Warangal

News July 24, 2024

ఉమ్మడి జిల్లాలోని నేటి క్రైమ్ న్యూస్..

image

* WGL: బాలుడిపై వీధి కుక్కల దాడి..
* MLG: జగన్నాథపురంలో రోడ్డు ప్రమాదం..
* MLG: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి..
* MHBD: ఇద్దరి ప్రాణాలు తీసిన తప్పుడు మార్గం
* WGL: గుండె పోటుతో వ్యక్తి మృతి..
* WGL: గ్రామ పంచాయితీ ట్రాక్టర్ డ్రైవర్ మృతి
* MLG: మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన సదస్సు.

News July 24, 2024

ఉమ్మడి జిల్లాల్లో నేటి టాప్ న్యూస్..

image

> WGL: పార్లమెంటు వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు కావ్య, బలరాంనాయక్ > MLG: తండాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తాం: సీతక్క > HNK: జిల్లా కేంద్రంలో ప్రభాస్ బుజ్జి కారు సందడి > JN: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు > MLG: బొగత జలపాతం సందర్శన బంద్ > BHPL: మొక్కలతోనే భవిష్యత్తు తరాలకు భరోసా: ఎస్పీ > MHBD: రైతు భరోసా నిధులు విడుదల చేయాలి: ఎమ్మెల్సీ

News July 24, 2024

పార్లమెంట్ వద్ద నిరసనలో పాల్గొన్న వరంగల్ ఎంపీ కావ్య

image

కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలు ఈరోజు ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో తోటి ఎంపీలతో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పాల్గొన్నారు. బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని కావ్య మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులతో నిరసన తెలిపారు.

News July 24, 2024

లక్నవరం: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

image

ములుగు జిల్లా కన్నాయిగూడెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు యాట సాంబయ్య(66) లక్నవరం చెరువులో చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. చేపల వేటకు వలలు వేస్తున్న క్రమంలో కాళ్లకు వల చుట్టుకుని ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 24, 2024

లక్నవరం: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

image

ములుగు జిల్లా కన్నాయిగూడెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు యాట సాంబయ్య(66) లక్నవరం చెరువులో చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. చేపల వేటకు వలలు వేస్తున్న క్రమంలో కాళ్లకు వల చుట్టుకుని ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 24, 2024

వరంగల్ మార్కెట్లో తగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు తగ్గాయి. తేజ మిర్చి మంగళవారం క్వింటాకు రూ.17,500 పలకగా.. నేడు రూ.17,200కి పడిపోయింది. 341 రకం మిర్చి నిన్న రూ.14,500 పలకగా.. నేడు రూ.13,300కి పడిపోయింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చి మాత్రం నిన్నటి లాగే రూ.16,000 ధర వచ్చింది.

News July 24, 2024

వరంగల్: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో 3 రోజులుగా పత్తి ధర స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. సోమవారం రూ.7,150 పలికిన క్వింటా పత్తి ధర మంగళవారం రూ.7,180కి చేరింది. నేడు మరికొంత పెరిగి రూ.7,230 అయింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు తేమ లేని, నాణ్యమైన సరుకులు మార్కెట్‌కు తీసుకురావాలని వ్యాపారులు సూచిస్తున్నారు.

News July 24, 2024

బొగత: ఈత సరదా.. యువకుడి మృతి

image

బొగత జలపాతంలో నీట మునిగి మంగళవారం ఒకరు <<13691227>>మృతి చెందిన<<>> విషయం విదితమే. ఎనుమాముల మార్కెట్ సమీపంలోని సుందరయ్యనగర్‌కు చెందిన జశ్వంత్‌(19) స్నేహితులతో కలిసి బొగత సందర్శనకు వెళ్లాడు.స్నేహితులందరూ ఈత కొట్టేందుకు కొలనులో దిగారు. ఈక్రమంలో జశ్వంత్ నీట మునిగాడు.గంటసేపు శ్రమించగా అతడి మృతదేహం రక్షణ సిబ్బందికి దొరికింది. ఒక్కగానొక్క కొడుకుకు 19 ఏళ్లకే నూరేళ్లు నిండాయా అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

News July 24, 2024

వరంగల్: బడ్జెట్‌పై అసంతృప్తి!

image

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో వరంగల్ జిల్లాకు నిరాశే ఎదురైంది. విభజన హామీల్లో భాగంగా మంజూరైన ములుగు గిరిజన వర్సిటీకి ఈ పద్దులో నిధులు దక్కుతాయని ప్రజలు ఆకాంక్షించారు. కానీ బడ్జెట్‌ ప్రసంగంలో దీనిపై ఎలాంటి ప్రస్తావన రాలేదు. వరంగల్‌ జిల్లాలో నిర్మిస్తున్న కాకతీయ మెగా జౌళి పార్కుకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదు. దీంతో వరంగల్ వాసులు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News July 23, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్..

image

☞MLG: బొగత జలపాతంలో పడి యువకుడు మృతి
☞ BHPL: ఆర్డీవో వాహనం ఢీకొని ఇద్దరికీ గాయాలు
☞MHBD: గుడుంబా తరలిస్తున్న వారిపై కేసు నమోదు
☞MLG: ధర్మవరంలో ఇద్దరిపై కుక్కల దాడి
☞ WPT: గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడులు
☞ MHBD: జిల్లాలో దొంగల బీభత్సం
☞ WGL: స్మగ్లింగ్‌‌కు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు