Warangal

News January 29, 2025

వరంగల్: ‘రైతు భరోసా’ భూముల సర్వే పూర్తి!

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం వరంగల్ జిల్లాలో రైతు భరోసా పథకం అమలు కోసం భూముల సర్వేను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. పథకంలో సాగు చేసే భూములను, సాగుకు సంబంధం లేని భూములను సర్వేలో అధికారులు గుర్తించారు. ఇందులో జిల్లాలో 2.67 లక్షల ఎకరాలను సాగులో ఉన్నవిగా, 2,350 ఎకరాలను సాగులో లేనివిగా నిర్ధారణకు వచ్చారు. ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదించారు.

News January 29, 2025

ఎంజీఎంలో పిల్లలకు గుండె వైద్య శిబిరం

image

ఈ నెల 30న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో సంయుక్తంగా పిల్లలకు గుండె పరీక్షల వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డీహెచ్ఎంఓ సాంబశివరావు తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు చిన్నారులకు ఉచితంగా 2D ఎకో పరీక్షలు నిర్వహిస్తారని, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయన్నారు. వరంగల్ జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 29, 2025

వరంగల్: నేడు జాబ్ మేళా

image

వరంగల్ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఓ ఫార్మా కంపెనీ 100 ఉద్యోగాలకు బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ఉపాధి కల్పన జిల్లా అధికారి సీహెచ్ ఉమారాణి తెలిపారు. రిటైల్ ట్రైనీ అసోసియేట్, ఫార్మసీ అసిస్టెంట్, ట్రైనీ ఫార్మాసిస్ట్ ,ఫార్మాసిస్ట్ విభాగాల్లో 100 ఉద్యోగాలకు ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, డీ ఫార్మా, బీ ఫార్మా, ఎం ఫార్మా అభ్యర్థులు అర్హులన్నారు.

News January 28, 2025

వరంగల్ మార్కెట్‌లో ఉత్పత్తుల ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వివిధ రకాల ఉత్పత్తులు తరలివచ్చాయి. అకిరా బ్యాగడి మిర్చి రూ.12 వేలు పలకగా 5531 మిర్చి రూ.12 వేలు, 3341 రకం మిర్చి రూ.11,500 పలికింది. నం. 5 మిర్చి రూ.13,500, సూక పల్లికాయ రూ.6,000, పచ్చి పల్లికాయ రూ.5,100, మక్కలు (బిల్టీ) రూ.2,540 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు.

News January 28, 2025

ఎంజీఎంలో కుప్పకూలిన రోగి

image

ఆరోగ్య సమస్యతో హాస్పిటల్‌కి వెళ్తే హాస్పిటల్‌లోనే కుప్పకూలిన ఘటన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆరోగ్య సమస్యతో శాయంపేటకు చెందిన పిక్కల శ్రీనివాస్ (42)  మంగళవారం ఉదయం ఎంజీఎం ఆస్పత్రిలో ఓపీ తీసుకున్నారు. ఆ తర్వాత ఓపీ చూపించుకోవడానికి లైన్‌లో నిలబడి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు పరిశీలించి వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు పరీక్షించి మరణించాడని ధ్రువీకరించారు.

News January 28, 2025

రేపు వరంగల్ మార్కెట్ బంద్

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రేపు బంద్ ఉండనున్నట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. బుధవారం అమావాస్య సందర్భంగా మార్కెట్‌కి సెలవు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కావున రైతులు విషయాన్ని గమనించి రేపు సరుకు తీసుకొని రావద్దని, తిరిగి గురువారం మార్కెట్ ప్రారంభం అవుతుందని వివరించారు.

News January 28, 2025

వరంగల్: మళ్లీ భారీగా పడిపోయిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గత మూడు రోజులుగా దారుణంగా పడిపోతున్నాయి. గతవారం క్వింటా పత్తి రూ.7,200కి పైగా పలకగా, నిన్న (సోమవారం) రూ.7,020కి పతనమైంది. ఈరోజు మరింత తగ్గి రూ.6,940 కి పడిపోయింది. ఒకరోజు వ్యవధిలోనే రూ.100 చొప్పున ధర తగ్గుతుండటంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ధరలు పెరగాలని ఆకాంక్షిస్తున్నారు.

News January 28, 2025

శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

భద్రకాళి దేవస్థానంలో నేడు మంగళవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ అర్చకులు తదితరులున్నారు.

News January 28, 2025

అర్ధనారీశ్వరుని అలంకరణలో రుద్రేశ్వరస్వామి

image

చారిత్రాత్మకమైన వేయి స్తంభాల దేవాలయంలో నేడు సోమవారం మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ రుద్రేశ్వరస్వామి వారికి అభిషేకం నిర్వహించి అర్ధనారీశ్వరునిగా ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అర్ధనారీశ్వరుని రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మణికంఠ శర్మ తదితరులున్నారు.

News January 28, 2025

పదోన్నతి అర్హత పరీక్షను పరిశీలించిన సీపీ

image

హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐగా పదోన్నతికి మడికొండ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏర్పాటుచేసిన అర్హత పరీక్షను వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం పరిశీలించారు. భద్రాద్రి, కాళేశ్వరం జోన్ల పరిధిలో వివిధ పోలీస్ స్టేషనల్లో విధులు నిర్వహిస్తున్న 108 సివిల్ హెడ్ కానిస్టేబుల్లకు అందజేసే ASI పదోన్నతికి సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో అర్హత పరీక్షలు ఏర్పాటు చేశారు. సిపి అంబర్ కిషోర్ ఝా పరీక్షలను పరిశీలించారు.