Warangal

News December 30, 2024

పాకాల అభయారణ్యంలో పెద్ద పులి!

image

కొన్ని రోజులుగా ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో సంచరిస్తున్న <<15014632>>పెద్ద పులి పాకాల <<>>అభయారణ్యంలోకి వెళ్లింది. మూడేళ్ల కిందట పాకాల అడవిలోకి వచ్చిన పులి.. మళ్లీ ఇప్పుడు వచ్చిందని అధికారులు గుర్తించారు. నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం మీదుగా పాకాల అడవిలోకి వెళ్లినట్లు నిర్ధారించారు. పులి అడవిలోకి వెళ్లడంతో ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

News December 30, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> MLG: విద్యుత్ షాకుతో రైతు మృతి..
> MHBD: కొమ్ములవంచలో పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య..
> WGL: తిమ్మంపేట లో గుట్కా ప్యాకెట్లు పట్టివేత..
> JN: డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన
> WGL: తల్లి, కూతురు సూసైడ్ అటెంప్ట్
> MLG: అడవి పంది, అడవి కోడిని వేటాడిన వ్యక్తులపై కేసు
> WGL: ధర్మారంలో గుర్తుతెలియని మృతదేహం

News December 29, 2024

నల్లబెల్లి: కూతురు, తల్లి సూసైడ్ ATTEMPT

image

కూతురికి పురుగు మందు తాగించి తల్లి కూడా తాగిన ఘటన నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. శ్రీను సంతానం కోసం మానసను రెండో వివాహం చేసుకున్నాడు. వీరి దాంపత్య జీవితంలో విఘ్నేశ్, సాత్విక జన్మించారు. కాగా కొద్దిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తాను పురుగు మందు తాగి కూతురికి కూడా తాగించింది. గమనించిన స్థానికులు 108లో నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. 

News December 29, 2024

నల్లబెల్లి: అక్కడా, ఇక్కడా ఒకటే పులి

image

నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో నిన్న గ్రామస్థులకు పులి కనిపించిన విషయం తెలిసిందే. ఘటనా స్థలాన్ని అటవీశాఖ అధికారులు పరిశీలించారు. కొత్తగూడ, నల్లబెల్లిలో సంచరించిన పులి ఒకటేనని వారు స్పష్టం చేశారు. కాగా, నల్లబెల్లి మండలంలోని చుట్టు పక్కల గ్రామస్థులు భయందోళనకు గురవుతున్నారు. శనివారం ఓ మహిళకు, పొలానికి వెళ్లిన రైతులకు పెద్దపులి కనిపించింది.

News December 29, 2024

పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలి: డీఐఈఓ

image

మార్చి 5 నుంచి నిర్వహించే ఇంటర్ వార్షిక పరీక్షలకు పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ అన్నారు. వరంగల్ పట్టణంలోని పలు ప్రైవేట్ కళాశాలలు, పరీక్షా కేంద్రాలను డీఐఈఓ సందర్శించారు. వార్షిక పరీక్షలకు గాను అన్ని గదుల్లో డ్యుయల్ డెస్కులు, గాలి, నీరు, విద్యుత్, ఫ్యాన్లు, నీటి వసతి, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని డీఐఈఓ సూచించారు.

News December 28, 2024

జనగామ: హెల్ప్ లైన్ నంబర్లపై విద్యార్థులకు అవగాహన 

image

జనగామ మండలం చౌడారంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం, సఖి కేంద్రం ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. మహిళలు ఎక్కడైనా హింసకు గురైతే 181, బాల్య వివాహాలు అరికట్టడానికి 1098 నంబర్లను సంప్రదించాలంటూ విద్యార్థులతో మానవహారం చేపట్టారు. 

News December 28, 2024

వరంగల్‌కు నాస్కామ్ శుభవార్త!

image

వరంగల్‌‌కు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(NASSCOM) శుభవార్త చెప్పింది. HYD తర్వాత వరంగల్ నగరం గ్లోబల్ కేపబిలీటీ సెంటర్ల(జీసీసీ)కు డెస్టినేషన్‌లుగా మారనున్నాయని తెలిపింది. జిల్లాలో ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన ఇంజినీరింగ్ కాలేజీలు, మానవ వనరులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. రాజధానికి దగ్గర్లో ఉండటం, అక్కడితో పోలిస్తే భూముల రేట్లు తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.

News December 28, 2024

ముందస్తు చర్యలతో నేరాలు అదుపు: వరంగల్ సీపీ

image

నేరాల నియంత్రణలో భాగంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు తీసుకుంటున్న ముందస్తు చర్యలతో నేరాలు తగ్గాయని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. నేరాలకు సంబంధించి నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేయడంతో పాటు కోర్టుకు తగిన సాక్షాధారాలు సమర్పించడంతో కమిషనరేట్ పరిధిలో దాదాపు 2,462 మందికి శిక్షలు విధించినట్లు సీపీ చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసులు అధికారులు పాల్గొన్నారు. 

News December 28, 2024

వరంగల్‌కు నాస్కామ్ శుభవార్త!

image

వరంగల్‌‌కు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(NASSCOM) శుభవార్త చెప్పింది. HYD తర్వాత వరంగల్ నగరం గ్లోబల్ కేపబిలీటీ సెంటర్ల(జీసీసీ)కు డెస్టినేషన్‌లుగా మారనున్నాయని తెలిపింది. జిల్లాలో ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన ఇంజినీరింగ్ కాలేజీలు, మానవ వనరులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. రాజధానికి దగ్గర్లో ఉండటం, అక్కడితో పోలిస్తే భూముల రేట్లు తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.

News December 28, 2024

మన్మోహన్ పార్థివదేహానికి ఎంపీ వద్దిరాజు నివాళి

image

ప్రధాన మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఆయన పార్థివదేహానికి కేటీఆర్‌, వద్దిరాజు రవిచంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణల ప్రముఖుడిగా పేరుగాంచిన ఆయన మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.