India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి బెంగతో ఆత్మహత్యకు పాల్పడింది. మిల్స్కాలని సీఐ మల్లయ్య తెలిపిన వివరాలు.. వరంగల్ జిల్లా కేంద్రంలోని చింతల్కు చెందిన గీతారాణి(38) కుమారుడు డిప్లొమాలో ఫెయిల్ అయి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆమె మనోవేదనకు గురై ఆదివారం ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. ఆమె తండ్రి సదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ అధ్యయన కేంద్రంలో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు tsscstudycircle.in లో చూడాలన్నారు.
జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశం లభిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తానికి మాముమూరులో ఉన్న ఈ ఏకైక పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 6వ తరగతిలో ప్రవేశాలకు 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం కేటాయిస్తారు. 6వ తరగతిలో ప్రవేశం లభిస్తే.. 12వ తరగతి వరకు వారి చదువు ఇక్కడ కొనసాగనుంది.
> MLG: మంటలు చెలరేగి పేలిన గ్యాస్ సిలిండర్..> MHBD: అనారోగ్యంతో శతాధిక వృద్ధురాలు మృతి..> WGL: యువకుడిపై బీరు సీసాలతో దాడి..> JN: రైలు కిందపడి యువకుడు మృతి..> HNK: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్..> JN: చికిత్స పొందుతూ మహిళా మృతి..> HNK: గంజాయి సేవిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్..
ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వర్ధన్నపేటలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎర్రబెల్లి పాల్గొన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను గ్రామాల్లో పార్టీ శ్రేణులు వివరించాలని, స్థానిక సంస్థలు ఎన్నికల్లో కష్టపడ్డ కార్యకర్తలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు.
బోనాల వేడుకల సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలోని ఆర్యబాద్ ఆలయంలో మైసమ్మ తల్లిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఎమ్మెల్సీ మల్లన్న బంగారు బోనం ఎత్తుకొని అక్కడ కాసేపు సందడి చేశారు. బోనాల పండుగ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని మల్లన్న చెప్పారు.
వాజేడు మండలంలోని బొగత జలపాతం సందర్శన నేడు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా స్థానిక ఎస్సై హరీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక దుస్తులతో పోలీసులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్యాటకులు నిబంధనలు పాటించాలని, క్షేమంగా తమ ఇళ్లకు చేరుకోవాలని ఎస్ఐ కోరారు. నిబంధనలు అతిక్రమించి జలపాతంలోకి దిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఆదివారం నేషనల్ గైడ్స్ సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆలయంలోని రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని రామప్ప చారిత్రక విషయాలను, శిల్పకళా నైపుణ్యాన్ని గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం నంది విగ్రహం వద్ద ఫొటో తీయించుకున్నారు.
వానాకాలంలో చింతచిగురు లభిస్తోంది. దీంట్లో పొషకాలు అధికంగా ఉండటంతో జనాలు దీన్ని తినేందుకు ఆసక్తి కనబరుస్తారు. నగరంలో చింతచిగురు తక్కువ దొరకడంతో ఆదివారం మట్టెవాడ, మండిబజార్ తదితర ప్రాంతంలో రూ.500 రేటు పలుకుతోంది. ఎలాంటి రసాయనాలు లేకపోవడం, ప్రకృతి సిద్ధంగా లభించడంతో దీనికి ఇంతలా డిమాండ్ ఉంది.
భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటల వరకు 450.0 MM వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.. పలు మండలాల వివరాలు చూస్తే
మహదేవపూర్ 35.6, పలిమెల 12.4, మహాముత్తారం 75. 2, కాటారం87.2, మల్హర్ 41.0, చిట్యాల 38.4, టేకుమట్ల 33.6, మొగుళ్లపల్లి 35. 2, రేగొండ:25. 2, ఘనపూర్ 22.4 భూపాలపల్లి 43.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.
Sorry, no posts matched your criteria.