India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మేడారం చిన్న జాతర ఈనెల 12 నుంచి 15 వరకు జరగనుంది. ఈ సందర్భంగా గురువారం సమ్మక్క-సారలమ్మ ఆలయాల్లో ఎండోమెంట్ అధికారులు హుండీలను ఏర్పాటు చేశారు. సమ్మక్క గద్దెపై 14 హుండీలు, సారలమ్మ గద్దెపై 14 హుండీలు, పగిడిద్దరాజు గద్దెపై 2 హుండీలు, గోవిందరాజుల గద్దెపై 2 హుండీలు మొత్తం 32 హుండీలను ఏర్పాటు చేశారు. ఈవో రాజేంద్రం, సూపరింటెండెంట్ క్రాంతి, పరకాల డివిజన్ ఇన్స్పెక్టర్ కవిత, అర్చకులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన శ్రీనాథ్ సినీ రంగంలో తొలి అడుగు వేశారు. సినీ రంగంపై మక్కువ పెంచుకున్న శ్రీనాథ్.. తల్లిదండ్రుల ఆశీస్సులతో, కఠోర శ్రమతో నేడు అసోసియేట్ డైరెక్టర్గా ఎదిగారు. శుక్రవారం విడుదలయ్యే నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్ చిత్రంలో తన ప్రతిభ పరిచయం చేయనున్నారు.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని ఆ గ్రామాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. రాబోయేది పంచాయతీ ఎన్నికలా..? లేక మున్సిపల్ ఎన్నికలో తెలియక ప్రజలు ఎదురు చూస్తున్నారు. నెక్కొండను మున్సిపాలిటీగా చేసేందుకు గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేశారు. నెక్కొండతో పాటు నెక్కొండ తండా, టీకే తండా, గుండ్రపల్లి, అమీన్పేటల్లో గ్రామ సభలను సైతం నిర్వహించారు. కానీ ఇంత వరకు స్పష్టత లేకపోవడంతో ప్రజలు, అధికారులు అయోమయంలో పడ్డారు.
ఎస్టీపీ ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని వరంగల్ & హనుమకొండ కలెక్టర్లు సత్య శారద, ప్రావీణ్య అన్నారు. కుడా కార్యాలయంలోని సమావేశ మందిరంలో బల్దియా ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మురుగు నీటి నిర్వహణ వ్యవస్థ ఎస్టీపీల ఏర్పాటు కోసం స్థలాలు గుర్తింపుపై అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. 2055 సంవత్సరానికి గాను 21.31 లక్షల జనాభాకు అవసరమయ్యే డ్రైనేజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించారు.
తడి పొడి చెత్తను వేరుగా అందించడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అభిప్రాయపడ్డారు. మున్సిపల్ గెస్ట్ హౌస్లో నిర్వహిస్తున్న సిగ్రిగేషన్ కంపోస్ట్ యూనిట్లను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర వ్యాప్తంగా సమగ్ర శానిటేషన్ విధానాలను అవలంభించడానికి ప్రయోగాత్మకంగా 6, 49వ డివిజన్లను ఎంపిక చేసి, కంపోస్టు యూనిట్లు చేర్చడం ద్వారా ఎరువుగా మార్చడం చేయాలన్నారు.
రైలు నుంచి జారి పడి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. పరకాలకు చెందిన అరవింద్ అనే యువకుడు శాతవాహన ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడ్డాడు. దీంతో అరవింద్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. పరకాల మండలం పైడిపల్లికి చెందిన మొగిలి(60) ఈ నెల 1న తన భార్యతో కలిసి మిర్చి తోటకు బయలుదేరాడు. మార్గమధ్యలో బయటకు వెళ్తున్న అని తిరిగి రాలేదు. మొగిలి ఆచూకీ కోసం వెతుకుతుండగా పొలం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. అతడి భార్య తన భర్త అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు అన్నదాతలను అయోమయానికి గురి చేస్తున్నాయి. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయి, బుధవారం రూ.6,980కి చేరింది. అలాగే నేడు మళ్లీ రూ.6970కి తగ్గినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్ను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.
నేరాలను నియంత్రణకు రాత్రి సమయాల్లో పోలీసులు ముమ్మరంగా పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. ప్రధానంగా అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్తో అనుమానిత వ్యక్తులు, వాహనాలు తనిఖీ చేయాలని సూచించారు. తద్వారా ప్రజలకు పోలీసులపై నమ్మకం, నేరస్థులకు భయం కలుగుతుందని పేర్కొన్నారు.
మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే 30 రైళ్లను ఈ నెల 10 నుంచి 20 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇంకొన్నింటిని సికింద్రాబాద్- నడికుడి మార్గంలో నడిపించనున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే వారాంతపు రైళ్లను కూడా రద్దు చేయగా మరికొన్ని రైళ్లు నిర్ణీత తేదీల్లోనే నడుస్తాయని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.