India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు పున: ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. రైతులు నాణ్యమైన, తేమలేని సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
వరంగల్ జిల్లా ఆదివారం సాయంత్రం 4గంటల వరకు జిల్లావ్యాప్తంగా 267MM ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దుగ్గొండి మండలంలో 29.8 MM కురిసింది. నల్లబెల్లి-29.7, ఖిలా వరంగల్-27, ఖానాపురం-26.8, గీసుకొండ-26.7, చెన్నారావుపేట-24.3, వరంగల్-23.4, వర్ధన్నపేట-19.3, నెక్కొండ-18.3, నర్సంపేట-18.3, రాయపర్తి-11.3, పర్వతగిరి-7.2, సంగెం-5.6ల వర్షపాతం నమోదు అయ్యింది.
ఏటూరునాగారం మండలం దొడ్ల- మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపిలేని కుండపోత వర్షాలతో వాగుకు వరద పోటెత్తింది. దీంతో లోతట్టు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కాగా ఇప్పటికే అధికారులు సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలిస్తున్నారు. గతేడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు వాగు పొంగి 8 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండం చెరువులో ఓ మత్స్యకారుడి వలకు 32 కిలోల భారీ చేప చిక్కింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చెరువు నుంచి పెద్ద చేపలు వాగులోకి ఎదురు వెళ్తున్నాయి. పిల్లి సతీష్ అనే మత్స్యకారుడు చెరువులోకి వాగు నీరు చేరే చోట వల ఏర్పాటు చేశాడు. వల ఎంతకూ రాకపోవడంతో ఇతరుల సాయంతో వలను ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో 32 కిలోల పెద్ద చేప చిక్కడంతో సతీశ్ ఆనందం వ్యక్తం చేశారు.
శ్రీ భద్రకాళీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఆదివారం భద్రకాళి అమ్మవారు శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కాగా, అమ్మవారిని శాకాంబరి అవతారంలో దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు.
భద్రకాళి అమ్మ వారి శాకంబరి ఉత్సవం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 3.50టన్నుల కూరగాయలు, 400కిలోల పండ్లు, 200కిలోల ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించనున్నారు. నేడు శ్రీభద్రకాళి అమ్మవారి శాకంబరి విశ్వరూప దర్శనం ఉంటుందని కార్యనిర్వహణ అధికారిణి శేషుభారతి, ప్రధానార్చకుడు శేషు తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీ-ఫార్మసీ మొదటి, ఏడో సెమిస్టర్ షెడ్యూల్ను శనివారం కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్. నరసింహాచారి విడుదల చేశారు. ఈ నెల 26న పేపర్ 1, 27న పేపర్ 2, 30న పేపర్ 3, 31న పేపర్ 4 పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని తెలిపారు.
తల్లిదండ్రులు చనిపోయారని మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం.. హసనపర్తి మండలం పెగడపల్లికి గ్రామానికి చెందిన పిన్నింటి హరీశ్(30) తల్లిదండ్రులు కొంత కాలం క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి ఇంటిలో ఒక్కడే ఉంటూ మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈనెల 18న పురుగు మందు తాగాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కేసు నమోదైంది.
జిల్లాలోని నూతన ప్రాంతాల్లో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడుతూ ఎప్పటికప్పుడూ గోదావరి వరద పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందస్తు ఏర్పాటు చేసిందని తెలిపారు. వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీతక్క పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతిచెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ వద్ద జరిగింది. మృతురాలు కలకోట్ల స్వప్న (40)గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.