India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మామిడి సాగులో ఆధునిక పద్ధతులు పాటించి అధిక ఉత్పత్తులు సాధించి ఎగుమతుల్లో పోటీ పడాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. గురువారం ఎనుమాముల మార్కెట్ కార్యాలయంలో వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో శుక్రవారం జరిగే మామిడి రైతుల అవగాహన కార్యక్రమంపై పండ్ల మార్చంటస్, మార్కెటింగ్ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులతో జరిగిన సన్నాహక సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
> PLK: 10న వల్మీడీ ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
> WGL: అర్జున అవార్డుకు ఎంపికైన దీప్తి జీవాంజి
> WGL: తగ్గిన మొక్కజొన్న ధర
> JN: ఈ-కార్ కేసులో జైలుకుపోవడం ఖాయం: MLA కడియం
> MHBD: CM రేవంత్ రెడ్డిని కలిసిన డోర్నకల్ MLA
> HNK: Way2Newsతో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆవేదన
> BHPL: గ్రామాల అభివృద్ధి ప్రజా ప్రభుత్వ లక్ష్యం: MLA గండ్ర
> WGL: దమ్మన్నపేట క్రాస్ సమీపంలో రోడ్డు ప్రమాదం
> WGL: భర్త సమాధి వద్ద ఉరేసుకున్న భార్య
> MHBD: ముల్కలపల్లిలో అనారోగ్యంతో వ్యక్తి మృతి
> NSPT: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
> WGL: డ్రంక్ అండ్ డ్రైవ్ లో 51 మందికి జరిమానా
> HNK: డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
> WGL: ఆటోలో నుంచి జారిపడి యువకుడు మృతి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ నెల 10న ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ మోహన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ.. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ముక్కోటి ఏకాదశి- వైకుంఠ ద్వార సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు.
వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు గురువారం వివిధ రకాల చిరు ధాన్యాలు తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకు రూ.7,200 ధర పలకగా, పచ్చి పల్లికాయ రూ.4,680 ధర పలికింది. అలాగే పసుపు క్వింటాకు రూ.11,329 ధర పలికింది. కాగా మంగళవారంతో పోలిస్తే పల్లికాయ ధరలు పెరగగా పసుపు ధర స్వల్పంగా తగ్గింది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి ఈరోజు మొక్కజొన్న తరలివచ్చింది. మంగళవారం మక్కలు (బిల్టీ) క్వింటాకి ధర రూ.2,570 పలకగా.. ఈరోజు రూ.2,565కి పడిపోయింది. అలాగే కొత్త తేజ మిర్చి ధర రూ.15,500 పలకగా, కొత్త 341 రకం మిర్చి సైతం రూ.15,500 పలికినట్లు వ్యాపారులు తెలిపారు.
భర్త మరణంతో కుమిలిపోతున్న భార్య ఆయన సమాధి వద్దే ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన WGLలోని దేశాయిపేటలో జరిగింది. జన్ను సారయ్య, సమ్మక్క(61) దంపతులకు నలుగురు పిల్లలు. సారయ్య మూడేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి భర్తను తలుచుకొని సమ్మక్క నిత్యం కుమిలిపోయేది. ఈక్రమంలో మంగళవారం భర్త సమాధి వద్ద ఉరేసుకుంది. కుమారుడు బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వ పరంగా విజయాల కన్నా వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రజలకు కోటి ఆశలు చూపిన పార్టీ.. ఏట్లో రాయి కాదు, కనీసం కూట్లో రాయి కూడా తీయలేదన్నారు. అభయహస్తం ప్రజలను భయపెట్టే, బాధపెట్టే హస్తంగా మారిందని విమర్శించారు. సంవత్సర కాలంలోనే ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని అన్నారు.
వరంగల్ నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభం కానుంది. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటించగా నేడు ప్రారంభమవుతుందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. ఉ.6 గం.ల నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభంఅవుతాయన్నారు. రైతులు నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి మంచిధర పొందాలని సూచిస్తున్నారు.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వర ఆలయంలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా సిద్దేశ్వరుడికి 51 రకాల, 51 కిలోల మిఠాయితో ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. అనంతరం సిద్దేశ్వరుడిని భక్తులు దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.
Sorry, no posts matched your criteria.