Warangal

News February 4, 2025

విద్యార్థులకు షీ టీంపై అవగాహన కల్పించిన పోలీసులు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ షీ టీం పోలీసుల ఆధ్వర్యంలో రంగంపేట్‌లోని ఓ అకాడమీ విద్యార్థులకు షీ టీం పని తీరుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీంను ఎలా సంప్రదించాలి, ఎలా ఫిర్యాదు చేయాలి, అలాగే సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, ఉమెన్ ట్రాఫికింగ్, వేధింపులు, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్, డయల్ 100 మొదలైన అంశాలపై షీ టీం పోలీస్ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.

News February 4, 2025

స్టేషన్ ఘనపూర్: మంటల్లో కాలిన రూ.25 లక్షల నగదు!

image

స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో మల్లయ్య, కృష్ణమూర్తికి చెందిన రూ.25 లక్షల నగదుతో పాటు అప్పు పత్రాలు, బియ్యం బస్తాలు, ఐలయ్యకు చెందిన రూ.5 లక్షల విలువైన టెంటు సామగ్రి మంటల్లో కాలి బూడిద అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

News February 4, 2025

తాడ్వాయి: బస్సులోనే గుండెపోటుతో మృతి

image

బస్సులో ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. నార్లాపూర్ గ్రామానికి చెందిన పల్లపు శంకరమ్మ (56) అనే మహిళ నార్లాపూర్ నుంచి పస్రా వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన కొద్దిసేపటికే గుండెపోటుతో బస్సులోనే మృతి చెందింది. పక్కన కూర్చున్న వారు గమనించి బస్సు కండక్టర్‌కు తెలుపగా బస్సును నిలిపి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

News February 4, 2025

గీసుగొండ సీఐ హెచ్చరిక

image

సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపులలో వివాదాస్పదంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టుకుంటున్న విషయం తమ దృష్టికి రాగా వారిని గీసుగొండ తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు సీఐ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 3, 2025

విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రణాళిక: కలెక్టర్

image

పీఎంశ్రీ పథకం ద్వారా ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీసీ సమావేశ మందిరంలో పీఎం శ్రీ పథకం కింద జిల్లాలో ఎంపికైన 16 ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లతో మంజూరైన నిధులు, చేసిన వివిధ అభివృద్ధి పనులు తదితర అంశాలపై చర్చించారు.

News February 3, 2025

వరంగల్ విద్యార్థికి ప్రపంచ రికార్డులో చోటు

image

వరంగల్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి అభ్యసిస్తున్న ఇమ్మడి అభిరామ్‌కు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. స్కూల్లో సీనియర్ విద్యార్థులకు నిర్వహించిన సాంస్కృతిక దినోత్సవంలో అభిరామ్ మహాభారతంలోని కర్ణుడి వేషాధరణలో 5 నిమిషాల 30 సెకన్ల పాటు అనర్గళంగా ఏకపాత్రాభినయం ప్రదర్శించాడు. ఈ ఏకపాత్రాభినయాన్ని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ నమోదు చేసుకొని సూపర్ టాలెంట్ కిడ్ అవార్డుకు ఎంపిక చేశారు.

News February 3, 2025

ఏటూరునాగారంలో ‘పుష్ప’ నటుడు సందడి

image

ఏటూరునాగారంలో సోమవారం పాన్ ఇండియా పుష్ప సినిమా నటుడు కేశవ (బండారి జగదీశ్ ప్రతాప్) సందడి చేశాడు. తాళ్లగడ్డలోని ఓ బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేశవను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కేశవతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. నటుడు కేశవ సైతం ‘తగ్గేదేలే’ అంటూ స్థానిక ప్రజలను అలరించాడు.

News February 3, 2025

వరంగల్: ప్రజావాణిలో ఆర్జీలను స్వీకరించిన కలెక్టర్

image

వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణిలో ప్రజలు అందజేసిన ఆర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారదాదేవి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

News February 3, 2025

వరంగల్‌: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి

image

గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.

News February 3, 2025

ఆజామ్ జాహి మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ

image

వరంగల్ ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. 2002లో 451 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి మిల్లును మూసివేశారని తెలిపారు.