Warangal

News January 15, 2025

గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించిన మంత్రి కొండా

image

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా సమర్థవంతంగా కార్యాచరణను అమలు చేయాలని మంత్రి కొండా సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి ఈరోజు ఉదయం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లతో ఢిల్లీ నుంచి గూగుల్ మీట్ ద్వారా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 26 నుంచి అమలు చేయనున్న నూతన పథకాలను నిబద్ధతతో అమలు చేసి, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని మంత్రి సూచించారు.

News January 15, 2025

ఐనవోలు జాతరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన MLA

image

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఐనవోలు పోలీస్ స్టేషన్లో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాటి పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

News January 15, 2025

వరంగల్: పండుగ పూట విషాదం.. గుండెపోటుతో మహిళ మృతి

image

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బుర్హాన్‌పల్లి గ్రామంలో పండుగ రోజు విషాదం నెలకొంది. కుటుంబీకుల వివరాలు.. గ్రామానికి చెందిన మౌనిక(30) గుండె పోటుతో మంగళవారం మృతి చెందింది. ఈ ఆకస్మిక ఘటనతో పండుగవేళ కుటుంబంలో, గ్రామంలో విషాదం నెలకొంది. మౌనిక మృతి పట్ల పలువురు గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు.

News January 15, 2025

విద్యుత్ కాంతులతో కొత్తకొండ వీరన్న ఆలయం

image

ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం విద్యుత్ కాంతులతో సుందర దృశ్యంగా కనిపిస్తోంది. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల జిల్లాలే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తరలివస్తున్నారు.

News January 14, 2025

కొత్తకొండ  వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి, MLA

image

కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.

News January 14, 2025

కొత్తకొండ  వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి, MLA

image

కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.

News January 14, 2025

ఐనవోలు జాతరలో నూతన ఆర్టీసీ బస్సు ప్రారంభం

image

ఐనవోలు జాతరలో కొత్త ఆర్టీసీ బస్సును వరంగల్ ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ కే భానుకిరణ్ ప్రారంభించారు. జాతరలోని తాత్కాలిక బస్ పాయింట్ వద్ద మంగళవారం హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని బస్సును ప్రారంభించారు. మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం కొమురవెల్లి, వరంగల్‌ కు సుమారు 500 ట్రిప్పుల బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.

News January 14, 2025

జనగామ: హత్య కేసులో నిందితుల ARREST

image

హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ASP చేతన్ నితిన్ తెలిపారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనగామలోని ధర్మకంచ వాసి సంపత్, హైదర్, లక్ష్మణ్ స్నేహితులు. వీరికి MHBD వాసి వెంకన్న‌(34)తో ఘర్షణ జరిగింది. ఈ గొడవని మనసులో పెట్టుకుని శనివారం రాత్రి మద్యం తాగించి మత్తులో బండరాయితో మోది, మెడ, తలపై బీర్ బాటిళ్లతో పొడిచి చంపేశారు. కాగా, 24 గంటల్లో నిందితులను పట్టుకున్నట్లు ASP తెలిపారు.

News January 14, 2025

వరంగల్: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో

image

సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 7331149141 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.

News January 13, 2025

భక్తులతో కిక్కిరిసిన కొమురవెల్లి మల్లన్న

image

కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారులు తీరారు. జనవరి 19న పట్నం వారం (మొదటి వారం)తో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఈ తరుణంలో ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగిందని ఆలయ వర్గం వెల్లడించింది. ఈఓ రామాంజనేయులు, ఏఈఓ శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్, ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున, తదితరులు భక్తులకు సేవలందించారు.