Warangal

News July 17, 2024

WGL: ఇప్పటి వరకు అంతంతే సాగు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు అంతంతమాత్రమే సాగుతోంది. ఇప్పటివరకు 39.35 శాతం పంటల్ని వేశారు. గతేడాదితో వర్షపాతం విషయంలో పెద్దగా మార్పులేమి లేకున్నా సాగులో మాత్రం వెనకబడింది. సాధారణంగా సాగు చేసే భూమి 15,36,907 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు సాగైంది 6,04,745 మాత్రమే. పత్తి 4,62,452, మొక్కజొన్న 37,516, వరినాట్లు 20,378 ఎకరాల్లో సాగుచేశారు.

News July 17, 2024

ములుగు: రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో వేలం పాట

image

ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలోని ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కొబ్బరికాయలు పూజా సామగ్రి అమ్ముకోవడానికి మంగళవారం వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో 2024-25 సంవత్సరానికి గాను రూ.5,20,500 పాట పాడి జనగాం రమేశ్ దక్కించుకున్నారు. గత సంవత్సరం రూ.4,31,000 వచ్చినట్లు దేవదాయ శాఖ పరిశీలకులు డి.అనిల్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News July 16, 2024

ములుగు: జలపాతాలకు వెళ్లే వారిపై పోలీసుల నజర్

image

ములుగు జిల్లాలోని వివిధ జలపాతాలకు వెళ్లే వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం మండలాల పోలీసులు నిత్యం వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మద్యం సేవించి జలపాతంలోకి దిగొద్దని హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. పర్యాటకులు ఈ విషయాలు గమనించాలని కోరారు.

News July 16, 2024

వరంగల్: బాధిత కుటుంబానికి కేటీఆర్ రూ.5 లక్షలు

image

వరంగల్ జిల్లాలోని పదహారు చింతల్ తండాలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. పార్టీ తరఫున రూ.5 లక్షల సాయంతో పాటు పిల్లలిద్దరీ చదువు బాధ్యత తనదేనని చెప్పారు. మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు అందించాలని విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడిన నిందితుడు నాగరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

News July 16, 2024

వరంగల్: భారీగా పెరిగిన 341 రకం మిర్చి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌‌లో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి.
ఏసీ తేజ మిర్చి సోమవారం క్వింటాకు రూ.17,700 పలకగా.. నేడు రూ.17,100 పలికింది.
అలాగే 341 రకం మిర్చికి సోమవారం రూ.14,000 ధర రాగా నేడు రూ.16,500 ధర వచ్చింది.
వండర్ హాట్(WH) మిర్చి నిన్న రూ.14,500 ధర రాగా.. నేడు రూ.15,500కి పెరిగింది.

News July 16, 2024

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.7,350

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు రైతన్నలను అయోమయానికి గురి చేస్తూ నిరాశ కలిగిస్తున్నాయి. సోమవారం రూ.7,310 పలికిన క్వింటా పత్తి.. నేడు రూ.7,350కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

News July 16, 2024

మేడిగడ్డలో నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి

image

భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి నిలకడగా ప్రవహిస్తోంది. మహదేవ్‌పూర్ మండలం కాలేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజీలో 41,200 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. వచ్చిన వరదను వచ్చినట్లుగా 85 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజ్లో గత రెండు రోజుల నుంచి నిలకడగా వరద కొనసాగుతున్నట్లు తెలిపారు.

News July 16, 2024

రాజన్న సన్నిధిలో రేపటి ప్రత్యేక పూజలు ఇవే!

image

వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఆషాడ తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు. స్వామివారికి, అనుబంధ పరివార దేవతలకు ఉదయం అభిషేక అర్చనలు, శ్రీరుక్మిణి విఠలేశ్వర స్వామివార్లకుకు పంచోపనిషత్ ద్వారా అభిషేకం మహాపూజ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 17, 18వ తేదీల్లో అఖండ భజన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News July 16, 2024

WGL: నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్

image

చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించిన పాలకుర్తి మండలం వావిలాల గ్రామానికి చెందిన కోల శ్రీను(33) కుటుంబానికి మాజీ మంత్రి KTR అండగా నిలిచారు. BRS సోషల్ మీడియా ఇంచార్జీ వినయ్.. పిల్లలను ఆదుకోవాలని ట్వీట్ చేయగా KTR స్పందించి పిల్లలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం వినయ్‌తో మాట్లాడి పూర్తి వివరాలను KTR అడిగి తెలుసుకున్నారు.

News July 16, 2024

నెక్కొండ: బాలుడి మృతి ఘటన… సుమోటోగా స్వీకరణ

image

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ముదిగొండలో బాలుడి మృతి ఘటన కేసును తెలంగాణ వైద్య మండలి సుమోటోగా స్వీకరించారు. ఈమేరకు టీజీఎంసి రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల మనది పనే బాలునికి కుక్క కరవగా MGMలో 3 ARV ఇంజక్షన్లు వేయగా.. నాలుగోది RMP వద్ద వేయించారు. దీంతో ఐదు నిమిషాలలోపే మృతి చెందగా, విషాదం నెలకొంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మండిపడ్డారు.