India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం, వరంగల్ రోడ్డులోని బెటాలియన్ హెచ్పీ పెట్రోల్ పంపు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి బొల్లికుంటకు వెళ్తున్న కారు నల్లబెల్లి నుంచి వరంగల్ వెళ్తున్న ఆటోను ఢీకొంది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను 108లో ఎంజీఎంకు తరలించారు. ఘటనా స్థలానికి చెరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
గీసుగొండ మండలంలోని శాయంపేట హవేలీ గ్రామంలో బాలుడు నీటి సంపులోపడి మృతి చెందాడు. CI మహేందర్ కథనం ప్రకారం.. బెల్లంపల్లికి చెందిన శుభశ్రీ తన కుమారుడు శివాదిత్య(6)తో కలిసి శాయంపేటలోని తల్లిగారింట్లో నివాసం ఉంటుంది. ఆదివారం శుభశ్రీ స్నానానికి వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి కుమారుడు కనిపించకపోవడంతో గాలించింది. కాగా ఇంటి పక్కన ఉన్న నీటి సంపులో చనిపోయి కనిపించడంతో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.
వరంగల్ జిల్లా మామునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి హరీష్ రావు ‘X’ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు.
వరంగల్లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి అమ్మవారు ఆదివారం సందర్భంగా ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు..
WGLలోని కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి ఆయా శాఖలు అధికారులను ఫోన్లలో సంప్రదించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. సులువుగా పరిష్కరించాల్సిన సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను మందలించారు. మరోసారి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
వరంగల్ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో శనివారం స్వచ్ఛ సర్వేక్షన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు కమ్యూనిటీ ఆర్గనైజర్లు జవాన్లతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే పాల్గొన్నారు. స్వచ్ఛ టూల్కిట్ ను సమర్థవంతంగా నిర్వహించుటకు వారు తగు సూచనలు చేశారు.
గీసుగొండ మండలం మరియపురం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో అర్హుల జాబితాను చదవగా అందులో పేరు వచ్చిన గొలమారి జ్యోజిరెడ్డి అనే వ్యక్తి ఆ పథకానికి తాను అనర్హుడనని, ఆ పథకం తనకు వద్దని ముందుకు రాగా మండల ప్రత్యేక అధికారి డి.సురేష్, తహశీల్దార్ ఎండీ రియాజుద్దీన్ అతడిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి అమ్మవారు శనివారం సందర్భంగా ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.
నర్సంపేట మాజీ కౌన్సిలర్ వెంకటమ్మ, స్వామి దంపతుల మీద దాడిని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రోడ్డు వెడల్పులో భాగంగా వెంకటమ్మ, స్వామి ఇంటి గోడను కూల్చే విషయంలో కుట్ర జరిగిందని ఆరోపించారు. దాడి జరిగే సమయంలో పోలీసులను సంప్రదించడానికి ప్రయత్నిస్తే పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదని పెద్ది ఆరోపించారు. కాంగ్రెస్ వారికి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని పెద్ది ప్రశ్నించారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం సైతం వివిధ రకాల అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలివచ్చాయి. 1048 రకం మిర్చి రూ.12,500, అకిరా బ్యాగడి మిర్చి రూ.13 వేలు పలికింది. అలాగే పాత తేజ మిర్చి ధర రూ.14,000, పాత 341 రకం మిర్చి ధర రూ.15,500, పాత వండర్ హాట్ మిర్చి రూ.14,000, 5531 మిర్చి రూ.12 వేల ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. సూక పల్లికాయ రూ.6,210, పచ్చిపల్లికాయ రూ.4 వేలు పలికాయి.
Sorry, no posts matched your criteria.