Warangal

News July 25, 2024

కాలేశ్వరంలో తగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహం

image

భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. నిన్నటి వరకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి, ప్రాణహిత నదులు కొంత శాంతించాయని, పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికి వర్షాలు పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

News July 25, 2024

ఖానాపురం: భార్యకు గుడి కట్టించిన భర్త

image

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన వెంకటనారాయణ భార్య సుజాత గుండెపోటుతో మృతి చెందింది. భార్య మరణాంతరం ఆమె గుర్తుగా పొలం వద్ద వెంకటనారాయణ గుడి కట్టించి భార్య విగ్రహం ఏర్పాటు చేశారు. భార్య జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వెంకటనారాయణను గ్రామస్థులు అభినందిస్తున్నారు.

News July 25, 2024

మూడు రోజులు ఎనుమాముల మార్కెట్ బంద్

image

వరంగల్ నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ మూడు రోజులు బంద్ ఉంటుందని మార్కెట్ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. 27 శనివారం వారంతపు యార్డు, 28 ఆదివారం వారంతపు సెలవు, 29 సోమవారం బోనాల పండుగ సందర్భంగా బంద్ ఉంటుందన్నారు. కావున శనివారం నుంచి సోమవారం వరకు వరసగా(3) రోజులు మార్కెట్ తెరిచి ఉండదన్నారు. తిరిగి ఈనెల 30న మంగళవారం రోజున పునఃప్రారంభం అవుతుందన్నారు.

News July 25, 2024

వరంగల్ మార్కెట్లో తగ్గుతున్న మొక్కజొన్న ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా గత వారం రూ. 2,780 పలికిన మక్కల ధర.. ఈ వారం స్వల్పంగా తగ్గాయి. గత మూడు రోజులు రూ. 2,750 పలికిన మక్కలు, ఈరోజు మరింత తగ్గి రూ.2,715 అయినట్లు రైతులు తెలిపారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News July 25, 2024

WGL: బార్ అండ్ రెస్టారెంట్‌లో ఫుడ్ సెక్యూరిటీ అధికారుల తనిఖీలు

image

నక్కలపల్లిలోని ఓ బార్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన మటన్, చికెన్ ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బార్‌లోని వంటగదికి అనుమతులు లేకుండానే బార్ నిర్వహిస్తున్నారని, సరైన శుభ్రత లేకుండా కస్టమర్లకు ఆహారాన్ని అందిస్తున్న విషయాన్ని ఫుడ్ సెక్యూరిటీ అధికారుల దాడులతో బయటపడ్డాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు బార్ యజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.

News July 25, 2024

వరంగల్: భారీగా తగ్గిన మిర్చి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి బుధవారం క్వింటాకు రూ.17,200 పలకగా.. నేడు రూ.18,000కి పెరిగింది. అలాగే 341 రకం మిర్చి నిన్నటి లాగే నేడు కూడా రూ.13,300 పలికింది. ఐతే వండర్ హాట్ (WH) మిర్చి మాత్రం భారీగా తగ్గింది. నిన్న రూ.16,000 వచ్చిన ధర.. ఈరోజు రూ.13,500కి పతనమైంది.

News July 25, 2024

వరంగల్: దారుణంగా పతనమైన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర భారీగా పతనమైంది. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన పత్తి ఈరోజు భారీగా పడి పోయింది. సోమవారం రూ.7,150 పలికిన క్వింటా పత్తి మంగళవారం రూ.7,180, బుధవారం రూ.7,230 అయింది. ఈ క్రమంలో నేడు దారుణంగా పతనమై రూ.7,025కి చేరింది. దీంతో మార్కెట్‌కు పత్తి తీసుకుని వచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

News July 25, 2024

లింగాలఘనపురం: ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్ వేటు

image

లింగాల ఘనపురం మండలం వనపర్తి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఎస్ఓటీ‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశానుసారం సస్పెండ్ చేస్తూ డీఈఓ రాము బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు మండల నోడల్ అధికారి పడాల విష్ణుమూర్తి తెలిపారు. ఎలాంటి సమాచారం లేకుండా గత నెల 4 నుంచి విధులకు గైర్హాజరు కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

News July 25, 2024

57 మంది పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసిన సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు కౌన్సెలింగ్ పద్ధతిలో ఎంపిక చేసుకున్న పోలీస్ స్టేషన్లకు బుధవారం బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లకు బదిలీ చేసిన వారిలో నలుగురు కానిస్టేబుల్స్, 40మంది హెడ్ కానిస్టేబుల్స్, 13 మంది ఎఎస్సైలు ఉన్నారు.

News July 25, 2024

మొన్న వరంగల్ ఊసే లేదు.. మరి ఇవాళ

image

కేంద్ర బడ్జెట్‌లో బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన వర్సిటీ లాంటి విభజన హామీల ఊసే లేకపోవడంతో ఓరుగల్లుకు నిరాశే ఎదురైంది. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతుండగా ఇందులోనైనా ప్రాధాన్యం దక్కుతుందని జిల్లా ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి, కేయూ అభివృద్ధి, పర్యాటక ప్రాంతాల డెవలప్‌ చేయాల్సి ఉంది. వరంగల్ కాకతీయ మెగా జౌళి పార్కుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఇవ్వాల్సి ఉంది.