India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారికి అర్చకులు ఈరోజు ప్రత్యేక అలంకరణ చేపట్టారు. నేడు భోగి పర్వదినం, సోమవారం సందర్భంగా అర్చకులు అమ్మవారు నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. కాగా, సంక్రాంతి సెలవులు రావడంతో ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.
నీటి సంపుటిలో పడి మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. వరంగల్(D) సంగెం (M) ఆశాలపల్లిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. కొండపర్తికి చెందిన రాజు-స్రవంతి పండుగకు ఆశాలపల్లికి వచ్చారు. నిన్న రివాన్స్(3) ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. కొద్ది సమయం తర్వాత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వేతకగా నీటి సంపుటిలో పడి కనిపించాడు. MGMకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
తెలంగాణ ప్రజలందరికీ మంత్రి కొండా సురేఖ భోగి పండగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భోగ భాగ్యాలు, సిరి సంపదలతో సమృద్ధిగా వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. పతంగులు ఎగురవేసే సమయంలో యువత, పిల్లలు, వారి తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గాలిపటాలకు చైనా మాంజాను వాడొద్దని సూచించారు.
> WAY2NEWSతో వర్ధన్నపేట MLA నాగరాజు > గట్టమ్మ ఆలయం వద్ద భక్తుల సందడి > HNK: పథకాలపై మంత్రి పొంగులేటి సమీక్ష > MHBD: అభివృద్ధికి కాంగ్రెస్ కృషి చేస్తుంది: ప్రభుత్వ విప్ > MLG: నెల రోజుల్లో మేడారం జాతర > JN: జిల్లా వ్యాప్తంగా ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు > ఐనవోలు: భక్తులకు అసౌకర్యం కలగకుండా: MLA నాగరాజు
వరంగల్ లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ అమ్మవారు ఈరోజు ఆదివారం సందర్భంగా ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.
ప్రజలకు సత్వర న్యాయం అందాలంటే న్యాయవాదులు ఉత్సాహంగా పనిచేయాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి& జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి బి.విజయసేన్ రెడ్డి అన్నారు. శనివారం చేర్యాలలో ఫస్ట్ క్లాస్ సివిల్ జూనియర్ కోర్టును ప్రారంభించారు. చేర్యాల, కొమరవెల్లి, ధూల్ మిట్ట, మద్దూర్ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలను అందించేందుకు మేము బాధ్యతగా చేర్యాల పట్టణంలో జూనియర్ సివిల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
> JN: తీగారంలో గంటల వ్యవధిలో దంపతుల మృతి> > ఇంటర్ విద్యార్థిని సూసైడ్> సూసైడ్ > షాక్ తో కాడేడ్లు మృతి > WGL: > బెట్టింగ్.. ఆన్లైన్ సూసైడ్> NSPT: చిన్నారిపై పిచ్చికుక్క దాడి> JN: ఇసుక అక్రమ > కేసు నమోదు> MHBD: పూసల తండా శివారులో > నల్లబెల్లం పట్టివేత> WGL: గుట్కా విక్రయం.. అరెస్టు >
గంటల వ్యవధిలో వృద్ధ దంపతులు మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలో వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పాలకుర్తి మండలం తీగారం గ్రామానికి చెందిన బైకాని సోమక్క శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో మరణించింది. భార్య మరణ వార్త తెలుసుకొని షాక్కు గురైన భర్త కొమురయ్య సైతం ఈరోజు ఉదయం చనిపోయారు. గంటల వ్యవధిలో దంపతుల మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఉమ్మడి WGL జిల్లాలో నకిలీ డాక్టర్ల వైద్యం ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. NSPTలో పిల్లలు పుట్టేందుకు నకిలీ వైద్యుడి ట్రీట్మెంట్తో ఓ మహిళ అస్వస్థతకు గురికాగా స్థానికులు పట్టుకున్నారు. ఇలానే.. WDPTలో ఒక ఆటో కార్మికుడు, WGLలో ఆపరేషన్ చేస్తూ ఒకరు, CHPTలో హెర్బల్ మందుల పేరుతో మహిళ మృతి చెందిన ఘటనలు జరిగాయి. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడుల్లో సుమారు 60కి పైగా నకిలీలను గుర్తించారు.
మనస్తాపం చెంది ఓ ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన కాజీపేటలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన విద్యార్థిని(18) హనుమకొండలో 2023-24లో ఇంటర్ చదివింది. పరీక్షలో ఫెయిల్ అవ్వడంతో సప్లిమెంటరీ రాసింది. మళ్లీ తప్పడంతో మసస్తాపం చెంది ఒంటరిగా బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.