India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండలోని వీరభద్రస్వామి ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం ఈనెల 28వ తేదీన జరుగుతుందని ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 9.00 గంటలకు జరిగే ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆసక్తి ఉన్న వారు పాల్గొనవచ్చన్నారు.
రైతుభరోసా, నూతన రేషన్ కార్డులు విచారణ ప్రక్రియలో జిల్లా, మండలస్థాయి అధికారులు భాగస్వాములైనందున ఈనెల 20న (సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ మేరకు ప్రజావాణి తాత్కాలిక రద్దుపై ఆదివారం ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయి విచారణ, 21వ తేదీ నుంచి జరుగనున్న గ్రామసభల నిర్వహిస్తామన్నారు.
రేగొండ మండలం లింగాల గ్రామం, గోరి కొత్తపల్లి మండలం జగ్గయ్యపేటలో జరుగుతున్న పథకాల సర్వే ప్రక్రియను భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ పకడ్బందీ, పారదర్శకంగా జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు. రైతులు, పథకాల లబ్ధిదారులు ఈ ప్రక్రియ ద్వారా తమకు అందే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఛత్తీస్గఢ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్@ <<15194613>>చొక్కారావు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రస్థానం ముగిసిందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాల్వపల్లికి చెందిన దామోదర్ గోవిందరావుపేట కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో మావోయిస్టు భావాజాలానికి ఆకర్షితుడై అడవిబాట పట్టాడు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
WGL ములుగు రోడ్డు సమీపంలోని ఆరెపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం <<15190249>>ఓ మహిళ మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. కాగా ఇదే ప్రమాదంలో గాయపడిన మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కరీమాబాద్కు చెందిన కనకలక్ష్మి, సాంబలక్ష్మి చీపురు కట్టల వ్యాపారం చేసేవారు. పస్రా నుంచి చీపురు కట్టలు కొనుగోలు చేసి ఆటోలో వస్తుండగా RTC అద్దె బస్సు ఢీకొని మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గ్రేటర్ వరంగల్ పరిధిలో స్మార్ట్ సిటీ పథకం కింద కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ ఎండీ, GWMC కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖడే అధికారులను ఆదేశించారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజినీరింగ్, స్మార్ట్ సిటీ అధికారులతో స్మార్ట్ సిటీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.
మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను ములుగు ఎస్పీ శబరిష్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ అధికారులు, ఆలయ పూజారుల సంఘం ఆధ్వర్యంలో ఆలయ సంప్రదాయ ప్రకారం డోలు వాయిద్యాలతో ఎస్పీ శబరీష్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం సమ్మక్క సారలమ్మలకు, పగిడిద్ద రాజు, గోవిందరాజులకు ఎస్పీ మొక్కులు చెల్లించారు.
ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు మినీ మేడారం జాతర జరగనుంది. ఈ సందర్భంగా మేడారంలోని పార్కింగ్ స్థలాలు, వాహనాల రద్దీకి అనుగుణంగా బందోబస్తు ఏర్పాట్లును ఎస్పీ శబరిష్ పరిశీలించారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దొంగతనాల నివారణకు, ప్రమాదాల నివారణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ శబరిష్ సూచనలు చేశారు.
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు డ్రగ్స్, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలను జాగృతం చేసేందుకు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్రవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. వరంగల్ జిల్లాలో నిర్వహించే డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు 2 రోజులు సెలవులు రానున్నట్లు మార్కెట్ సెక్రటరీ నిర్మల తెలిపారు. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.