Warangal

News January 5, 2025

వరంగల్ జిల్లా కలెక్టర్‌కు MLC వినతిపత్రం

image

వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద దేవిని ఈరోజు MLC బస్వరాజ్ సారయ్య, 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్లు కలెక్టరేట్‌లో కలిశారు. వరంగల్ నగరానికి చెందిన కార్మిక మిల్లు భవనం స్థలంలో ఎలాంటి పర్మిషన్ ఇవ్వొద్దని, ఇచ్చిన పర్మిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కూల్చి వేసిన కార్మిక భవన్ ప్రాంతంలోనే కొత్త కార్మిక భవన్‌ను నిర్మించాలని కోరారు.

News January 5, 2025

MHBD: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

రోడ్డు భద్రత అవగాహన ప్రమాణాలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి పాలనాధికారి అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు తీసుకుంటున్న చర్యలు, ప్రయాణికులకు కలిగిస్తున్న అవగాహన గురించి వారు మంత్రికి వివరించారు.

News January 4, 2025

రోడ్డు భద్రత ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలి: WGL కలెక్టర్

image

జిల్లాలో ప్రజలకు రహాదారి భద్రతపై అవగాహన కల్పించి ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు జిల్లా కలెక్టర్ డా.సత్య శారదా అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల అవగాహనపై జిల్లా కలెక్టర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు తెలిపారు.

News January 4, 2025

నెరవేరిన పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజి కల!

image

పారాలింపిక్స్ మెడల్ సాధించిన సమయంలో దీప్తి జీవాంజిని చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మీకేం కావాలని అడగగా.. మెగాస్టార్ చిరంజీవిని కలవాలని ఉందని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం అకాడమీలో మెగాస్టార్ చిరంజీవిని దీప్తి కలిసి తన కలను నెరవేర్చుకున్నారు. కాగా, పర్వతగిరి(M) కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి అర్జున అవార్డుకి ఎంపికవడం వరంగల్ జిల్లాకే గర్వకారణమని జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News January 4, 2025

జిల్లా సమగ్రాభివృద్ధిలో పాత్రికేయుల సహకారం అవసరం: WGL కలెక్టర్

image

జిల్లా సమగ్రాభివృద్ధిలో పాత్రికేయుల సహకారం అవసరమని కలెక్టర్ సత్య శారదా అన్నారు. నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో పాత్రికేయులతో(ముఖా ముఖి) కార్యక్రమం నిర్వహించారు. పాత్రికేయులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ నిరంతరం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నారని.. జిల్లాలో ప్రజలు ఎలాంటి సమస్యలకు గురైన పాత్రికేయులు తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

News January 3, 2025

వరంగల్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉమ్మడి జిల్లా మంత్రులు

image

సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క కలిశారు. సావిత్రిబాయి ఫులే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటిస్తూ జీవో జారీ చేసినందుకు సీఎంను మంత్రులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News January 3, 2025

క్యాలెండర్లను ఆవిష్కరించిన మంత్రి కొండా

image

సచివాలయంలో తెలంగాణ బయో డైవర్సిటి బోర్డ్ నూతన క్యాలెండర్లను అధికారులతో కలిసి మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. అంతకుముందు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు మంత్రిని కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పిసిసిఎఫ్(హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్, తెలంగాణ బయోడైవర్సిటి బోర్డు ఛైర్మన్ కాళిచరణ్, తదితరులు పాల్గొన్నారు.

News January 3, 2025

వరంగల్ మార్కేట్లో పెరిగిన పల్లికాయ ధర

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు పల్లికాయ తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకు గురువారం రూ.7,200 ధర పలకగా.. నేడు రూ.7,300 పలికింది. అలాగే పచ్చి పల్లికాయ రూ.4,680 ధర పలకగా నేడు రూ.4,700 పలికింది. అలాగే 5531 రకం మిర్చి క్వింటాకు రూ.12,500, అగ్ని మిర్చి ధర రూ.14వేలు పలికింది.

News January 3, 2025

పథకాలు, కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి: మంత్రి సురేఖ

image

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి మంత్రి కొండా సురేఖ పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళల స్వయం సాధికారత దిశగా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. సావిత్రిబాయి ఫూలే జయంతిని తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడం పట్ల మంత్రి సురేఖ హర్షం వ్యక్తం చేశారు.

News January 3, 2025

సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూల మాలలు వేసిన WGL కలెక్టర్

image

వరంగల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో విద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి, అదనపు కలెక్టర్ సంధ్యా రాణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహిళల చదువు కోసం విశేష కృషి చేసిన గొప్ప మాతృమూర్తి, వారు కొనియాడారు.