Warangal

News July 23, 2024

వరంగల్‌: కేంద్ర బడ్జెట్‌పై గంపెడు ఆశలు!

image

కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సం.కి నేడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు చేసే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. ఈసారైనా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఎయిర్‌పోర్టు విషయంలో ముందడుగు పడుతుందా? అని ఉమ్మడి జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. వరంగల్‌కు మీరు కేంద్రం నుంచి ఏ విధమైన అభివృద్ధి కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.

News July 23, 2024

వరంగల్‌: కేంద్ర బడ్జెట్‌పై గంపెడు ఆశలు!

image

కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సం.కి నేడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు చేసే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. ఈసారైనా కాజేపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఎయిర్‌పోర్టు విషయంలో ముందడుగు పడుతుందా? అని ఉమ్మడి జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. వరంగల్‌కు మీరు కేంద్రం నుంచి ఏ విధమైన అభివృద్ధి కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.

News July 23, 2024

జఫర్గడ్ ఎస్సైని సస్పెండ్ చేసిన సీపీ

image

జఫర్గడ్ SI రవిని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జఫర్‌గడ్ ఠానా పరిధిలోని భూ వివాదంలో నమోదైన కేసులో అలసత్వం వ్యవహరించడం, కేసు విషయంలో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించడం, బాధితులకు న్యాయం చేయకుండా నిందితులకు సహకరించడం వంటి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విచారణ జరిపి అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో సీపీ సస్పెండ్ చేశారు.

News July 23, 2024

పెండ్యాల్-హసన్పర్తి మధ్య బైపాస్ లైను భూసేకరణ

image

పెండ్యాల్(నష్కల్)-హసన్పర్తి రైల్వే స్టేషన్ మధ్య బైపాస్ లైన్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ కోసం కేంద్ర రైల్వే శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జాతీయ మౌలిక వసతుల కల్పనలో భాగంగా జనగామ జిల్లా, హన్మకొండ జిల్లాల్లో ప్రత్యేక రైల్వే ప్రాజెక్టు కింద ఈ భూసేకరణ చేపట్టనున్నట్లు అందులో తెలిపింది.

News July 22, 2024

వరంగల్: రికార్డు ధర పలుకుతున్న మొక్కజొన్న

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధర రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. గత శుక్రవారం రూ.2,750 రికార్డు ధర పలికిన క్వింటా మక్కలు.. ఈరోజు సైతం అదే ధర పలికాయి. రెండు నెలలుగా మక్కల ధరలు భారీగా పెరగడంతో మొక్కజొన్న పండించిన రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న లాగా ఇతర సరుకులు ధరలు కూడా పెరగాలని ఆకాంక్షిస్తున్నారు.

News July 22, 2024

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ ‌కి నేడు మిర్చి తరలి రాగా కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. తేజ మిర్చి శుక్రవారం క్వింటాకు రూ.17, 500 పలకగా.. నేడు రూ.17,800 పలికింది. అలాగే 341 రకం మిర్చి శుక్రవారం రూ.15,200 పలకగా.. నేడు రూ.14,000 ధర వచ్చింది. వండర్ హాట్ (WH) మిర్చికి రూ.13,500 ధర రాగా.. నేడు రూ.15,000 వచ్చింది.

News July 22, 2024

22.7 ఫీట్లకు చేరిన పాకాల సరస్సు నీటి మట్టం

image

వరంగల్ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన పాకాల సరస్సు సోమవారం ఉదయానికి 22.7 ఫీట్లకు నీటి మట్టం చేరుకుంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు సరస్సులోకి వచ్చి చేరుతోంది. పాకాల సరస్సు కింద సుమారు 35 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుత నీటిమట్టంతో సాగునీటికి ఎలాంటి డోకా లేదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News July 22, 2024

వరంగల్: పత్తి క్వింటా రూ.7,150

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభం కాగా పత్తి తరలి వచ్చింది. ధర మాత్రం గత వారంతో పోలిస్తే భారీగా పడిపోయింది. మార్కెట్‌లో క్వింటా పత్తి ధర నేడు రూ.7,150 పలికింది. గతవారం రూ.7,400 వరకు పలికిన పత్తి ఈరోజు భారీగా పడిపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు.

News July 22, 2024

వరంగల్: యువకుడి మృతి

image

మానసిక స్థితి సరిగా లేని యువకుడు బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటకు చెందిన ఎర్ర వంశీ (24) HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చిన అతడు ఈ నెల 19న HYD వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి బయల్దేరాడు. ఆదివారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో వంశీ మృతదేహం కనిపించడంతో రైతులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 22, 2024

వరంగల్: ఎడతెరిపి లేని వర్షం.. చెరువులకు జలకళ!

image

వరంగల్ జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో చెరువుల్లో జలకళ సంతరించుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 816 సాగునీటి చెరువులున్నాయి. వాటిలో 20 పూర్తిగా నిండగా.. 61 చెరువుల్లో 75 నుంచి 100 శాతం వరకు నీరు చేరింది. 273 చెరువుల్లో 50 నుంచి 75 శాతం, 400 చెరువుల్లో 25 శాతం మేరకు నీరు చేరింది. మరో రెండు రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు ప్రకటించారు.