Warangal

News July 27, 2024

వరంగల్: రైల్వేట్రాక్‌పై పడుకుని యువకుడి ఆత్మహత్య

image

వరంగల్ రైల్వేస్టేషన్ వద్ద రైల్వే ట్రాక్‌పై పడుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు యువకుడి మీద నుంచి వెళ్లగా, తల, శరీర భాగం ఛిద్రమయ్యాయి. అందరూ చూస్తున్నప్పటికీ ఎవరూ కాపాడడానికి ముందుకు రాలేదు. రైలు అతని మీద నుంచి వెళ్లిన వెంటనే స్థానికంగా ఉన్న వారందరూ కేకలు వేశారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 27, 2024

WGL: రేబిస్ వ్యాధితో మహిళ మృతి

image

రేబిస్ వ్యాధితో ఓ మహిళ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. ఏడ్చెర్ల గ్రామానికి చెందిన పూలమ్మ అనే మహిళపై ఇటీవల ఓ వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. మహబూబాబాద్ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందినా నయం కాకపోవడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 27, 2024

WGL: సంపాదనలో మనోళ్లు వెనకబడ్డారు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. ఆరు జిల్లాల్లో తలసరి ఆదాయాన్ని పరిశీలిస్తే వరంగల్ వాసుల ఆదాయం తక్కువగా ఉంది. ఈ విషయంలో హనుమకొండ జిల్లా అట్టడుగునా ఉంది. ఆదాయంలో భూపాలపల్లి, ములుగు కొంత మెరుగ్గా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాలో సగటున నెలకు రూ.22,629 సంపాదిస్తే.. హనుమకొండలో రూ.15,563 మాత్రమే సంపాదిస్తున్నారు.

News July 26, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

image

> MLG: సారలమ్మ పూజారి మృతి
> MHBD: తోడేళ్లగూడెంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
> WGL: శతాధిక వృద్ధురాలు మృతి
> WGL: సూసైడ్ చేసుకున్న ఉపాధ్యాయుడు
> MHBD: సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు
> MHBD: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి
> WGL: రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

News July 26, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

> BHPL: మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన BRS నేతల బృందం
> WGL: గ్యాస్ సిలిండర్లో నీరు!
> BHPL: పలువురు తహసీల్దారుల బదిలీ
> MLG: తల్లిదండ్రులు దూరం.. పట్టుదలతో ఉద్యోగం
> WGL: మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు
> JN: బ్యాంక్ అధికారులకు ఎమ్మెల్యే కడియం వార్నింగ్
> MLG: ఉదృతంగా గోదావరి.. రెండవ హెచ్చరిక జారి
> WGL: ఎన్కౌంటర్‌కు సీఎం బాధ్యత వహించాలి

News July 26, 2024

మంత్రి కొండాను కలిసిన కాంగ్రెస్ నేతలు

image

రేణుక ఎల్లమ్మతల్లి ఆలయ నిర్మాణ టెండర్ అంశంపై రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖను భూపాలపల్లి నియోజకవర్గ నేతలు కలిశారు. అనంతరం నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, తదితరు అంశాలపై మంత్రితో నేతలు చర్చించారు. కాంగ్రెస్ నేత మూల శంకర్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు నారాయణ గౌడ్, కిరణ్ గౌడ్, రఘు గౌడ్ పాల్గొన్నారు.

News July 26, 2024

MHBD: మంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు

image

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని డోర్నకల్, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రామచంద్రనాయక్, నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రాజెక్టులు, చెక్ డ్యాములు, ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన అంశాలపై మంత్రితో ఎమ్మెల్యేలు చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

News July 26, 2024

మాజీ మంత్రి ఎర్రబెల్లి సన్నిహితుడు BRSకు రాజీనామా

image

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అత్యంత సన్నిహితుడు, దళిత రత్న అవార్డు గ్రహీత, రూరల్ డెవలప్‌మెంట్ స్టేట్ డైరెక్టర్ అందె యాకయ్య నేడు BRSకు రాజీనామా చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు వారు తెలిపారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ తన కష్టాన్ని గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకులాలకు మాత్రమే బీఆర్ఎస్ పెద్దపీట వేసిందని ఆరోపించారు.

News July 26, 2024

అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తి చేయాలి: కలెక్టర్ ప్రావీణ్య

image

జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకంలో భాగంగా మొదటి దశలో పాఠశాలలకు మంజూరైన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. మండల ప్రత్యేక అధికారులు మొదటి దశలో ఏవైనా పనులు పెండింగ్‌లో ఉన్నది లేనిది తెలుసుకొని వాటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

News July 26, 2024

వరంగల్: ఆగస్టు 5 నుండి ఈ రైళ్లు రద్దు

image

వరంగల్-కాజీపేట స్టేషన్ల మీదుగా ప్రయాణించే పలు రైళ్లను ఆగస్టు 5 -10వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గోల్కొండ, శాతవాహన రైళ్ళను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా ఐదు రోజులపాటు రద్దు చేసినట్లు చెప్పారు. కావున ప్రయాణికులు విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని కోరారు.