Warangal

News July 28, 2024

వరంగల్: భార్యకు భారమవుతున్నానని ఆత్మహత్య

image

శనివారం<<13717360>> రైలుకిందపడి<<>> ఒకరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన సంబంధించిన పూర్తి వివరాలిలా.. నల్లబెల్లికి చెందిన వడ్లూరి సత్యం (43) ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేసేవారు. ఓ ప్రమాదంలో తలకు గాయమైనప్పటి నుంచి మానసిక సమస్యలతో బాధపడుతూ.. ఇంట్లోనే ఉంటున్నాడు. భార్య రాణి స్థానిక పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో భార్యకు భారమవుతున్నాననే బాధతో.. శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 28, 2024

వరంగల్: బోడ కాకరకాయకు భలే డిమాండ్

image

బోడ కాకర కు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఏడాదిలో కేవలం నెల నెలన్నర రోజులు మాత్రమే ఇది మార్కెట్‌కు వస్తోంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వీటిని సీజన్‌లో కనీసం ఒక్కసారైనా తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అన్ని మార్కెట్లలో బోడ కాకర విక్రయానికి వస్తుంది. కిలో రూ.380 నుంచి రూ.400 వరకు విక్రయించారు. రసాయనాలు లేకుండా పండే ఈ బోడ కాకర ధర కోడి మాంసం కన్నా ఎక్కువ ఉన్నా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

News July 27, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

image

> WGL: రైల్వే ట్రాక్‌పై పడుకుని యువకుడు మృతి
> MLG: కుక్కల దాడి.. పశువుల కాపరికి గాయాలు
> WGL: కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
> WGL: విద్యుత్ షాకుతో రైతు మృతి
> MHBD: అనారోగ్యంతో బీఆర్ఎస్ నేత మృతి
> MHBD: వ్యవసాయ బావిలో పడి కార్యదర్శి మృతి
> WGL: హైవేపై బోల్తా పడిన సిమెంట్ లారీ
> MHBD: వివాహిత అదృశ్యం.. కేసు నమోదు

News July 27, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

> BHPL: మోరంచపల్లి, కొండాయి విషాదానికి ఏడాది
> MLG: తగ్గుముఖం పట్టిన గోదావరి
> WGL: ఎంజీఎం ఆస్పత్రిలో ఫ్లెక్సీ కలకలం
> WGL: కారులో కూరగాయల విక్రయం
> MLG: గోదావరి ఉద్ధృతి.. రాకపోకలు బంద్
> HNK: రైతు మద్దతు ధర చట్టాలను తీసుకురావాలి: సీతక్క
> WGL: బడ్జెట్ సమావేశాలకు హాజరైన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు

News July 27, 2024

ఆదివాసి దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటించండి: మంత్రి సీతక్క

image

ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు మంత్రి సీతక్క నేడు ట్వీట్ చేశారు. అనంతరం ఆదివాసీలకు సంబంధించిన పలు సమస్యలను సీఎంకు మంత్రి, ఎమ్మెల్యేలు వివరించారు. ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, వెంకటరావు, జాడి ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

News July 27, 2024

ఎంజీఎం ఆస్పత్రిలో ఫ్లెక్సీ కలకలం

image

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ఓ పరిపాలన అధికారి బదిలీ అయి వెళ్లినందుకు పీడపోయిందంటూ తెల్లవారుజామున ఎంజీఎం గేట్‌కు ఫ్లెక్సీలు కట్టారు. ఆ పరిపాలన అధికారి ఎవరు? ఎవరికోసం పెట్టారు? అనేది ఇప్పుడు ఎంజీఎం ఆస్పత్రిలో పెద్ద చర్చనీయాంశమైంది. ఇంతకీ ఎవరు కట్టారనేది కూడా తెలియాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం ఎంజీఎంలో ఏం జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.

News July 27, 2024

వరంగల్: కారులో కూరగాయల విక్రయం!

image

ప్రజలు మార్కెట్‌కు వెళ్లకుండా కొందరు వ్యాపారులు ఇంటి వద్దకే తోపుడు బండ్లు, బుట్టల్లో కూరగాయలను తీసుకువచ్చి అమ్ముతుంటారు. కానీ, ఓ వ్యాపారి కారులోనే కూరగాయలు విక్రయిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. హన్మకొండ నగరంలోని ఎక్సైజ్ కాలనీలో కారులో వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలను తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. వెనుక డిక్కీలో వేయింగ్ మిషన్‌ను ఏర్పాటు చేశాడు. దీన్ని చూసిన పలువురు ఆలోచన బాగుందని కితాబిస్తున్నారు.

News July 27, 2024

వరంగల్: కారులో కూరగాయల విక్రయం!

image

ప్రజలు మార్కెట్‌కు వెళ్లకుండా కొందరు వ్యాపారులు ఇంటి వద్దకే తోపుడు బండ్లు, బుట్టల్లో కూరగాయలను తీసుకువచ్చి అమ్ముతుంటారు. కానీ, ఓ వ్యాపారి కారులోనే కూరగాయలు విక్రయిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. హన్మకొండ నగరంలోని ఎక్సైజ్ కాలనీలో కారులో వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలను తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. వెనుక డిక్కీలో వేయింగ్ మిషన్‌ను ఏర్పాటు చేశాడు. దీన్ని చూసిన పలువురు ఆలోచన బాగుందని కితాబిస్తున్నారు.

News July 27, 2024

వరంగల్: రైల్వేట్రాక్‌పై పడుకుని యువకుడి ఆత్మహత్య

image

వరంగల్ రైల్వేస్టేషన్ వద్ద రైల్వే ట్రాక్‌పై పడుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు యువకుడి మీద నుంచి వెళ్లగా, తల, శరీర భాగం ఛిద్రమయ్యాయి. అందరూ చూస్తున్నప్పటికీ ఎవరూ కాపాడడానికి ముందుకు రాలేదు. రైలు అతని మీద నుంచి వెళ్లిన వెంటనే స్థానికంగా ఉన్న వారందరూ కేకలు వేశారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 27, 2024

WGL: రేబిస్ వ్యాధితో మహిళ మృతి

image

రేబిస్ వ్యాధితో ఓ మహిళ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. ఏడ్చెర్ల గ్రామానికి చెందిన పూలమ్మ అనే మహిళపై ఇటీవల ఓ వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. మహబూబాబాద్ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందినా నయం కాకపోవడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.