India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిల్పూర్ మండల కేంద్రంలో గురువారం ఎంపీపీ, ఎంపీటీసీల పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదవికి విరమణ ఉంటుంది తప్ప.. ప్రజాసేవకు విరమణ ఉండదని అన్నారు. పదవీ కాలం ముగిసిన ప్రతి రాజకీయ నాయకుడు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. ఎంపీపీ, ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు.
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ములుగు <<13649861>>DMHO <<>>డా.అల్లెం అప్పయ్యకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. కిలోమీటర్ల కొద్దీ అడవుల్లో నడిచి, కొండలు ఎక్కి, వాగులు దాటి ఆదివాసీలకు వైద్యసేవలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు. ములుగు DMHOను ఆదర్శంగా తీసుకుని ఇతర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలతో పాటు గిరిజనులకు వైద్యసేవలు అందించాలని కోరారు.
WGL: ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నామని రాష్ట్ర దేవాదాయ మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందన్నారు. రైతు రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయమని, రాష్ట్రంలోని రైతుల తరఫున సీఎంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు.
అరుణాచలంలో ఈనెల 21న గురు పౌర్ణమి సందర్భంగా HNK నుంచి ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు నర్సంపేట RTC DM లక్ష్మి తెలిపారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు HNK నుంచి బయల్దేరుతుందన్నారు. ఈ బస్సు సర్వీసులో కాణిపాక వరసిద్ధి వినాయక, వేలూరు మహాలక్ష్మి అమ్మవారు, జోగులాంబ అమ్మవారి దర్శన అవకాశం ఉంటుందని తెలిపారు. NSPT ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ ఏసీ మిర్చి క్వింటాకు రూ. 17వేల ధర పలకగా.. 341 రకం మిర్చి రూ.16వేలు పలికింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చికి రూ. 14వేల ధర వచ్చింది. అయితే మొన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు తగ్గాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మహిళలు మార్క్ చూపిస్తున్నారు. కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారదాదేవి, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా సహా రెండు జిల్లాల్లో ఇతర ముఖ్య అధికారులు మహిళలే కావడం విశేషం. రాణి రుద్రమదేవి పరిపాలించిన వరంగల్ నగరంలో మహిళా అధికారులు అంకితభావంతో సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ తమ మార్క్ చూపిస్తున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు పతనమవుతూ వస్తుంది. ఈ క్రమంలో గత రెండు రోజులతో పోలిస్తే పత్తి ధర ఈరోజు తగ్గింది. సోమవారం రూ.7,310 పలికిన క్వింటా పత్తి.. మంగళవారం రూ.7,350కి చేరింది. నిన్న మార్కెట్ బంద్ ఉండగా.. ఈరోజు ప్రారంభమై రూ.7,235కి పడిపోయింది. దీంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
పర్వతగిరి మండలంలో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. SI వెంకన్న వివరాలు.. ఇంటర్ చదువుతున్న G.ఐశ్వర్య(16) కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందగా.. అందుకు M.ఛత్రపతి అనే వ్యక్తి కారణమని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మెడకు ఉరేసుకున్నట్లు, మృతదేహం పక్కన చీర పడి ఉంది. ఛత్రపతికి ఐశ్వర్యకు ఇటీవల ఎంగేజ్మెంట్ అయిందని SI తెలిపారు.
బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తొర్రూరు సీఐ సంజీవ బుధవారం తెలిపారు. దంతాలపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన రాజు కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ సంజీవ తెలిపారు.
కేయూ పరిధిలో బీపీఈడీ సెకండ్ సెమిస్టర్ (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈనెల 23వ తేదీ వరకు గడువు ఉందని KU పరీక్షల నియంత్రణాధికారి నరసింహచారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.250 అపరాధ రుసుముతో ఈనెల 26వ తేదీ వరకు ఫీజు చెల్లించుకోవచ్చని తెలిపారు. రూ.730 అన్ని పేపర్లు, బ్యాక్ లాగ్స్ 3 పేపర్లు రూ.630, ఇంప్రూవ్మెంట్కు రూ.300 చెల్లించాలి.
Sorry, no posts matched your criteria.