలో వివిధ పోలీస్ స్టేషనల్లో విధులు నిర్వహిస్తున్న 108 సివిల్ హెడ్ కానిస్టేబుల్లకు అందజేసే ASI పదోన్నతికి సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో అర్హత పరీక్షలు ఏర్పాటు చేశారు. సిపి అంబర్ కిషోర్ ఝా పరీక్షలను పరిశీలించారు.

News January 27, 2025

వరంగల్ రోడ్డులో కారు, ఆటో ఢీ.. ఇద్దరికి గాయాలు

image

ఖమ్మం, వరంగల్ రోడ్డులోని బెటాలియన్ హెచ్‌పీ పెట్రోల్ పంపు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి బొల్లికుంటకు వెళ్తున్న కారు నల్లబెల్లి నుంచి వరంగల్ వెళ్తున్న ఆటోను ఢీకొంది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను 108లో ఎంజీఎంకు తరలించారు. ఘటనా స్థలానికి చెరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 27, 2025

గీసుగొండ: నీటి సంపులో పడి ఆరేళ్ల బాలుడు మృతి

image

గీసుగొండ మండలంలోని శాయంపేట హవేలీ గ్రామంలో బాలుడు నీటి సంపులోపడి మృతి చెందాడు. CI మహేందర్ కథనం ప్రకారం.. బెల్లంపల్లికి చెందిన శుభశ్రీ తన కుమారుడు శివాదిత్య(6)తో కలిసి శాయంపేటలోని తల్లిగారింట్లో నివాసం ఉంటుంది. ఆదివారం శుభశ్రీ స్నానానికి వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి కుమారుడు కనిపించకపోవడంతో గాలించింది. కాగా ఇంటి పక్కన ఉన్న నీటి సంపులో చనిపోయి కనిపించడంతో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.

News January 26, 2025

రోడ్డు ప్రమాదంపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు

image

వరంగల్ జిల్లా మామునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి హరీష్ రావు ‘X’ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు.

News January 26, 2025

ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్‌లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి అమ్మవారు ఆదివారం సందర్భంగా ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు..

News January 26, 2025

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి కొండా

image

WGLలోని కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి ఆయా శాఖలు అధికారులను ఫోన్లలో సంప్రదించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. సులువుగా పరిష్కరించాల్సిన సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను మందలించారు. మరోసారి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

News January 26, 2025

WGL: స్వచ్ఛ సర్వేక్షన్ అవగాహన కార్యక్రమం

image

వరంగల్ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో శనివారం స్వచ్ఛ సర్వేక్షన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కమ్యూనిటీ ఆర్గనైజర్లు జవాన్‌లతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే పాల్గొన్నారు. స్వచ్ఛ టూల్కిట్ ను సమర్థవంతంగా నిర్వహించుటకు వారు తగు సూచనలు చేశారు.

News January 25, 2025

మరియపురం: పథకానికి అనర్హుడినని ముందుకొచ్చిన వ్యక్తికి సన్మానం

image

గీసుగొండ మండలం మరియపురం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో అర్హుల జాబితాను చదవగా అందులో పేరు వచ్చిన గొలమారి జ్యోజిరెడ్డి అనే వ్యక్తి ఆ పథకానికి తాను అనర్హుడనని, ఆ పథకం తనకు వద్దని ముందుకు రాగా మండల ప్రత్యేక అధికారి డి.సురేష్, తహశీల్దార్ ఎండీ రియాజుద్దీన్ అతడిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.